1993, మార్చి 12…ముంబై బాంబు పేలుళ్ల ఘటన జరిగి దాదాపు 32 ఏళ్లు కావస్తోంది. అయినా సరే, ఆ పేలుళ్ల గురించి వార్తల్లో వింటే చాలు ఆ పేలుళ్ల బాధితులు, పేలుళ్లలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు ఉలిక్కి పడతారు. ఒక్క రోజులోనే ముంబైలోని 12 ప్రాంతాల్లో పేలుళ్లకు ముష్కరులు పాల్పడ్డారు. ఆ పేలుళ్లలో మొత్తం 257 మంది చనిపోగా..1400 మంది గాయపడ్డారు. అయితే, వేలాదిమందికి పీడకలగా మిగిలిన ఆ భయానక ఉగ్రదాడి జరగకుండా ఆపే చాన్స్ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు ఉందా? సంజయ్ దత్ సరైన సమయంలో పోలీసులకు సమాచారం ఇచ్చి ఉంటే ఆ ఉగ్రదాడి జరిగేది కాదా? అంటే అవును అనే సమాధానిస్తున్నారు ప్రముఖ న్యాయవాది, బీజేపీ నేత, రాజ్య సభ సభ్యుడు ఉజ్వల్ నికమ్.
ముంబై పేలుళ్ల ఘటన గురించి ఉజ్వల్ నిక్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సంజయ్ దత్ తలుచుకుని ఉంటే ఆ పేలుళ్లను ఆపి ఉండేవాడని ఆయన చేసిన కామెంట్లు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ముంబై పేలుళ్లకు కొద్ది రోజుల ముందు సంజయ్ దత్ ఇంటికి ఆయుధాలతో నిండిన ఓ వ్యాన్ ను దావూద్ ఇబ్రహీం అనుచరుడు అబూ సలేం తీసుకువచ్చాడని ఆయన అన్నారు. ఆ వ్యాన్లో ఏకే 47 తుపాకులు, బాంబులు ఉన్నాయని, అందులో నుంచి సంజయ్ దత్ ఒక ఏకే 47 తుపాకీని తీసుకున్నారని చెప్పారు.
ఆ ఆయుధాల వ్యాన్ గురించి పోలీసులకు సంజయ్ దత్ సమాచారం ఇచ్చి ఉంటే ఆ పేలుళ్లు జరిగేవి కావని అభిప్రాయపడ్డారు. సంజయ్ దత్ సరిగ్గా స్పందించి ఉంటే ఆ పేలుళ్లలో అంత మంది చనిపోయి ఉండేవారు కాదని అన్నారు. ముంబై పేలుళ్లతో సంబంధం ఉందన్న కారణంతో సంజయ్ దత్ పై టాడా యాక్ట్ ప్రకారం కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే, ఆ కేసులో సంజయ్ దత్ ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అక్రమంగా ఏకే 47 వంటి ఆయుధాలు కలిగి ఉన్నందుకు సంజయ్ దత్ కు కోర్టు ఐదేళ్లు జైలు శిక్ష విధించింది.
This post was last modified on July 15, 2025 3:37 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…