ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు గడువు సెప్టెంబరు 15తోనే ముగుస్తుందని కేంద్రం స్పష్టంగా తెలిపింది. కొన్ని సోషల్ మీడియా పోస్టుల్లో ఈ గడువును సెప్టెంబరు 30 వరకు పొడిగించారనే వార్తలు వైరల్ అవుతున్నా, అవన్నీ నకిలీ సమాచారం మాత్రమేనని ఆదాయపు పన్ను విభాగం ఖండించింది. ఇప్పటికే జూలై 31 వరకు ఉన్న గడువును ఒకసారి పొడిగించి సెప్టెంబరు 15 వరకు తీసుకొచ్చామని, ఇకపై ఎలాంటి పొడిగింపు ఉండదని స్పష్టం చేసింది.
ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 6 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నులను ఫైల్ చేసినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అందులో 5.51 కోట్ల రిటర్నులు ఇ-వెరిఫై కాగా, 3.78 కోట్ల వరకు పరిశీలన పూర్తయిందని అధికారులు వెల్లడించారు. రూ.3 లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారు తప్పనిసరిగా ఐటీఆర్ సమర్పించాలని సూచించారు. కొత్త, పాత పన్ను విధానాల్లో ఏది లాభదాయకమో జాగ్రత్తగా పరిశీలించి దాఖలు చేయాలని పన్ను శాఖ గుర్తు చేసింది.
అయితే, గడువులోగా రిటర్నులు దాఖలు చేయని వారికి పెనాల్టీ తప్పదని హెచ్చరిక వచ్చింది. పైగా రీఫండ్ కోసం తప్పుడు మినహాయింపులు చూపిస్తే అది తరువాత నోటీసులకు, జరిమానాలకు దారితీస్తుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఫేక్ న్యూస్ నమ్మొద్దని, ఆదాయపు పన్ను విభాగం అధికారికంగా ఇచ్చే అప్డేట్స్ మాత్రమే నమ్మాలని పన్ను చెల్లింపుదారులకు సూచించారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా 24×7 హెల్ప్డెస్క్ అందుబాటులో ఉందని ఐటీ శాఖ తెలిపింది. కాల్స్, లైవ్ చాట్స్, వెబ్ సెషన్స్, ఎక్స్ ఖాతా ద్వారా పన్ను చెల్లింపుదారుల సందేహాలను నివృత్తి చేయనున్నట్లు పేర్కొంది. దీంతో పన్ను చెల్లింపుదారులు చివరి రోజున గందరగోళం కాకుండా ముందుగానే ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు.
విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా మూవీ రణబాలి సెప్టెంబర్ 11 విడుదల తేదీ ఎప్పుడో ఖరారు చేసుకుంది. అధికారిక ప్రకటన…
రీసెంట్ గా జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో జరిగిన ఒక చిన్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే…
మహారాష్ట్రలోని పుణే సమీపంలో జరిగిన యువ వ్యాపారవేత్త అనుమానాస్పద మృతి కేసులో కళ్లు చెదిరే నిజాలు బయటపడ్డాయి. జూన్ 18వ…
అగ్రరాజ్యం అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డ్.. అత్యంత కీలకం. దీనిని సాధించడమే మహా యజ్ఞం చేసినంత పనిగా…
ఒకప్పుడు బంగారం నిల్వల విషయంలో కేజీఎఫ్ గురించి చర్చ జరిగేదని.. కానీ, ఇప్పుడు కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గురించి దేశవ్యాప్తంగా…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టు తప్పదా? ఆమెపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన నివేదిక రెడీ అయిందా?…