భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంటే.. వన్డేలు, టీ20ల్లో జట్టు వైస్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ ఇండియాలో ఉన్నాడు. అతను గాయం కారణంగా ఆస్ట్రేలియా పర్యటనకు ఇంకా వెళ్లని సంగతి తెలిసిందే. టెస్టు సిరీస్.. అది కూడా చివరి రెండు మ్యాచ్ల కోసం వచ్చే నెల అతను ఆస్ట్రేలియాకు వెళ్లే అవకాశముంది. ఇప్పుడైతే గాయం నుంచి కోలుకుని ఫిట్నెస్ సాధించే పనిలో ఉన్నాడతను.
ఐతే ఆదివారం భారత జట్టు.. ఆస్ట్రేలియాతో రెండో టీ20 ఆడగా ఆ మ్యాచ్లో ఆడిన ఆటగాళ్లు కాదని.. రోహిత్ శర్మ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాడు. అతడి పేరు ఇండియా, వరల్డ్ లెవెల్లో ట్రెండ్ అయింది. అలాగే కెప్టెన్సీ అనే పదం సైతం టాప్ ట్రెండింగ్స్లో కనిపించింది. ఇందుకు కారణాలు లేకపోలేదు.
ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ జట్టుకు ఒకటికి ఐదు ట్రోఫీలు అందించిన ఘనత రోహిత్ శర్మది. ఆ జట్టు బలంగా ఉన్నప్పటికీ.. రోహిత్ కెప్టెన్సీ కూడా జట్టు విజయాల్లో కీలకం అన్నది స్పష్టం. ఐతే ఈ టోర్నీలో కోహ్లి నాయకత్వంలోని బెంగళూరు ఒక్క టైటిల్ కూడా గెలవలేదు. ఇది చూపించే కోహ్లి కంటే రోహిత్ ఉత్తమ కెప్టెన్ అంటుంటారు. ఐతే అంతర్జాతీయ స్థాయిలో కోహ్లి కెప్టెన్సీ రికార్డు బాగానే ఉండటంతో బండి నడిచిపోతోంది. అతను ఫెయిలైనపుడల్లా రోహిత్కు కెప్టెన్సీ ఇవ్వాలన్న డిమాండ్ వస్తుంటుంది.
మొన్నటి ఐపీఎల్ టైంలో కోహ్లిని తప్పించి టీ20ల్లో రోహిత్కు కెప్టెన్సీ ఇవ్వాలన్న అభిప్రాయం బలంగా వినిపించగా.. ఇప్పుడది మరింత ఊపందుకుంది. వరుసగా రెండు మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా చేతిలో చిత్తవడం, కోహ్లి కెప్టెన్సీ పేలవంగా కనిపించడం.. తొలి మ్యాచ్లో విఫలమయ్యాక కూడా తన బెంగళూరు టీమ్ మేట్స్ సైని, చాహల్లను కొనసాగించడం.. నటరాజన్, కుల్దీప్లకు అవకాశం ఇవ్వకపోవడంతో కోహ్లిని తిట్టిపోస్తున్న నెటిజన్లు.. రోహిత్కు కెప్టెన్సీ ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే #rohitsharma.. #captaincy.. హ్యాష్ ట్యాగ్స్ టాప్లో ట్రెండ్ అయ్యాయి.
This post was last modified on November 30, 2020 7:19 am
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…