Trends

GST కొత్త రూల్స్.. మధ్యతరగతికి ఊరట, ప్రభుత్వానికి టెన్షన్?

భారత ఆర్థిక వ్యవస్థలో కీలకమైన మార్పులు రాబోతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం జరగబోతోంది. ఈసారి ప్రధాన ఎజెండా.. జీఎస్టీ స్లాబ్‌లను సరళీకరించడం. ఇప్పటివరకు ఉన్న 5%, 12%, 18%, 28% స్లాబ్‌ల బదులుగా కేవలం రెండు రేట్లే ఉండేలా ప్రతిపాదన వచ్చింది. అంటే, 5% – 18% మాత్రమే ఉండి, ఎక్కువ శాతం వస్తువులు ఈ రెండు కేటగిరీల్లోకి వస్తాయి.

ఇకపోతే, ఇప్పటివరకు 28% పన్ను వేసిన 90% వస్తువులు 18% స్లాబ్‌కి మారబోతున్నాయి. అలాగే, 12% ఉన్న వస్తువులలో కొంత భాగం 5%కి వచ్చే అవకాశముంది. దీంతో, ముఖ్యంగా మధ్యతరగతి వినియోగదారులపై భారమయ్యే పన్నులు తగ్గుతాయి. రోజువారీ అవసరాల వస్తువులు చవక అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం ఈ మార్పుల వల్ల దాదాపు రూ.50,000 కోట్లు ఆదాయ నష్టం చూడాల్సి ఉంటుందని అంచనా.

ఈ కొత్త మార్పులతో జీవన బీమా, ఆరోగ్య బీమా వంటి రంగాలను కూడా జీఎస్టీ నుంచి మినహాయించాలన్న ప్రతిపాదన ఉంది. ప్రస్తుతం ఇవి 18% పన్ను కిందకి వస్తున్నాయి. మరోవైపు, తంబాకు, లగ్జరీ కార్లు, మద్యం వంటి వాటిపై 40% ‘సిన్ ట్యాక్స్’ పెట్టాలని భావిస్తున్నారు. ఆరోగ్య సెస్‌, గ్రీన్ ఎనర్జీ సెస్‌ రూపంలో కొత్త పన్నులు కూడా చర్చకు రానున్నాయి.

ఈ మార్పులు ట్రంప్‌ విధించిన 50% టారిఫ్ ప్రభావాన్ని కొంతవరకు తగ్గిస్తాయని నిపుణుల అంచనా. అమెరికాకు భారతదేశం నుంచి ఎగుమతి అవుతున్న $48 బిలియన్ విలువైన వస్తువులపై ఈ టారిఫ్‌లు పెద్ద సమస్యగా మారుతున్నాయి. ఇకపోతే జీఎస్టీ రీఫార్మ్స్, ఆదాయ పన్ను తగ్గింపులు కలిపి వినియోగాన్ని రూ.5.31 లక్షల కోట్ల వరకూ పెంచుతాయని ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ చెబుతోంది. ఇది జీడీపీపై 1.6% ప్రభావం చూపనుంది.

అయితే ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు మాత్రం జీఎస్టీ స్లాబ్ మార్పులను సానుకూలంగా చూడడం లేదు. పన్ను ఆదాయం తగ్గుతుందని, దానికి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడు, పంజాబ్, బెంగాల్ రాష్ట్ర ఆర్థిక మంత్రులు ఈ విషయంపై స్పష్టమైన ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. మొత్తానికి, వినియోగదారులకు ఊరట కలిగించే ఈ కొత్త రూల్స్ ప్రభుత్వానికి ఆర్థిక సవాళ్లు తెచ్చిపెట్టబోతున్నాయనే సంకేతాలు వస్తున్నాయి.

This post was last modified on September 3, 2025 3:31 pm

Share
Show comments
Published by
Kumar
Tags: GST

Recent Posts

చిరు బాబీ మిస్… వెంకీ అనిల్ ఫిక్స్

వరసగా సినిమాలు చేస్తున్నా సక్సెస్ మాత్రం అందని ద్రాక్ష పండులా మారిపోయిన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి సరైన బ్రేక్…

7 minutes ago

వెయ్యి కోట్ల విధ్వంసం వారం రోజుల్లోనే

అంచనాలకు మించి దురంధర్ ది రివెంజ్ అరాచకం చేస్తోంది. సరిగ్గా వారం రోజులు కావడం ఆలస్యం వెయ్యి కోట్ల క్లబ్బులోకి…

2 hours ago

మంగళగిరిని లోకేశ్ వీడాల్సిందేనా…?

లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఖరారైన నేపథ్యంలో దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఆయా పరిణామాలపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ…

3 hours ago

ప్రభాస్ ప్రేమిస్తే ఇంతే

నేటి తరం కుర్ర హీరోల్లో సంతోష్ శోభన్, సంగీత్ శోభన్ సోదరులకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే వీరిద్దరి…

4 hours ago

ఘోర బస్సు ప్రమాదం 10 మంది సజీవదహనం

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మార్కాపురం జిల్లాలోని రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు…

6 hours ago

పవన్ ప్రయాణం… సందేహాలు అనవసరం

ఇటీవల విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ ఫలితం విషయంలో అభిమానులు ఎంత మాత్రం హ్యాపీగా లేరన్నది వాస్తవం. వింటేజ్ పవన్…

7 hours ago