Trends

ఇరాన్ – ఇజ్రాయిల్.. వాట్సాప్ తో హత్యలా?

ఇరాన్‌లో కీలక వ్యక్తులపై జరుగుతున్న సుతిమెత్తని హత్యల వెనక డిజిటల్ సమాచారమే కారణమా? ఇదే ప్రశ్న ఇప్పుడు అంతర్జాతీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. తాజా వివాదంలో ఫోకస్ గా మారింది వాట్సాప్ యాప్. ఈ యాప్ ద్వారా వినియోగదారుల డేటా ఇజ్రాయిల్ ఆర్మీకి లీకవుతోందన్న అనుమానాల నేపథ్యంలో.. ఇరాన్ ప్రభుత్వం ప్రజలను వాట్సాప్ తొలగించమంటూ పిలుపునిచ్చింది.

ఇరానియన్ ప్రభుత్వ టీవీ ప్రసారం చేసిన ఓ ప్రకటనలో, వాట్సాప్ యాప్ వినియోగదారుల సమాచారం సేకరించి ఇజ్రాయిల్‌కు అందిస్తోందని ఆరోపణలు వచ్చాయి. అయితే ఇది ఇప్పటిదాకా అధికారికంగా నిరూపించబడలేదు. అయినా, ఇటీవలి కాలంలో ఇరాన్‌కు చెందిన కీలక వ్యక్తుల ప్రాణాలపై జరిగిన దాడుల అచ్చుతప్పు స్థితిగతులను చూస్తే, ఈ అనుమానాలు ఏ మాత్రం తేలికగా తీసుకునేలా లేవు.

దీనిపై వాట్సాప్ సంస్థ అయిన మెటా స్పష్టమైన స్పందన ఇచ్చింది. “ఇది పూర్తిగా తప్పుడు ఆరోపణ. మేము ఎక్కడా వినియోగదారుల ఖచ్చితమైన లోకేషన్ ట్రాక్ చేయం, వారి సందేశాల లాగ్‌లు ఉంచం. మేము ఎవరితో ఎవరు మాట్లాడుతున్నారన్నది కూడా గమనించం,” అని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అంతేకాదు, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్‌ ఉన్న మాధ్యమం కాబట్టి సందేశాన్ని పంపినవాడి నుండి స్వీకరించినవాడికే తెలుస్తుందని స్పష్టం చేశారు.

అయితే, సైబర్ భద్రతా నిపుణులు దీన్ని సంపూర్ణ భద్రతగా పరిగణించడం లేదు. మెటాడేటా అనే సమాచారం, అంటే సందేశం ఎప్పుడు పంపబడింది, ఎవరి ఫోన్‌కి వెళ్లింది వంటి విషయాలు కొన్ని సందర్భాల్లో బయటపడే అవకాశముంటుందని హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో అమెరికా టెక్ కంపెనీలు ఇజ్రాయిల్ ప్రభుత్వానికి సహకరిస్తున్నాయన్న ఆరోపణలు కూడా గతంలో రాగా, వాటిపై కంపెనీలు మాత్రం ఎప్పుడూ నిరాకరణ తెలిపాయి.

ఇకపోతే, ఇజ్రాయిల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఓ కంపెనీ అభివృద్ధి చేసిన పెగాసస్ స్పైవేర్ ద్వారా వాట్సాప్ వంటి యాప్‌లను హ్యాక్ చేయడం ఇప్పటికే న్యూస్‌ల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో వాట్సాప్ గతంలో న్యూయార్క్ కోర్టులో ఎన్‌ఎస్‌ఓపై కేసు కూడా వేసిన విషయం తెలిసిందే. ఈ వివాదం మరోసారి డిజిటల్ ప్రైవసీపై ప్రపంచాన్ని ఆలోచింపజేస్తోంది.

This post was last modified on June 18, 2025 2:57 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

6 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

6 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

7 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

9 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

9 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

10 hours ago