Trends

డ్ర‌గ్స్‌-గంజాయి: దొరికిపోతున్న ఏఎస్పీ, డీసీపీల పిల్ల‌లు!

స‌మాజాన్ని స‌రైన దారిలో పెట్టాల్సిన పోలీసులే.. దారి త‌ప్పుతున్నారు. బ‌యట ఏం జ‌రుగుతోందో తెలుసుకునే ప్ర‌య‌త్నంలో వారి కుటుంబాలు గాడి త‌ప్పుతున్న విష‌యాన్ని మ‌రిచిపోతున్నారు. ఏపీలోనూ.. తెలంగాణ‌లోనూ.. ఇలాంటి ప‌రిస్థితే ఎదుర‌వుతోంది. విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన ఓ ఏఎస్ఐ కుమారుడికి ఉగ్ర‌వాదుల‌తో లింకులు ఉన్న విష‌యం వెలుగు చూసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ కేసు విచార‌ణ ద‌శ‌లో ఉంది.

ఇది మ‌రుపున‌కు రాక‌ముందే.. విశాఖ జిల్లాకు చెందిన ఓ సీఐ కుమారుడు గంజాయి ర‌వాణా కేసులో ప‌ట్టు బ‌డ్డార‌న్న వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. దీనిని అధికారులు దాచిపెట్టార‌న్న విమ‌ర్శ‌లు కూడా తెర‌మీదికి వ‌చ్చాయి. మ‌రోవైపు.. తెలంగాణ‌లో వీటిని మించిన కేసులు వివాదంగా మారాయి. ఏకంగా డ్ర‌గ్స్ కేసుల్లో ఎస్పీ, డీసీపీ కుమారుల పేర్లు తెర‌మీదికి రావ‌డం గ‌మ‌నార్హం. హైద‌రాబాద్ శివారు ప్రాంతం కొంప‌ల్లిలో కొన్నాళ్ల కింద‌ట డ్ర‌గ్స్ కేసు వెలుగు చూసింది. దీనిని ఈగ‌ల్ టీం ప్ర‌తిష్టాత్మ‌కంగా విచారిస్తోంది.

సీఎంవో ఈ విచార‌ణ‌ను ప‌ర్య‌వేక్షిస్తున్న విష‌యం తెలిసిందే. ఎంతటి వారు ఈ కేసులో ఉన్నా.. వ‌దిలి పెట్ట‌రాద‌ని సీఎం స‌హా అధికారులు కూడా స్ప‌ష్టం చేశారు. ఈ నేప‌థ్యంలో ఈ కేసును తీవ్రంగా భావిస్తున్న అధికారులు అన్ని కోణాల్లోనూ విచార‌ణ చేస్తున్నారు. దీంతో ఉన్న‌తాధికారుల కుమారుల పేర్లు తెర‌మీదికి వ‌చ్చాయి. రాష్ట్ర‌ ఇంటెలిజెన్స్‌ అదనపు ఎస్పీ వేణుగోపాల్‌ కుమారుడు రాహుల్‌ తేజ ఈ కేసులో ఉన్నార‌ని తెలిసింది. దీంతో ఆయ‌న జీవ‌న శైలి, వ్య‌వహారాల‌పై అధికారులు కూపీ లాగుతున్నారు.

గ‌త ఏడాది న‌మోదైన ఈ కేసును విచారిస్తున్న పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ‌కుండా రాహుల్ త‌ప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో ఆయ‌న త‌ప్పించుకుని తిరిగేందుకు ఎవ‌రు స‌హ‌క‌రిస్తున్నార‌న్న విష‌యంపైనా అధికారులు కూపీ లాగుతున్నారు. మ‌రోవైపు.. ఇప్ప‌టి వ‌ర‌కు అరెస్టయినవారిలో నిందితుడుగా ఉన్న‌ మోహన్‌ సైబరాబాద్‌ డీసీపీ సంజీవరావు కుమారుడిగా గుర్తించారు. దీంతో పోలీసు వ‌ర్గాలు విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నాయి. ప్ర‌స్తుతం ఉన్న చ‌ట్టాల ప్ర‌కారం.. నేరం రుజువైతే.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంద‌ని చెబుతున్నారు.

Satya

Recent Posts

అత్తెసరు వసూళ్లతో ముంచేసేలా ఉంది

హీరోయిన్ కంగనా రౌనత్ టైం ఏ మాత్రం బాలేదు. పట్టిందల్లా ప్లాస్టిక్ అన్న తరహాలో ఏ జానర్ సినిమా చేసినా…

15 minutes ago

‘చంద్రబాబు భరోసానిచ్చారు… మాకు అది చాలు’

ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…

2 hours ago

త్రినేత్రుడి కన్నెర్రకు ప్రతిరూపం ‘నాగబంధం’

విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…

3 hours ago

బాలయ్యతో కాజల్… గ్లామర్ కు దూరంగా పవర్ఫుల్ రోల్

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…

5 hours ago

ఈ సమయంలో మౌనమేల షర్మిల గారు?

విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…

5 hours ago

సాయికృష్ణ కుటుంబానికి చంద్రబాబు భరోసా

విజయవాడలో కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని ఆరోపణలు రావడం రాజకీయ దుమారం రేపిన…

6 hours ago