ప్రపంచాన్ని వణికించేస్తున్న కరోనా వైరస్ మహమ్మారికి విరుగుడు టీకా మనదేశానికి వచ్చేసింది. రష్యా డెవలప్ చేసిన స్పుత్నిక్-వి వ్యాక్సిన బుధవారం భారత్ కు చేరుకుంది. రష్యాలోని గమలేయా నేషనల్ రీసెర్చి ఇన్ స్టిట్యూట్ ఎపిడమియాలజీ అండ్ మైక్రో బయాలజీ సంస్ధతో కలిసి భారత్ లోని రెడ్డీ ల్యాబరేటరీస్ కరోనా టీకా రెడీ చేస్తున్న విషయం తెలిసిందే. అందుకనే స్పుత్నిక్-వి వ్యాక్సిన్ను రెడ్డీ ల్యాబరేటరీస్ అందుకుంది. ఇదే వ్యాక్సిన్ను రష్యాలోని 42 వేలమందిపై క్లినికల్ ట్రయల్స్ గా ప్రయోగిచింది.
దేశంలోని సుమారు 2 వేల మందికి క్లినికల్ ట్రయల్స్ కోసం ఈ వ్యాక్సిన్ను వేయటానికి రెడ్డీ ల్యాబరేటరీస్ ఏర్పాట్లు చేసుకుంటోంది. రష్యా డెవలప్ చేసిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్ను మనదేశంలో రెండు, మూడో స్టేజి క్లినికల్ ట్రయల్స్ రూపంలో ప్రయోగించబోతున్నారు. ఈ నెల 15వ తేదీ క్లినికల్ ట్రయల్స్ విషయంలో రెడ్డీ ల్యాబరేటరీస్ యాజమాన్యం అందుబాటులోకి తెస్తోంది.
ఈ క్లినికల్ ట్రయల్స్ ప్రభావం రోగులపై ఏ విధంగా పనిచేస్తుందనే విషయాన్ని రెడ్డీ ల్యాబరేటరీస్ సంస్ధ మానిటర్ చేస్తుంది. ఇప్పటికే తమ వ్యాక్సిన సక్సెస్ రేటు 92 శాతం ఉన్నట్లుగా రష్యా ఫార్మా కంపెనీ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి భారత్ లో కూడా తమ క్లినికల్ ట్రయల్స్ విజయవంతం అవుతాయని సదరు సంస్ధ భావిస్తోంది. క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను ల్యాబరేటరీస్ యాజమాన్యం ఎప్పటికప్పుడు కేంద్రప్రభుత్వానికి అందచేయబోతోంది.
మొత్తం నివేదిక అందిన తర్వాత కేంద్రప్రభుత్వ ఔషధ నియంత్రణ మండలి సమీక్ష చేసి ఓ నివేదిక తయారు చేస్తుంది. ఇక్కడ గనుక క్లినికల్ ట్రయల్స్ సక్సెస్ అయితే బహుశా రష్యా ఫార్మా కంపెనీ భాగస్వామ్యంతో భారత్ లో రెడ్డీ ల్యాబరేటరీస్ ఆధ్వర్యంలో పూర్తిస్ధాయి వ్యాక్సిన్ రెడీ అవుతుంది. వ్యాక్సిన్ సక్సెస్ అయితే రెడ్డీ ల్యాబరేటరీస్ 10 కోట్ల డోసులు తయారు చేయటానికి రెడీ అవుతోంది.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…