జర్మనీలో జరిగిన ఒక షాకింగ్ ఘటనలో ఒకరికి జీవిత ఖైదు పడింది. రాత్రిపూట తన పని భారాన్ని తగ్గించుకోవడానికి నర్సుగా పని చేస్తున్న ఒక వ్యక్తి ఏకంగా 10 మంది పేషెంట్లను హత్య చేయడంతో పాటు, మరో 27 మందిని చంపడానికి ప్రయత్నించినట్లు తేలింది. ఈ దారుణం డిసెంబర్ 2023 నుంచి మే 2024 మధ్య కాలంలో పశ్చిమ జర్మనీలోని వుయెర్సెల్న్ ఆసుపత్రిలో జరిగింది.
44 ఏళ్ల ఈ నర్సు ఎక్కువగా వృద్ధులు, నయం కాని వ్యాధులతో బాధపడేవారికి మత్తు మందులను (మార్ఫిన్, మిడాజోలమ్) అధిక మోతాదులో ఇంజెక్ట్ చేసినట్లు ప్రాసిక్యూటర్లు కోర్టుకు తెలిపారు. రాత్రంతా వారిని చూసుకోవాల్సిన పని లేకుండా ఉండటానికి, ఈ దారుణానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఎక్కువ కేర్ అవసరమైన పేషెంట్ల విషయంలో నర్సు విసుగు చెంది, అతను తనను తాను మరణానికి యజమానినిగా భావించాడని ప్రాసిక్యూటర్లు కోర్టుకు చెప్పారు. ఈ చర్యలు అతనిలో ప్రత్యేకమైన నేర తీవ్రతను ప్రదర్శించాయని కోర్టు పేర్కొంది. అందుకే, 15 సంవత్సరాల తర్వాత ముందస్తుగా విడుదల కావడానికి వీలు లేకుండా జీవిత ఖైదు విధించింది.
ఈ నర్సు 2020 నుంచి ఆ ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. అతని షిఫ్ట్లో ఎక్కువ మంది రోగుల ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంపై సహచర సిబ్బంది, డాక్టర్లకు అనుమానం రావడంతో విషయం కోర్టు వరకు వెళ్ళింది. ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొంత మంది రోగులు ఇలానే చనిపోయారా అని తెలుసుకోవడానికి, వారి మృతదేహాలను వెలికితీసి దర్యాప్తు చేస్తున్నారు. అదనంగా మరిన్ని కేసులు నమోదైతే, నర్సు మరిన్ని విచారణలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
This post was last modified on November 7, 2025 2:19 pm
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన చెన్నై లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో…