Trends

అమెరికాలో బిర్యానీ లవర్స్‌కు షాక్ తప్పదా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. భారత్ సహా వియత్నాం, థాయిలాండ్ నుంచి వచ్చే బియ్యంపై అదనపు పన్నులు వేస్తానని హెచ్చరించారు. అయితే ఈ వార్నింగ్ చూసి మన ఎగుమతిదారులు ఏమాత్రం కంగారు పడటం లేదు. ట్రంప్ నిర్ణయం వల్ల ఇండియాకు పెద్దగా నష్టం ఉండదని, అసలు దెబ్బతినేది అమెరికా ప్రజలేనని వారు తేల్చి చెబుతున్నారు. అక్కడి బిర్యానీ ప్రియుల జేబులకు చిల్లు పడటం ఖాయమని అంటున్నారు.

గణాంకాలు చూస్తే.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి అమెరికాకు దాదాపు 337 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 2800 కోట్లు) విలువైన బాస్మతి బియ్యం ఎగుమతి అయ్యింది. అదే సమయంలో నాన్ బాస్మతి బియ్యం ఎగుమతులు కేవలం 54 మిలియన్ డాలర్లు మాత్రమే. దీన్ని బట్టి చూస్తే అమెరికా మార్కెట్‌లో మన బాస్మతికి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద మనం ఏటా దాదాపు 390 మిలియన్ డాలర్ల బియ్యాన్ని అమెరికాకు పంపిస్తున్నాం.

అసలు విషయం ఏంటంటే.. అమెరికాలో పండే బియ్యం మన బాస్మతికి సాటిరాదు. మన బాస్మతి వాసన, రుచి, ఆకృతి అక్కడ దొరకదు. అమెరికాలో ఉండే భారతీయులు, ఆసియా వాసులు బిర్యానీలు, పులావ్‌ల కోసం కచ్చితంగా ఇండియన్ బాస్మతినే వాడతారు. కాబట్టి ట్రంప్ పన్ను పెంచినా సరే, ఎక్కువ రేటు పెట్టి మరీ జనం కొంటారు తప్ప, వేరే బియ్యానికి మారరు. దీనివల్ల అంతిమంగా భారం పడేది కస్టమర్ల మీదే.

గతంలో పన్ను 10 శాతంగా ఉండేది, దాన్ని పెంచినప్పుడు కూడా ఎగుమతులు తగ్గలేదు. పెరిగిన ధరను వినియోగదారులే భరించారు. మన రైతులకు, వ్యాపారులకు రావాల్సిన లాభాలు యథావిధిగా వచ్చాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతుందని ఎగుమతిదారులు నమ్మకంగా ఉన్నారు. మన బియ్యం అక్కడ “డంపింగ్” అవుతోందని ట్రంప్ ఆరోపిస్తున్నా, వాస్తవం మాత్రం వేరేలా ఉంది. మన రైస్ అక్కడి మార్కెట్‌లో ఒక స్పెషల్ బ్రాండ్.

భారత రైస్ ఇండస్ట్రీ చాలా బలంగా ఉందని, కేవలం అమెరికానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మనకు మార్కెట్ ఉందని నిపుణులు అంటున్నారు. ఒకవేళ అమెరికాలో డిమాండ్ తగ్గినా, వేరే దేశాలకు పంపించే సత్తా మనకు ఉంది. కాబట్టి ట్రంప్ ఎంత గట్టిగా అరిచినా, బాస్మతి ఘమఘమలు మాత్రం ఆగేలా లేవు.

This post was last modified on December 9, 2025 10:39 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

మగాళ్లను కుక్కలతో పోల్చిన నటి

కన్నడలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, తర్వాత రాజకీయ నాయకురాలిగా మారిన దివ్య స్పందన అలియాస్ రమ్య జర్నీలో వివాదాలకు లోటేమీ…

41 minutes ago

`పీపీపీ`కి కేంద్రం అండ‌… బాబుకు భ‌రోసా… !

ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…

2 hours ago

మిథున్ రెడ్డి ఆస్తులు ఎలా పెరిగాయ్.. హాట్ టాపిక్..!

వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…

3 hours ago

లేడీ డైరెక్టర్ వేసిన డేరింగ్ స్టెప్

టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…

6 hours ago

ఎవరెస్ట్ బరువు మోస్తున్న మారుతీ సాబ్

ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…

7 hours ago

రవితేజ వారి ‘మంచు’ పంచ్ చూశారా?

ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు…

7 hours ago