భాగ్య నగరి హైదరాబాద్ ఐటీలో దూసుకుపోతోంది. నాడు టీడీపీ అధినేత, ప్రస్తుత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వేసిన ఐటీ అడుగులు… ఇప్పుడు పరుగులు పెడుతున్నాయి. ఇప్పటికే ప్రపంచంలోని దాదాపుగా అన్ని ఐటీ దిగ్గజాల కార్యాలయాలు హైదరాబాద్ లో ఉన్నాయి. తాజాగా భాగ్యనగరిలో మంగళవారం గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ (జీఎస్ఈసీ) ఓపెన్ అయిపోయింది. దీనిని సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబులు ప్రారంభించారు.
ఇప్పుడు హైదరాబాద్ లో ఏర్పాటు అయిన జీఎస్ఈసీ కి ఓ ప్రత్యేకత ఉంది. గూగుల్ ఈ తరహాలో జీఎస్ఈసీ లు ప్రపంచంలో మరికొన్ని చోట్ల ఉండవచ్చు గానీ…ఆసియా ఫసిపిక్ ప్రాంతంలో మాత్రం హైదరాబాద్ సెంటరే మొదటిది. ఇప్పటికే గూగుల్ తన విస్తరణకు హైదరాబాద్ ను కీలక స్థావరంగా పరిగణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కారణంగానే ఆసియా ఫసిపిక్ ప్రాంతంలో ఏ కొత్త కేంద్రాన్ని ప్రారంభించాలన్నా… గూగుల్ తన తొలి ప్రాధాన్యాన్ని హైదరాబాద్ కే ఇస్తోంది.
1990 దశకంలో ఐటీలో అప్పుడప్పుడు బుడిబుడి అడుగులు ప్రారంభించిన హైదరాబాద్ కు గూగుల్, మైక్రోసాఫ్ట్ చాలా కంపెనీలు చంద్రబాబు కృషితో క్యూ కట్టాయి. అప్పటిదాకా కొండలు, గుట్లతో కూడిన సైబరాబాద్ ఈ ఐటీ కంపెనీల రాకతో సర్వాంగ సుందరమైన నగరంగా ఆవిర్భవించింది. ఐటీ రంగంలో విదేశీ సంస్థలే హైదరాబాద్ కు క్యూ కడుతున్న నేపథ్యంలో దేశీయ ఐటీ దిగ్గజాలు కూడా హైదరాబాద్ ను గమ్యస్థానంగా మార్చుకుని కార్యకలాపాలు సాగిస్తున్నాయి. తాాజాగా ఇప్పుడు జీఎస్ఈసీ హైదరాబాద్ లో ఏర్పాటు కావడంతో నగరానికి మరింత ప్రాధాన్యం దక్కిందని చెప్పక తప్పదు.
This post was last modified on June 18, 2025 2:46 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…