భాగ్య నగరి హైదరాబాద్ ఐటీలో దూసుకుపోతోంది. నాడు టీడీపీ అధినేత, ప్రస్తుత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వేసిన ఐటీ అడుగులు… ఇప్పుడు పరుగులు పెడుతున్నాయి. ఇప్పటికే ప్రపంచంలోని దాదాపుగా అన్ని ఐటీ దిగ్గజాల కార్యాలయాలు హైదరాబాద్ లో ఉన్నాయి. తాజాగా భాగ్యనగరిలో మంగళవారం గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ (జీఎస్ఈసీ) ఓపెన్ అయిపోయింది. దీనిని సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబులు ప్రారంభించారు.
ఇప్పుడు హైదరాబాద్ లో ఏర్పాటు అయిన జీఎస్ఈసీ కి ఓ ప్రత్యేకత ఉంది. గూగుల్ ఈ తరహాలో జీఎస్ఈసీ లు ప్రపంచంలో మరికొన్ని చోట్ల ఉండవచ్చు గానీ…ఆసియా ఫసిపిక్ ప్రాంతంలో మాత్రం హైదరాబాద్ సెంటరే మొదటిది. ఇప్పటికే గూగుల్ తన విస్తరణకు హైదరాబాద్ ను కీలక స్థావరంగా పరిగణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కారణంగానే ఆసియా ఫసిపిక్ ప్రాంతంలో ఏ కొత్త కేంద్రాన్ని ప్రారంభించాలన్నా… గూగుల్ తన తొలి ప్రాధాన్యాన్ని హైదరాబాద్ కే ఇస్తోంది.
1990 దశకంలో ఐటీలో అప్పుడప్పుడు బుడిబుడి అడుగులు ప్రారంభించిన హైదరాబాద్ కు గూగుల్, మైక్రోసాఫ్ట్ చాలా కంపెనీలు చంద్రబాబు కృషితో క్యూ కట్టాయి. అప్పటిదాకా కొండలు, గుట్లతో కూడిన సైబరాబాద్ ఈ ఐటీ కంపెనీల రాకతో సర్వాంగ సుందరమైన నగరంగా ఆవిర్భవించింది. ఐటీ రంగంలో విదేశీ సంస్థలే హైదరాబాద్ కు క్యూ కడుతున్న నేపథ్యంలో దేశీయ ఐటీ దిగ్గజాలు కూడా హైదరాబాద్ ను గమ్యస్థానంగా మార్చుకుని కార్యకలాపాలు సాగిస్తున్నాయి. తాాజాగా ఇప్పుడు జీఎస్ఈసీ హైదరాబాద్ లో ఏర్పాటు కావడంతో నగరానికి మరింత ప్రాధాన్యం దక్కిందని చెప్పక తప్పదు.
This post was last modified on June 18, 2025 2:46 pm
రెండు నెలల కిందట రిలీజైన దురంధర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవలం…
బుల్లితెరపై ఘన చరిత్ర ఉన్న ఈటీవీ ప్రభాకర్ నట వారసత్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్రహాస్.. తన…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. పంది, ఆవు కొవ్వులను కూడా వినియోగించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్దగా కేటాయింపులు ఏమీ…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…