ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు గడువు సెప్టెంబరు 15తోనే ముగుస్తుందని కేంద్రం స్పష్టంగా తెలిపింది. కొన్ని సోషల్ మీడియా పోస్టుల్లో ఈ గడువును సెప్టెంబరు 30 వరకు పొడిగించారనే వార్తలు వైరల్ అవుతున్నా, అవన్నీ నకిలీ సమాచారం మాత్రమేనని ఆదాయపు పన్ను విభాగం ఖండించింది. ఇప్పటికే జూలై 31 వరకు ఉన్న గడువును ఒకసారి పొడిగించి సెప్టెంబరు 15 వరకు తీసుకొచ్చామని, ఇకపై ఎలాంటి పొడిగింపు ఉండదని స్పష్టం చేసింది.
ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 6 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నులను ఫైల్ చేసినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అందులో 5.51 కోట్ల రిటర్నులు ఇ-వెరిఫై కాగా, 3.78 కోట్ల వరకు పరిశీలన పూర్తయిందని అధికారులు వెల్లడించారు. రూ.3 లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారు తప్పనిసరిగా ఐటీఆర్ సమర్పించాలని సూచించారు. కొత్త, పాత పన్ను విధానాల్లో ఏది లాభదాయకమో జాగ్రత్తగా పరిశీలించి దాఖలు చేయాలని పన్ను శాఖ గుర్తు చేసింది.
అయితే, గడువులోగా రిటర్నులు దాఖలు చేయని వారికి పెనాల్టీ తప్పదని హెచ్చరిక వచ్చింది. పైగా రీఫండ్ కోసం తప్పుడు మినహాయింపులు చూపిస్తే అది తరువాత నోటీసులకు, జరిమానాలకు దారితీస్తుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఫేక్ న్యూస్ నమ్మొద్దని, ఆదాయపు పన్ను విభాగం అధికారికంగా ఇచ్చే అప్డేట్స్ మాత్రమే నమ్మాలని పన్ను చెల్లింపుదారులకు సూచించారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా 24×7 హెల్ప్డెస్క్ అందుబాటులో ఉందని ఐటీ శాఖ తెలిపింది. కాల్స్, లైవ్ చాట్స్, వెబ్ సెషన్స్, ఎక్స్ ఖాతా ద్వారా పన్ను చెల్లింపుదారుల సందేహాలను నివృత్తి చేయనున్నట్లు పేర్కొంది. దీంతో పన్ను చెల్లింపుదారులు చివరి రోజున గందరగోళం కాకుండా ముందుగానే ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు.
This post was last modified on September 15, 2025 11:20 am
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…