మహ్మద్ సిరాజ్.. చాలా ఏళ్లుగా మెరుపులు లేని హైదరాబాద్ క్రికెట్లో ఏకైక ఆశాకిరణంగా చెప్పొచ్చు. వీవీఎస్ లక్ష్మణ్, అంబటి రాయుడు, హనుమ విహారి లాంటి క్రికెటర్ల తర్వాత ఇక్కడి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఆటగాడతను. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా.. సహజ ప్రతిభతో అతను ఆ స్థాయికి చేరుకున్నాడు. అతను క్రికెటర్గా ఈ స్థాయికి చేరడంలో కీలక పాత్ర పోషించింది తండ్రి. ఆ తండ్రి ఇప్పుడు అర్ధంతరంగా తనువు చాలించాడు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన.. శుక్రవారం తుది శ్వాస విడిచాడు. ఐతే తండ్రిని కడసారి చూపు చూసే అవకాశం సిరాజ్కు లేకపోయింది.
సిరాజ్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నాడు ఐపీఎల్ ముగించుకున్నాక. భారత క్రికెట్ జట్టుతో పాటు అతను ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిపోయాడు. అక్కడ క్వారంటైన్లో ఉన్నాడు. ఇలాంటి సమయంలో తండ్రి చనిపోయాడు. చాన్నాళ్ల తర్వాత భారత జట్టులో అవకాశం దక్కింది సిరాజ్కు. ఇప్పుడు పర్యటన విరమించుకుని రాలేని పరిస్థితి. స్వదేశానికి వచ్చేస్తే సిరీస్కు దూరం కావాల్సిందే. మళ్లీ వెళ్లి క్వారంటైన్లో వ్యవధిని పూర్తి చేశాక కానీ జట్టుతో కలవలేడు. అప్పటికి సిరీస్ అయిపోతుంది. అతను స్వదేశానికి వచ్చే వరకు కూడా తండ్రి పార్థివ దేహాన్ని ఉంచే పరిస్థితి లేకపోవడంతో అంత్యక్రియలు పూర్తి చేసేస్తున్నారు. సిరాజ్ తండ్రి ఆటోవాలా కావడం గమనార్హం. అలాంటి నేపథ్యం నుంచి వచ్చిన కుర్రాడు అంతర్జాతీయ క్రికెట్ ఆడటం మామూలు విషయం కాదు. తమ కుటుంబ పరిస్థితులు ఏమాత్రం అనుకూలించకపోయినా కొడుకును క్రికెట్లో ప్రోత్సహించి అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా చేశాడు. అలాంటి తండ్రి చనిపోతే కడసారి చూపుకు నోచుకోలేకపోవడం దయనీయమే.
This post was last modified on November 21, 2020 12:36 am
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. తన ఆధ్వర్యంలోని పంచాయితీ రాజ్ శాఖలో గత రెండేళ్లలో ఎన్నో మంచి కార్యక్రమాలు…
భారతీయ సినిమాలు ఆస్కార్ సాధించడం దశాబ్దాల కలగా మిగిలిపోయింది. అడపాదడపా ఎప్పుడో ఒకసారి తప్పించి ప్రతి సంవత్సరం దాన్ని అందుకునే…
నిన్న రిలీజైన కొత్త సినిమాలు ఏ దిశకు వెళ్తున్నాయో ఓపెనింగ్స్, పబ్లిక్ టాక్స్ స్పష్టం చేస్తున్నాయి. పూర్తి క్లారిటీ సోమవారానికి…
కెరీర్ ప్రారంభంలో రజనీకాంత్ అల్లుడిగా ఎక్కువ గుర్తింపు ఉన్నా చాలా తక్కువ టైంలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్న హీరోగా…
పాత క్లాసిక్స్, బ్లాక్ బస్టర్ సినిమాలకున్న అతి పెద్ద సమస్య ఒరిజినల్ నెగటివ్స్ లభ్యత. ఈ కారణంగానే జగదేకవీరుడు అతిలోకసుందరి,…
సాయిపల్లవి బాలీవుడ్ డెబ్యూ ఏక్ దిన్ ఇవాళ విడుదలయ్యింది. తెలుగులో ఒక రోజు పేరుతో డబ్బింగ్ చేశారు. అడ్వాన్స్ బుకింగ్స్…