Trends

GST కొత్త రూల్స్.. మధ్యతరగతికి ఊరట, ప్రభుత్వానికి టెన్షన్?

భారత ఆర్థిక వ్యవస్థలో కీలకమైన మార్పులు రాబోతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం జరగబోతోంది. ఈసారి ప్రధాన ఎజెండా.. జీఎస్టీ స్లాబ్‌లను సరళీకరించడం. ఇప్పటివరకు ఉన్న 5%, 12%, 18%, 28% స్లాబ్‌ల బదులుగా కేవలం రెండు రేట్లే ఉండేలా ప్రతిపాదన వచ్చింది. అంటే, 5% – 18% మాత్రమే ఉండి, ఎక్కువ శాతం వస్తువులు ఈ రెండు కేటగిరీల్లోకి వస్తాయి.

ఇకపోతే, ఇప్పటివరకు 28% పన్ను వేసిన 90% వస్తువులు 18% స్లాబ్‌కి మారబోతున్నాయి. అలాగే, 12% ఉన్న వస్తువులలో కొంత భాగం 5%కి వచ్చే అవకాశముంది. దీంతో, ముఖ్యంగా మధ్యతరగతి వినియోగదారులపై భారమయ్యే పన్నులు తగ్గుతాయి. రోజువారీ అవసరాల వస్తువులు చవక అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం ఈ మార్పుల వల్ల దాదాపు రూ.50,000 కోట్లు ఆదాయ నష్టం చూడాల్సి ఉంటుందని అంచనా.

ఈ కొత్త మార్పులతో జీవన బీమా, ఆరోగ్య బీమా వంటి రంగాలను కూడా జీఎస్టీ నుంచి మినహాయించాలన్న ప్రతిపాదన ఉంది. ప్రస్తుతం ఇవి 18% పన్ను కిందకి వస్తున్నాయి. మరోవైపు, తంబాకు, లగ్జరీ కార్లు, మద్యం వంటి వాటిపై 40% ‘సిన్ ట్యాక్స్’ పెట్టాలని భావిస్తున్నారు. ఆరోగ్య సెస్‌, గ్రీన్ ఎనర్జీ సెస్‌ రూపంలో కొత్త పన్నులు కూడా చర్చకు రానున్నాయి.

ఈ మార్పులు ట్రంప్‌ విధించిన 50% టారిఫ్ ప్రభావాన్ని కొంతవరకు తగ్గిస్తాయని నిపుణుల అంచనా. అమెరికాకు భారతదేశం నుంచి ఎగుమతి అవుతున్న $48 బిలియన్ విలువైన వస్తువులపై ఈ టారిఫ్‌లు పెద్ద సమస్యగా మారుతున్నాయి. ఇకపోతే జీఎస్టీ రీఫార్మ్స్, ఆదాయ పన్ను తగ్గింపులు కలిపి వినియోగాన్ని రూ.5.31 లక్షల కోట్ల వరకూ పెంచుతాయని ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ చెబుతోంది. ఇది జీడీపీపై 1.6% ప్రభావం చూపనుంది.

అయితే ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు మాత్రం జీఎస్టీ స్లాబ్ మార్పులను సానుకూలంగా చూడడం లేదు. పన్ను ఆదాయం తగ్గుతుందని, దానికి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడు, పంజాబ్, బెంగాల్ రాష్ట్ర ఆర్థిక మంత్రులు ఈ విషయంపై స్పష్టమైన ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. మొత్తానికి, వినియోగదారులకు ఊరట కలిగించే ఈ కొత్త రూల్స్ ప్రభుత్వానికి ఆర్థిక సవాళ్లు తెచ్చిపెట్టబోతున్నాయనే సంకేతాలు వస్తున్నాయి.

Kumar

Recent Posts

ఐపీఎల్ 2026 అట్టర్ ఫ్లాప్

ఐపీఎల్ అంటేనే చివరి బంతి వరకు ఉండే ఉత్కంఠ. కానీ ఈసారి ఆ మజా పూర్తిగా తగ్గిపోయింది. పరుగుల వరద…

2 minutes ago

ఒక్క థియేట‌ర్ మీద ఇంత గొడ‌వా?

నిజామాబాద్‌లో న‌ట‌రాజ్ అనే ఒక సింగిల్ స్క్రీన్. దాని లీజ్ మార్పు గొడ‌వ టాలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. నిజామాబాద్ ఎస్వీసీ…

35 minutes ago

జెన్‌-జీ రాజకీయం మొదలుపెట్టిన పవన్

ఏపీ అధికార పార్టీ జ‌న‌సేన అధినేత‌, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. పార్టీలో యువ‌త‌రాన్ని ఆకర్షించేందుకు..…

2 hours ago

పాలన… ప్లానింగ్… బాగున్నాయి లోకేష్

పాల‌న విష‌యంలో మంత్రి లోకేష్ ప‌క్కా ప్లానింగ్‌తో వ్య‌వ‌హ‌రిస్తున్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. రాజ‌కీయాల‌ను విధాన‌ప‌ర‌మైన అంశాల‌ను క‌ల‌గాపుల‌గం…

4 hours ago

ఇక RCB అభిమానులను ఎవరు ఆపలేరు

పద్దెనిమిదేళ్ల అవమానాలు, ఎగతాళి మాటలకు బెంగళూరు జట్టు శాశ్వతంగా ముగింపు పలికింది. ఐపీఎల్ చరిత్రలో ట్రోల్స్ కు కేరాఫ్ అడ్రస్…

6 hours ago

గ్రేటర్ హైద‌రాబాద్ ఎల‌క్ష‌న్స్‌… ప్లాన్ ఏంటి సీఎం సార్?

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే పాల‌క మండ‌లి కూడా ర‌ద్ద‌యింది. ప్ర‌త్యేక అధికారి పాల‌న‌లోకి…

6 hours ago