Trends

సైడ్ మిర్రర్ కు బైక్ తాకిందని వెంటాడి చంపేసిన దంపతులు

షాకింగ్ నేరాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది కర్ణాటక. ఇటీవల కాలంలో వెలుగు చూసిన దారుణ నేరాలు ఆ రాష్ట్రంలో చోటు చేసుకోవటం కనిపిస్తుంది. ఇప్పుడు చెప్పేది కూడా ఆ కోవకు చెందినదే. కారు సైడ్ మిర్రర్ కు బైక్ తాకిందన్న ఆగ్రహంతో.. ఆ బైక్ ను ఛేజ్ చేసుకుంటూ వెళ్లటమే కాదు.. ఆ వ్యక్తిని తమ కారుతో గుద్దేసి చంపేసిన ఆరాచకం కర్ణాటకలో చోటు చేసుకుంది. ఈ ఉదంతంలో మరో భయంకర ట్విస్టు ఏమంటే.. కారుతో చంపేసింది దంపతులు కావటం.

బెంగళూరులోని పుట్టేనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 22 అర్థరాత్రి దర్శన్ తన ఫ్రెండ్ వరుణ్ తో కలిసి శ్రీరామ లేఅవుట్ లో బైక్ మీద వెళుతున్నాడు. ఈ సమయంలో వారికి పక్కగా వెళుతున్న కారు సైడ్ మిర్రర్ కు వీరి బైక్ తాకింది. దీంతో.. కారులో ప్రయాణిస్తున్న మనోజ్ కుమార్.. అతడి భార్య అరతిశర్మ బైక్ మీద ప్రయాణిస్తున్న వారితో గొడవకు దిగారు.

ఈ క్రమంలో తమ కారును దాటేసి ముందుకు వెళుతున్న బైక్ ను వెంబడించిన దంపతులు 2కిలోమీటర్లు వెంబడించి.. వెనుక నుంచి బైక్ ను వేగంగా ఢీ కొట్టేసి వెళ్లిపోయారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన దర్శన్.. వరుణ్ లను స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ దర్శన్ చనిపోయాడు. వరుణ్ చికిత్స పొందుతున్నాడు. ఘటనాస్థలంలో కారుకు చెందిన విడిభాగాలు పడిపోతే.. కాసేపటికి మనోజ్.. ఆరతిలు తమ ముఖాలకు మాస్కులు వేసుకొని వెనక్కి వచ్చి.. వాటిని తీసుకెళ్లటం సీసీ కెమేరాలకు చిక్కింది. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజ్ సాయంతో నిందితుల్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

This post was last modified on October 31, 2025 6:33 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సర్దార్ 2 ఎందుకు రావడం లేదు

తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…

1 hour ago

అఖిల్ అభిమానులు ఈసారి ఒప్పుకోరు

షూటింగ్ ఆలస్యాలు, రిలీజ్ వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 26 విడుదల తేదీని లెనిన్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.…

2 hours ago

చెప్పుతెగుద్ది… సీత‌క్క బ్లాస్ట్‌!

తెలంగాణలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో మంత్రిగా ఉన్న నాయ‌కురాలు.. గిరిజ‌న నేత సీత‌క్క‌(అన‌సూయ‌) ఒక్క‌సారిగా బ్లాస్ట్ అ య్యారు. `చెప్పుతెగుద్ది` అని…

2 hours ago

మహిళల వీడియోలతో చెలగాటం… ఏఎస్సై సస్పెండ్

పల్నాడు జిల్లా మాచర్ల పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పోలీసు అధికారుల అవినీతి అక్రమాలు వరుసగా బయటపడుతున్నాయి. ఇప్పటికే మాచర్ల…

3 hours ago

నియోజకవర్గాల పెంపు: ఒరిగేదేంటి.. జరిగేదేంటి?

దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పెంపు వ్యవహారం ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య చర్చకు దారితీసింది. ప్రాంతీయ పార్టీలు వీటికి…

8 hours ago

జ‌మిలికి జై కొట్టాలా?.. కాంగ్రెస్ అంత‌ర్మ‌థ‌నం!

దేశంలో రెండు కీల‌క అంశాల‌ను తేల్చేసేందుకు కేంద్రంలోని న‌రేంద్ర మోడీ సర్కారు సిద్ధ‌మైంది. 1) జ‌మిలి ఎన్నిక‌లు. 2) పార్ల‌మెంటు…

12 hours ago