మహ్మద్ సిరాజ్.. చాలా ఏళ్లుగా మెరుపులు లేని హైదరాబాద్ క్రికెట్లో ఏకైక ఆశాకిరణంగా చెప్పొచ్చు. వీవీఎస్ లక్ష్మణ్, అంబటి రాయుడు, హనుమ విహారి లాంటి క్రికెటర్ల తర్వాత ఇక్కడి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఆటగాడతను. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా.. సహజ ప్రతిభతో అతను ఆ స్థాయికి చేరుకున్నాడు. అతను క్రికెటర్గా ఈ స్థాయికి చేరడంలో కీలక పాత్ర పోషించింది తండ్రి. ఆ తండ్రి ఇప్పుడు అర్ధంతరంగా తనువు చాలించాడు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన.. శుక్రవారం తుది శ్వాస విడిచాడు. ఐతే తండ్రిని కడసారి చూపు చూసే అవకాశం సిరాజ్కు లేకపోయింది.
సిరాజ్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నాడు ఐపీఎల్ ముగించుకున్నాక. భారత క్రికెట్ జట్టుతో పాటు అతను ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిపోయాడు. అక్కడ క్వారంటైన్లో ఉన్నాడు. ఇలాంటి సమయంలో తండ్రి చనిపోయాడు. చాన్నాళ్ల తర్వాత భారత జట్టులో అవకాశం దక్కింది సిరాజ్కు. ఇప్పుడు పర్యటన విరమించుకుని రాలేని పరిస్థితి. స్వదేశానికి వచ్చేస్తే సిరీస్కు దూరం కావాల్సిందే. మళ్లీ వెళ్లి క్వారంటైన్లో వ్యవధిని పూర్తి చేశాక కానీ జట్టుతో కలవలేడు. అప్పటికి సిరీస్ అయిపోతుంది. అతను స్వదేశానికి వచ్చే వరకు కూడా తండ్రి పార్థివ దేహాన్ని ఉంచే పరిస్థితి లేకపోవడంతో అంత్యక్రియలు పూర్తి చేసేస్తున్నారు. సిరాజ్ తండ్రి ఆటోవాలా కావడం గమనార్హం. అలాంటి నేపథ్యం నుంచి వచ్చిన కుర్రాడు అంతర్జాతీయ క్రికెట్ ఆడటం మామూలు విషయం కాదు. తమ కుటుంబ పరిస్థితులు ఏమాత్రం అనుకూలించకపోయినా కొడుకును క్రికెట్లో ప్రోత్సహించి అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా చేశాడు. అలాంటి తండ్రి చనిపోతే కడసారి చూపుకు నోచుకోలేకపోవడం దయనీయమే.
This post was last modified on November 21, 2020 12:36 am
ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది.…
పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ తన సొంత పార్టీతో నేరుగా…
ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం…
బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత తన దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వరలోనే…
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో భానుప్రియ ఒకరు. 80వ దశకంలో తెలుగులో ఉన్న అందరు అగ్రకథానాయికులతోనూ ఆమె…