భారత్ తన రక్షణ వ్యవస్థను మరింత బలపరచడానికి “సుదర్శన చక్రం” పేరుతో ఒక మల్టీ లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ ప్రాజెక్ట్ను ప్రారంభిస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ఈ ప్రణాళికను ప్రకటించారు. ఇది కేవలం క్షిపణి రక్షణ కవచమే కాకుండా, సైబర్ దాడుల నుండి భౌతిక దాడుల వరకు విస్తృత భద్రతను కల్పించే వ్యవస్థగా ఉండనుంది. ఇజ్రాయెల్ ‘ఐరన్ డోమ్’, అమెరికా ప్రతిపాదించిన ‘గోల్డెన్ డోమ్’ లాంటి విధంగానే ఇది పని చేస్తుంది.
ప్రస్తుతం భారత్ వద్ద ఉన్న “ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్” (IACCS) ఇప్పటికే పాకిస్థాన్ క్షిపణి దాడులను ఆపటంలో కీలక పాత్ర పోషించింది. కానీ సుదర్శన చక్రం ఈ స్థాయి రక్షణను మరింత విస్తరించి, అధునాతన టెక్నాలజీతో అప్డేట్ చేయబోతోంది. 2035 నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేయబడుతుందని మోదీ స్పష్టం చేశారు.
ఈ కొత్త వ్యవస్థలో క్షిపణి రక్షణతో పాటు, హ్యాకింగ్, ఫిషింగ్ వంటి సైబర్ ముప్పులను అడ్డుకునే సామర్థ్యం కూడా ఉంటుంది. ఇది రక్షణ పరిశోధన సంస్థలు, సైన్యం, ప్రైవేట్ ఇన్నోవేటర్స్ కలిసి పనిచేసే ప్రాజెక్ట్. విద్యుత్ గ్రిడ్లు, కమ్యూనికేషన్ నెట్వర్క్లు, నీటి సరఫరా, ఆరోగ్య మౌలిక సదుపాయాలు, రక్షణ స్థావరాలు వంటి కీలక ప్రాంతాలపై శత్రు దాడులను అడ్డుకోవడం ప్రధాన లక్ష్యం.
ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ 2011 నుంచి వేలాది రాకెట్లను అడ్డుకుని, దేశ భద్రతలో కీలక పాత్ర పోషిస్తోంది. అదే తరహా ప్రయోజనాలు భారత్కు సుదర్శన చక్రం ద్వారా లభించనున్నాయి. అమెరికా గోల్డెన్ డోమ్ ప్రణాళిక భూభాగం, సముద్రం, అంతరిక్షంలో రక్షణ కల్పించాలనుకుంటే, భారత్ ప్రస్తుత IACCSను కేంద్రీకరించి భూమి ఆకాశ రక్షణ నెట్వర్క్ను మరింత బలపరచనుంది.
ఈ ప్రాజెక్ట్ అమలులోకి వస్తే, భారత్ రక్షణ వ్యవస్థలో ఒక గేమ్చేంజర్గా నిలుస్తుంది. శత్రు దేశాల క్షిపణి దాడులు, డ్రోన్ల దాడులు, సైబర్ యుద్ధాలనుంచి దేశాన్ని కాపాడటమే కాకుండా, “ఆత్మనిర్భర్ భారత్” లక్ష్యానికి అనుగుణంగా స్వదేశీ రక్షణ ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుతుంది. సుదర్శన చక్రం పూర్తిస్థాయిలో పనిచేస్తే, భారత ఆకాశం మరింత సురక్షితంగా మారడం ఖాయం.
This post was last modified on August 15, 2025 10:55 pm
వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…
ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…
దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…