Trends

అమెరికాలో బిర్యానీ లవర్స్‌కు షాక్ తప్పదా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. భారత్ సహా వియత్నాం, థాయిలాండ్ నుంచి వచ్చే బియ్యంపై అదనపు పన్నులు వేస్తానని హెచ్చరించారు. అయితే ఈ వార్నింగ్ చూసి మన ఎగుమతిదారులు ఏమాత్రం కంగారు పడటం లేదు. ట్రంప్ నిర్ణయం వల్ల ఇండియాకు పెద్దగా నష్టం ఉండదని, అసలు దెబ్బతినేది అమెరికా ప్రజలేనని వారు తేల్చి చెబుతున్నారు. అక్కడి బిర్యానీ ప్రియుల జేబులకు చిల్లు పడటం ఖాయమని అంటున్నారు.

గణాంకాలు చూస్తే.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి అమెరికాకు దాదాపు 337 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 2800 కోట్లు) విలువైన బాస్మతి బియ్యం ఎగుమతి అయ్యింది. అదే సమయంలో నాన్ బాస్మతి బియ్యం ఎగుమతులు కేవలం 54 మిలియన్ డాలర్లు మాత్రమే. దీన్ని బట్టి చూస్తే అమెరికా మార్కెట్‌లో మన బాస్మతికి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద మనం ఏటా దాదాపు 390 మిలియన్ డాలర్ల బియ్యాన్ని అమెరికాకు పంపిస్తున్నాం.

అసలు విషయం ఏంటంటే.. అమెరికాలో పండే బియ్యం మన బాస్మతికి సాటిరాదు. మన బాస్మతి వాసన, రుచి, ఆకృతి అక్కడ దొరకదు. అమెరికాలో ఉండే భారతీయులు, ఆసియా వాసులు బిర్యానీలు, పులావ్‌ల కోసం కచ్చితంగా ఇండియన్ బాస్మతినే వాడతారు. కాబట్టి ట్రంప్ పన్ను పెంచినా సరే, ఎక్కువ రేటు పెట్టి మరీ జనం కొంటారు తప్ప, వేరే బియ్యానికి మారరు. దీనివల్ల అంతిమంగా భారం పడేది కస్టమర్ల మీదే.

గతంలో పన్ను 10 శాతంగా ఉండేది, దాన్ని పెంచినప్పుడు కూడా ఎగుమతులు తగ్గలేదు. పెరిగిన ధరను వినియోగదారులే భరించారు. మన రైతులకు, వ్యాపారులకు రావాల్సిన లాభాలు యథావిధిగా వచ్చాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతుందని ఎగుమతిదారులు నమ్మకంగా ఉన్నారు. మన బియ్యం అక్కడ “డంపింగ్” అవుతోందని ట్రంప్ ఆరోపిస్తున్నా, వాస్తవం మాత్రం వేరేలా ఉంది. మన రైస్ అక్కడి మార్కెట్‌లో ఒక స్పెషల్ బ్రాండ్.

భారత రైస్ ఇండస్ట్రీ చాలా బలంగా ఉందని, కేవలం అమెరికానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మనకు మార్కెట్ ఉందని నిపుణులు అంటున్నారు. ఒకవేళ అమెరికాలో డిమాండ్ తగ్గినా, వేరే దేశాలకు పంపించే సత్తా మనకు ఉంది. కాబట్టి ట్రంప్ ఎంత గట్టిగా అరిచినా, బాస్మతి ఘమఘమలు మాత్రం ఆగేలా లేవు.

Kumar

Recent Posts

వైసీపీ నేతలు రేవంత్ రెడ్డిని దూషించడమేంటి?

ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…

14 minutes ago

కత్తి కొనల మీద ‘ప్యారడైజ్’ పరుగులు

టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…

28 minutes ago

ఇంకెంతమంది భారతీయులు బలి కావాలి?

పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…

34 minutes ago

సేనానికి అభిమానమే అడ్డు కాకూడదు

భుజానికి అయిన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం ముంబై…

50 minutes ago

బాలయ్యకు ఏదైనా ఒకటే…

హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తనదైన శైలిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈసారి భారీ పొక్లెయిన్…

54 minutes ago

భాగ్యశ్రీ ఫ్యామిలీకి ఆర్థిక ఇబ్బందులా?

తెలుగులో ప్రస్తుతం నంబర్ వన్ హీరోయిన్ పొజిషన్‌కు గట్టి పోటీదారుగా మారిన అమ్మాయి.. భాగ్యశ్రీ బోర్సే. రెండు రోజుల ముందు…

2 hours ago