Trends

గిల్‌కి వన్డే కెప్టెన్సీ.. మరి రోహిత్ సంగతేంటీ?

భారత క్రికెట్‌లో మరో కీలక మార్పు చోటుచేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ను త్వరలోనే భారత వన్డే జట్టు కెప్టెన్‌గా ప్రకటించే అవకాశం బలంగా ఉంది. ఈ నిర్ణయంతో రోహిత్‌ శర్మ కెప్టెన్సీ ప్రయాణం ముగిసే దశకు చేరుకుంటుందన్న చర్చ మొదలైంది. ముఖ్యంగా రాబోయే ఆస్ట్రేలియా పర్యటన రోహిత్‌కి చివరి సిరీస్ కావచ్చని అనేక వర్గాలు భావిస్తున్నాయి.

గిల్‌ ఇప్పటికే టెస్టుల్లో జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. టీ20లోనూ వైస్ కెప్టెన్‌గా నియమించబడ్డాడు. ఇప్పుడు ఓడీఐల్లోనూ అతనికే నాయకత్వం ఇవ్వాలని బీసీసీఐ ఆలోచిస్తోంది. 2027 వరల్డ్‌కప్ దృష్ట్యా కొత్త కెప్టెన్‌కు ముందుగానే సమయం ఇవ్వడం అవసరమని భావిస్తున్నారు. రోహిత్‌ మరోసారి వరల్డ్‌కప్ గెలిపించాలని కోరుకున్నా, ఆ నిర్ణయం ఇప్పుడు పూర్తిగా సెలెక్టర్ల చేతుల్లోనే ఉంది.

38 ఏళ్ల వయసులో రోహిత్‌ ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఫిట్‌నెస్, ఫామ్ రెండూ నిలబెట్టుకోవడం అతనికి కఠిన సవాలే. మరోవైపు, గిల్‌కి వయస్సు, ఫామ్ రెండూ అనుకూలంగా ఉన్నాయి. అందుకే బీసీసీఐ ఒక కెప్టెన్‌తో అన్ని ఫార్మాట్లను ముందుకు తీసుకెళ్లే వ్యూహం అవలంబించనుంది.

ఈ నిర్ణయం రోహిత్‌ – విరాట్‌ల భవిష్యత్తుపై పెద్ద ప్రశ్నల్ని లేవనెత్తింది. ఇద్దరూ టెస్ట్, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇప్పుడు వన్డే ఫార్మాట్‌లో ఉన్నారు. కానీ 2027 నాటికి రోహిత్‌ 40 ఏళ్లు దాటతాడు. ఇలాంటి సందర్భంలో గిల్‌నే భవిష్యత్‌ నాయకుడిగా గుర్తించడం సహజమేనని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు.

మొత్తానికి, ఆస్ట్రేలియా సిరీస్ రోహిత్‌ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పే వేదిక కావచ్చని కనిపిస్తోంది. ఇక గిల్‌కి ఓడీఐ జట్టు పగ్గాలు అప్పగించడం కేవలం సమయ సమస్య మాత్రమేనని స్పష్టమవుతోంది. ఇక అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందో చూడాలి.

This post was last modified on September 7, 2025 4:06 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

బాబు గారి పాలన… అంతా లైవ్ లోనే!

సాధారణంగా ప్రభుత్వ ఉన్నతాధికారుల సమావేశాలు మూసివున్న గదుల్లో, గోప్యంగా సాగుతుంటాయి. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరుగుతున్న కలెక్టర్ల…

29 minutes ago

డెకాయిట్… డిఫరెంట్ అనిపిస్తున్నాడు

అడివి శేష్ తెరమీద కనిపించి రెండేళ్లు గడిచిపోయాయి. ఆ మధ్య నాని హిట్ 3 ది థర్డ్ కేస్ లో…

51 minutes ago

విశాఖపట్నంలో వండర్‌లా.. తిరుపతిలో ఇమాజికా వరల్డ్!

ఆంధ్రప్రదేశ్‌ను ప్రముఖ టూరిస్ట్ గమ్యస్థానంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు చేపడుతోంది. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు రెండు ప్రాంతాల్లో టూరిజం మౌలిక…

1 hour ago

ఉండి టాక్: రఘురామ సత్తా తెలుస్తోందా..?

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరిలోని ఉండి నియోజకవర్గం నుంచి సీటు దక్కించుకుని విజయం సాధించిన రఘురామకృష్ణరాజు ప్రస్తుతం…

1 hour ago

బోయపాటి సిలబస్ మారే టైమొచ్చింది

ఎవరు ఔనన్నా కాదన్నా అఖండ తాండవం 2 బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న వైనం స్పష్టం. కొన్ని ఏరియాల్లో డీసెంట్ గా…

2 hours ago

అభిమానం హద్దు మీరితే చాలా ప్రమాదం

నిన్న జరిగిన రాజా సాబ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ తర్వాత హీరోయిన్ నిధి అగర్వాల్ పట్ల అభిమానులు ప్రవర్తించిన తీరు…

2 hours ago