భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంటే.. వన్డేలు, టీ20ల్లో జట్టు వైస్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ ఇండియాలో ఉన్నాడు. అతను గాయం కారణంగా ఆస్ట్రేలియా పర్యటనకు ఇంకా వెళ్లని సంగతి తెలిసిందే. టెస్టు సిరీస్.. అది కూడా చివరి రెండు మ్యాచ్ల కోసం వచ్చే నెల అతను ఆస్ట్రేలియాకు వెళ్లే అవకాశముంది. ఇప్పుడైతే గాయం నుంచి కోలుకుని ఫిట్నెస్ సాధించే పనిలో ఉన్నాడతను.
ఐతే ఆదివారం భారత జట్టు.. ఆస్ట్రేలియాతో రెండో టీ20 ఆడగా ఆ మ్యాచ్లో ఆడిన ఆటగాళ్లు కాదని.. రోహిత్ శర్మ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాడు. అతడి పేరు ఇండియా, వరల్డ్ లెవెల్లో ట్రెండ్ అయింది. అలాగే కెప్టెన్సీ అనే పదం సైతం టాప్ ట్రెండింగ్స్లో కనిపించింది. ఇందుకు కారణాలు లేకపోలేదు.
ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ జట్టుకు ఒకటికి ఐదు ట్రోఫీలు అందించిన ఘనత రోహిత్ శర్మది. ఆ జట్టు బలంగా ఉన్నప్పటికీ.. రోహిత్ కెప్టెన్సీ కూడా జట్టు విజయాల్లో కీలకం అన్నది స్పష్టం. ఐతే ఈ టోర్నీలో కోహ్లి నాయకత్వంలోని బెంగళూరు ఒక్క టైటిల్ కూడా గెలవలేదు. ఇది చూపించే కోహ్లి కంటే రోహిత్ ఉత్తమ కెప్టెన్ అంటుంటారు. ఐతే అంతర్జాతీయ స్థాయిలో కోహ్లి కెప్టెన్సీ రికార్డు బాగానే ఉండటంతో బండి నడిచిపోతోంది. అతను ఫెయిలైనపుడల్లా రోహిత్కు కెప్టెన్సీ ఇవ్వాలన్న డిమాండ్ వస్తుంటుంది.
మొన్నటి ఐపీఎల్ టైంలో కోహ్లిని తప్పించి టీ20ల్లో రోహిత్కు కెప్టెన్సీ ఇవ్వాలన్న అభిప్రాయం బలంగా వినిపించగా.. ఇప్పుడది మరింత ఊపందుకుంది. వరుసగా రెండు మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా చేతిలో చిత్తవడం, కోహ్లి కెప్టెన్సీ పేలవంగా కనిపించడం.. తొలి మ్యాచ్లో విఫలమయ్యాక కూడా తన బెంగళూరు టీమ్ మేట్స్ సైని, చాహల్లను కొనసాగించడం.. నటరాజన్, కుల్దీప్లకు అవకాశం ఇవ్వకపోవడంతో కోహ్లిని తిట్టిపోస్తున్న నెటిజన్లు.. రోహిత్కు కెప్టెన్సీ ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే #rohitsharma.. #captaincy.. హ్యాష్ ట్యాగ్స్ టాప్లో ట్రెండ్ అయ్యాయి.
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…
మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…
ఏపీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ.. ప్రస్తుత ఉండి శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజును కస్టడీలో టార్చర్ చేసిన కేసులో హైకోర్టు సంచలన…
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్పై కేసు పెట్టాలని.. ఆయన వల్ల తెలంగాణ ప్రజలు మనోవేదనకు గురవుతున్నారని…
2019 ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతున్న తరుణంలో వైసీపీ నేతల నోట జాబ్ కేలండర్ అన్న మాట గట్టిగా వినిపించింది.…