Trends

నెంబర్ వన్ చెస్ కింగ్… మనోడి నెక్స్ట్ టార్గెట్ అదే!

ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన భారత గ్రాండ్ మాస్టర్ డి.గుకేష్ ఇప్పుడు మరో అరుదైన రికార్డుపై కన్నేశాడు. కేవలం వరల్డ్ టైటిల్ గెలిస్తే సరిపోదు, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో కూడా నంబర్ వన్ కావాలని పట్టుదలగా ఉన్నాడు. గత 14 ఏళ్లుగా ఆ స్థానంలో పాతుకుపోయిన మాగ్నస్ కార్ల్‌సన్‌ను కిందకు దించి, ఆ సింహాసనాన్ని అధిష్టించడమే తన తదుపరి లక్ష్యం అని సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చాడు.

ప్రస్తుతం గుకేష్ ర్యాంకు పదిలో ఉంది. డింగ్ లిరెన్‌ను ఓడించి ఛాంపియన్ అయినా, 2025 ఏడాది అతనికి కాస్త ఒడిదుడుకులుగానే సాగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కెరీర్ బెస్ట్ ర్యాంక్ మూడుకు చేరుకున్నా, తర్వాత వెనకబడ్డాడు. తాజాగా ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, నంబర్ వన్ స్థానం కోసం నా శాయశక్తులా ప్రయత్నిస్తాను, ఫలితం ఏదైనా నా ప్రయత్నంలో లోపం ఉండదని చాలా మెచ్యూర్డ్ గా సమాధానం చెప్పాడు.

రాబోయే వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో తన తోటి భారతీయ ఆటగాడు ప్రజ్ఞానందాతో తలపడాలని ఉందని గుకేష్ మనసులో మాట బయటపెట్టాడు. ఇప్పటికే ప్రజ్ఞానందా 2026 కాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించాడు. ఒకవేళ కాండిడేట్స్ టోర్నీలో ప్రజ్ఞానందా గెలిస్తే, టైటిల్ పోరులో ఇద్దరు భారతీయులే తలపడే అద్భుత దృశ్యం మనం చూడొచ్చు.

ఇదిలా ఉంటే కాండిడేట్స్ ఎంపిక విధానంపై ఇప్పుడు పెద్ద రచ్చ జరుగుతోంది. అమెరికన్ ప్లేయర్ హికారు నకమురా అర్హత సాధించడానికి చిన్న చిన్న టోర్నీలు ఆడాల్సి వచ్చింది. దీనిపై కార్ల్‌సన్ ఫిడే (FIDE) తీరును తప్పుబట్టాడు. ప్రపంచంలోనే బెస్ట్ ప్లేయర్స్ అని తెలిసాక కూడా, ఇలా రూల్స్ పేరుతో చిన్న టోర్నీలు ఆడించడం పిచ్చితనమని మండిపడ్డాడు.

ఏది ఏమైనా భారతీయ చెస్ ఇప్పుడు గోల్డెన్ పీరియడ్‌లో ఉంది. ఒకపక్క గుకేష్ నంబర్ వన్ సీటు కోసం వేట మొదలుపెట్టడం, మరోపక్క ప్రజ్ఞానందా దూసుకురావడం చూస్తుంటే రాబోయే రోజుల్లో చెస్ ప్రపంచాన్ని భారతీయులే ఏలబోతున్నారని అర్థమవుతోంది. కార్ల్‌సన్ 14 ఏళ్ల సామ్రాజ్యాన్ని గుకేష్ ఎప్పుడు కూల్చేస్తాడో చూడాలి.

This post was last modified on December 9, 2025 9:42 am

Share
Show comments
Published by
Kumar
Tags: Gukesh

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

5 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

6 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

6 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

6 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

7 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

7 hours ago