Trends

10 మంది పేషెంట్లను చంపిన నర్సు

జర్మనీలో జరిగిన ఒక షాకింగ్ ఘటనలో ఒకరికి జీవిత ఖైదు పడింది. రాత్రిపూట తన పని భారాన్ని తగ్గించుకోవడానికి నర్సుగా పని చేస్తున్న ఒక వ్యక్తి ఏకంగా 10 మంది పేషెంట్లను హత్య చేయడంతో పాటు, మరో 27 మందిని చంపడానికి ప్రయత్నించినట్లు తేలింది. ఈ దారుణం డిసెంబర్ 2023 నుంచి మే 2024 మధ్య కాలంలో పశ్చిమ జర్మనీలోని వుయెర్‌సెల్న్ ఆసుపత్రిలో జరిగింది.

44 ఏళ్ల ఈ నర్సు ఎక్కువగా వృద్ధులు, నయం కాని వ్యాధులతో బాధపడేవారికి మత్తు మందులను (మార్ఫిన్, మిడాజోలమ్) అధిక మోతాదులో ఇంజెక్ట్ చేసినట్లు ప్రాసిక్యూటర్లు కోర్టుకు తెలిపారు. రాత్రంతా వారిని చూసుకోవాల్సిన పని లేకుండా ఉండటానికి, ఈ దారుణానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఎక్కువ కేర్ అవసరమైన పేషెంట్ల విషయంలో నర్సు విసుగు చెంది, అతను తనను తాను మరణానికి యజమానినిగా భావించాడని ప్రాసిక్యూటర్లు కోర్టుకు చెప్పారు. ఈ చర్యలు అతనిలో ప్రత్యేకమైన నేర తీవ్రతను ప్రదర్శించాయని కోర్టు పేర్కొంది. అందుకే, 15 సంవత్సరాల తర్వాత ముందస్తుగా విడుదల కావడానికి వీలు లేకుండా జీవిత ఖైదు విధించింది.

ఈ నర్సు 2020 నుంచి ఆ ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. అతని షిఫ్ట్‌లో ఎక్కువ మంది రోగుల ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంపై సహచర సిబ్బంది, డాక్టర్లకు అనుమానం రావడంతో విషయం కోర్టు వరకు వెళ్ళింది. ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొంత మంది రోగులు ఇలానే చనిపోయారా అని తెలుసుకోవడానికి, వారి మృతదేహాలను వెలికితీసి దర్యాప్తు చేస్తున్నారు. అదనంగా మరిన్ని కేసులు నమోదైతే, నర్సు మరిన్ని విచారణలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

This post was last modified on November 7, 2025 2:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`పీపీపీ`కి కేంద్రం అండ‌… బాబుకు భ‌రోసా… !

ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…

45 minutes ago

మిథున్ రెడ్డి ఆస్తులు ఎలా పెరిగాయ్.. హాట్ టాపిక్..!

వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…

1 hour ago

లేడీ డైరెక్టర్ వేసిన డేరింగ్ స్టెప్

టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…

4 hours ago

ఎవరెస్ట్ బరువు మోస్తున్న మారుతీ సాబ్

ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…

5 hours ago

రవితేజ వారి ‘మంచు’ పంచ్ చూశారా?

ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు…

5 hours ago

సినిమా వాయిదా… 60 కోట్ల రీఫండ్

అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…

6 hours ago