Trends

1993 ముంబై పేలుళ్లను సంజయ్ దత్ ఆపగలిగేవారా?

1993, మార్చి 12…ముంబై బాంబు పేలుళ్ల ఘటన జరిగి దాదాపు 32 ఏళ్లు కావస్తోంది. అయినా సరే, ఆ పేలుళ్ల గురించి వార్తల్లో వింటే చాలు ఆ పేలుళ్ల బాధితులు, పేలుళ్లలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు ఉలిక్కి పడతారు. ఒక్క రోజులోనే ముంబైలోని 12 ప్రాంతాల్లో పేలుళ్లకు ముష్కరులు పాల్పడ్డారు. ఆ పేలుళ్లలో మొత్తం 257 మంది చనిపోగా..1400 మంది గాయపడ్డారు. అయితే, వేలాదిమందికి పీడకలగా మిగిలిన ఆ భయానక ఉగ్రదాడి జరగకుండా ఆపే చాన్స్ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు ఉందా? సంజయ్ దత్ సరైన సమయంలో పోలీసులకు సమాచారం ఇచ్చి ఉంటే ఆ ఉగ్రదాడి జరిగేది కాదా? అంటే అవును అనే సమాధానిస్తున్నారు ప్రముఖ న్యాయవాది, బీజేపీ నేత, రాజ్య సభ సభ్యుడు ఉజ్వల్ నికమ్.

ముంబై పేలుళ్ల ఘటన గురించి ఉజ్వల్ నిక్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సంజయ్ దత్ తలుచుకుని ఉంటే ఆ పేలుళ్లను ఆపి ఉండేవాడని ఆయన చేసిన కామెంట్లు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ముంబై పేలుళ్లకు కొద్ది రోజుల ముందు సంజయ్ దత్ ఇంటికి ఆయుధాలతో నిండిన ఓ వ్యాన్ ను దావూద్ ఇబ్రహీం అనుచరుడు అబూ సలేం తీసుకువచ్చాడని ఆయన అన్నారు. ఆ వ్యాన్‌లో ఏకే 47 తుపాకులు, బాంబులు ఉన్నాయని, అందులో నుంచి సంజయ్ దత్ ఒక ఏకే 47 తుపాకీని తీసుకున్నారని చెప్పారు.

ఆ ఆయుధాల వ్యాన్ గురించి పోలీసులకు సంజయ్ దత్ సమాచారం ఇచ్చి ఉంటే ఆ పేలుళ్లు జరిగేవి కావని అభిప్రాయపడ్డారు. సంజయ్ దత్ సరిగ్గా స్పందించి ఉంటే ఆ పేలుళ్లలో అంత మంది చనిపోయి ఉండేవారు కాదని అన్నారు. ముంబై పేలుళ్లతో సంబంధం ఉందన్న కారణంతో సంజయ్‌ దత్ పై టాడా యాక్ట్ ప్రకారం కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే, ఆ కేసులో సంజయ్‌ దత్ ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అక్రమంగా ఏకే 47 వంటి ఆయుధాలు కలిగి ఉన్నందుకు సంజయ్‌ దత్ కు కోర్టు ఐదేళ్లు జైలు శిక్ష విధించింది.

This post was last modified on July 15, 2025 3:37 pm

Share

Recent Posts

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

11 minutes ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

55 minutes ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

2 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

2 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

2 hours ago

పోలీసులు కాదు.. భార్య గ‌ద్దిస్తే నిజం చెప్పాడు!

స‌హ‌జంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితుల‌ను పోలీసులు ప్ర‌శ్నిస్తారు. ముందు మాట‌ల‌తో.. త‌ర్వాత త‌మ‌దైన లాఠీ శైలితోనూ…

5 hours ago