Trends

గిల్‌కి వన్డే కెప్టెన్సీ.. మరి రోహిత్ సంగతేంటీ?

భారత క్రికెట్‌లో మరో కీలక మార్పు చోటుచేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ను త్వరలోనే భారత వన్డే జట్టు కెప్టెన్‌గా ప్రకటించే అవకాశం బలంగా ఉంది. ఈ నిర్ణయంతో రోహిత్‌ శర్మ కెప్టెన్సీ ప్రయాణం ముగిసే దశకు చేరుకుంటుందన్న చర్చ మొదలైంది. ముఖ్యంగా రాబోయే ఆస్ట్రేలియా పర్యటన రోహిత్‌కి చివరి సిరీస్ కావచ్చని అనేక వర్గాలు భావిస్తున్నాయి.

గిల్‌ ఇప్పటికే టెస్టుల్లో జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. టీ20లోనూ వైస్ కెప్టెన్‌గా నియమించబడ్డాడు. ఇప్పుడు ఓడీఐల్లోనూ అతనికే నాయకత్వం ఇవ్వాలని బీసీసీఐ ఆలోచిస్తోంది. 2027 వరల్డ్‌కప్ దృష్ట్యా కొత్త కెప్టెన్‌కు ముందుగానే సమయం ఇవ్వడం అవసరమని భావిస్తున్నారు. రోహిత్‌ మరోసారి వరల్డ్‌కప్ గెలిపించాలని కోరుకున్నా, ఆ నిర్ణయం ఇప్పుడు పూర్తిగా సెలెక్టర్ల చేతుల్లోనే ఉంది.

38 ఏళ్ల వయసులో రోహిత్‌ ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఫిట్‌నెస్, ఫామ్ రెండూ నిలబెట్టుకోవడం అతనికి కఠిన సవాలే. మరోవైపు, గిల్‌కి వయస్సు, ఫామ్ రెండూ అనుకూలంగా ఉన్నాయి. అందుకే బీసీసీఐ ఒక కెప్టెన్‌తో అన్ని ఫార్మాట్లను ముందుకు తీసుకెళ్లే వ్యూహం అవలంబించనుంది.

ఈ నిర్ణయం రోహిత్‌ – విరాట్‌ల భవిష్యత్తుపై పెద్ద ప్రశ్నల్ని లేవనెత్తింది. ఇద్దరూ టెస్ట్, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇప్పుడు వన్డే ఫార్మాట్‌లో ఉన్నారు. కానీ 2027 నాటికి రోహిత్‌ 40 ఏళ్లు దాటతాడు. ఇలాంటి సందర్భంలో గిల్‌నే భవిష్యత్‌ నాయకుడిగా గుర్తించడం సహజమేనని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు.

మొత్తానికి, ఆస్ట్రేలియా సిరీస్ రోహిత్‌ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పే వేదిక కావచ్చని కనిపిస్తోంది. ఇక గిల్‌కి ఓడీఐ జట్టు పగ్గాలు అప్పగించడం కేవలం సమయ సమస్య మాత్రమేనని స్పష్టమవుతోంది. ఇక అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందో చూడాలి.

This post was last modified on September 7, 2025 4:06 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

52 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

2 hours ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

3 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

4 hours ago