Trends

అమెరికా మార్కెట్‌: చైనాకు భారత్ దెబ్బ

అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా ఫోన్ల హవా నడుస్తోంది. ప్రపంచంలోనే అత్యధికంగా మొబైల్‌ ఫోన్లు వినియోగించే దేశాల్లో ఒకటైన అమెరికాలో భారతీయ ఫోన్లు బలంగా అడుగుపెడుతున్నాయి. 2024 మొదటి ఐదు నెలల్లో భారత్ అమెరికాకు 21.3 మిలియన్‌ యూనిట్ల స్మార్ట్‌ఫోన్లు ఎగుమతి చేసింది. అంతేకాదు, మొత్తం దిగుమతుల్లో భారత్ వాటా ఏకంగా 36 శాతానికి చేరింది. గతేడాది ఇదే సమయానికి ఇది కేవలం 11 శాతమే. ఇదే సమయంలో చైనా దిగుమతులు భారీగా పడిపోయాయి.

చైనా ఇప్పటికీ అమెరికాకు అత్యధికంగా ఫోన్లు సరఫరా చేస్తున్నప్పటికీ.. అది తగ్గే దశలో ఉంది. జనవరి నుంచి మే మధ్య చైనా ఎగుమతులు 29.4 మిలియన్ల యూనిట్లకు పరిమితమయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 27 శాతం తగ్గుదల. ఇక మొత్తంగా 10 బిలియన్‌ డాలర్ల విలువైన ఫోన్లు చైనా పంపించగా, భారత్ నుంచి 9.35 బిలియన్‌ డాలర్ల ఫోన్లు వెళ్లాయి. మార్కెట్ వాటా దృష్ట్యా భారత్ ప్రస్తుతం రెండో స్థానంలో ఉండగా, వియత్నాం 14 శాతంతో మూడో స్థానంలో ఉంది.

అమెరికా మార్కెట్‌లో ఈ ఫోన్లలో అధిక శాతం యాపిల్ ఫోన్లే. గతంలో యాపిల్ పూర్తిగా చైనాపైనే ఆధారపడితే, ఇప్పుడు భారత్‌పై దృష్టి పెట్టింది. దీనికి ప్రధాన కారణం కేంద్రం అమలు చేస్తున్న ఉత్పత్తి ప్రోత్సాహకాల పథకం (PLI). ఇది భారతీయ మానుఫ్యాక్చరింగ్ రంగానికి గేమ్ ఛేంజర్‌గా మారింది. మొదట పాత మోడళ్లను మాత్రమే తయారు చేసిన యాపిల్, ఇప్పుడు ప్రో మోడళ్లను కూడా భారత్‌లోనే తయారు చేస్తోంది.

యాపిల్ ఉత్పత్తి వ్యూహాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఓవిధంగా తప్పుపట్టారు. ఐఫోన్లు అమెరికాలో తయారు చేయాలని, లేనిపక్షంలో భారీ సుంకాలు విధిస్తానని హెచ్చరించారు. అయినా కూడా టిమ్ కుక్ నేతృత్వంలోని యాపిల్ కంపెనీ భారతీయ తయారీదారులనుే అభిముఖంగా మార్చుకుంది. ఫాక్స్‌కాన్, విస్ట్రాన్, పెగాట్రాన్ వంటి సంస్థల ద్వారా యాపిల్ తయారీ విస్తరిస్తోంది.

తాజాగా ఫాక్స్‌కాన్ తమిళనాడులో కొత్త ప్లాంట్ కోసం రూ.12,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించింది. దీనితో భారతదేశం నుంచి అమెరికాకు స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు మరింత పెరిగే అవకాశం ఉంది. ఒక్కవేళ ఇదే తీరు కొనసాగితే.. వచ్చే సంవత్సరంలో భారత్ అమెరికా మొబైల్‌ మార్కెట్‌ను డామినేట్ చేసే రోజులు కూడా దగ్గరలోనే ఉండవచ్చు.

This post was last modified on July 26, 2025 4:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

11 రూపాయల టికెట్లు రాంగా రైటా

ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…

5 hours ago

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

8 hours ago

సభలోకి దేవుడిని లాగడం కరెక్టేనా?

ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో శాస‌న స‌భ‌ను బాయ్‌కాట్ చేసిన వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు శాస‌న మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…

8 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

9 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

9 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

11 hours ago