రాత్రివేళ స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేయాలనుకున్న బెంగుళూరు లోని యువకుల సమూహం అనూహ్య విషాదానికి దారితీసింది. 20 ఏళ్ల యువతి ఒక అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ టెరస్పై నుంచి ప్రమాదవశాత్తు పడిపోయి మృతిచెందింది. ఈ ఘటన పరప్పన అగ్రహార ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు ప్రాథమికంగా వెల్లడించిన వివరాల ప్రకారం, ఆమె రాత్రి సమయంలో ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసేందుకు అక్కడికి వెళ్లింది.
మధ్యలో ఓ గొడవ మొదలవడంతో ఉద్వేగానికి లోనైన ఆమె, ఒక్కసారిగా పైకి వెళ్లి ‘సాడ్ రీల్’ తీస్తుండగా ప్రమాదవశాత్తూ ఎత్తైన స్థలం నుంచి జారిపడింది. బిల్డింగ్ 13వ అంతస్తు పైభాగంలో ఓ ఎలివేటర్ షాఫ్ట్ ప్రాంతంలోకి ఆమె పడిపోయిందని పోలీసులు తెలిపారు. ఆమె అసలు నివాసం బీహార్ కాగా, ప్రస్తుతం బెంగళూరులో ఓ షాపింగ్ మార్ట్లో పనిచేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
ఈ ఘటన తరువాత, ఆమెతో వచ్చిన స్నేహితులు అక్కడినుంచి పరారయ్యారు. స్పాట్పై విచారణ చేపట్టిన పోలీసులు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించేందుకు సీసీ టీవీ ఫుటేజ్, కాల్ రికార్డులు పరిశీలిస్తున్నారు. డీసీపీ ఫాతిమా మీడియాతో మాట్లాడుతూ “అవును, వారు బిల్డింగ్లో పార్టీ చేసుకున్నారు. తరువాత రీల్స్ తీయటానికి టెరస్కి వెళ్లారు. అప్పుడు ఆమె జారి పడిపోయింది. ప్రస్తుతం ప్రేమ విషయాల గొడవ వలన జరిగిందా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. మేము విచారణను కొనసాగిస్తున్నాం” అని తెలిపారు.
This post was last modified on June 26, 2025 5:47 pm
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…