Trends

ధోనీ నిర్ణయంతోనే జట్టులో చోటు కోల్పోయా

భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, తన కెరీర్‌లో కీలక సమయంలో జట్టులోంచి పక్కన పడటానికి అప్పటి కెప్టెన్ ఎం.ఎస్. ధోనీ నిర్ణయమే కారణమని బహిరంగంగా చెప్పాడు. ఇటీవలే వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఇదే తరహా ఆరోపణలు చేసిన నేపథ్యంలో, ఇర్ఫాన్ వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి. శ్రీలంకతో మ్యాచ్‌లో తాను, అన్న యూసఫ్ పఠాన్ కలిసి క్లిష్ట పరిస్థితుల్లో విజయాన్ని అందించినప్పటికీ, ఆ తరువాతి సిరీస్‌కే తనను పక్కన పెట్టారని ఇర్ఫాన్ చెప్పాడు.

ఇర్ఫాన్ మాట్లాడుతూ, ఆ మ్యాచ్‌లో 27 బంతుల్లో 60 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఉండగా, ఇద్దరం కలిసి మ్యాచ్ ను ఫినిష్ చేశాం. ఆ స్థాయిలో ప్రదర్శన చేసిన ఆటగాడిని సాధారణంగా ఏడాది పాటు అయినా జట్టులో ఉంచుతారని అనుకున్నా, కానీ నా విషయంలో అలా జరగలేదని అతను పేర్కొన్నాడు. న్యూజిలాండ్ పర్యటనలో మూడు మ్యాచ్‌లలో బెంచ్‌కే పరిమితం కాగా, నాలుగో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఐదో మ్యాచ్‌లో కూడా అవకాశం రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

అసలు కారణం తెలుసుకోవడానికి అప్పటి కోచ్ గ్యారీ కిర్‌స్టెన్‌ను సంప్రదించానని, ఆయన రెండు కారణాలు చెప్పారని ఇర్ఫాన్ వెల్లడించాడు. కొన్ని విషయాలు తన చేతుల్లో లేవని కిర్‌స్టెన్ చెప్పడంతో, తుది నిర్ణయం కెప్టెన్‌దేనని అర్థమైందని తెలిపాడు. ధోనీ తీసుకున్న నిర్ణయం సరైందా, కాదా అనేది తాను నిర్ణయించలేనని, కానీ ప్రతి కెప్టెన్‌కి తన స్టైల్‌లో జట్టును నడిపించే హక్కు ఉంటుందని అన్నాడు.

కిర్‌స్టెన్ చెప్పిన రెండో కారణం మరింత స్పష్టతనిచ్చింది. జట్టులో నం.7 స్థానంలో బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌ని ఉంచాలని నిర్ణయించారని, తన బ్రదర్ యూసఫ్ పఠాన్ ఆ కేటగిరీకి సరిపోతాడని, తాను మాత్రం బౌలింగ్ ఆల్‌రౌండర్ కాబట్టి చోటు కోల్పోయానని తెలిపాడు. ఆ సమయంలో ఒక్క ఆల్‌రౌండర్‌కి మాత్రమే అవకాశం ఉండగా, ఇప్పుడు జట్టులో ఇద్దరిని కూడా తీసుకుంటున్నారని వ్యాఖ్యానించాడు. 2009లో జట్టులో నుంచి తప్పుకున్న ఇర్ఫాన్, 2012లో తిరిగి వచ్చినా ఎక్కువ కాలం కొనసాగలేకపోయాడు. చివరగా 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక ఈ వ్యాఖ్యలతో మరోసారి ధోనీ నాయకత్వ కాలంలో తీసుకున్న సెలెక్షన్ నిర్ణయాలపై చర్చ మొదలైంది.

This post was last modified on August 16, 2025 6:23 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

కొత్త ట్విస్టు… కేరళ స్టోరీ 2 వస్తోంది

స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…

34 minutes ago

డీఎంకే స్ట్రోక్… బీజేపీకి షాక్!

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాల‌ని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ త‌గిలింది.…

55 minutes ago

జనసేన ఆఫీసుపై దాడి… ఎలా జరిగింది?

మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…

2 hours ago

మోడీ, షాలు ఇప్పుడేం చెబుతారు?

ఢిల్లీ మ‌ద్యం కేసులోత‌న‌ను నిర‌ప‌రాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయ‌న…

3 hours ago

మెరిసేదంతా బంగారమేనా… సంక్రాంతులన్నీ హిట్టేనా

టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…

3 hours ago

బాబు ఎఫెక్ట్.. ఏపీకి మరో బడా కంపెనీ

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వ‌స్తున్న సంస్థ‌లు కూట‌మి ప్ర‌భుత్వం ప‌ట్ల‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌ట్ల అత్యంత విశ్వ‌స‌నీయ‌త ప్ర‌ద‌ర్శిస్తున్న విష‌యం…

3 hours ago