Trends

కొత్త టెక్నాలజీ.. విమానం కూలినా అందరూ సేఫ్

అహ్మదాబాద్‌లో ఇటీవలి ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశంలో తీవ్ర విషాదాన్నే నింపింది. అహ్మదాబాద్ నుంచి లండన్‌కు ప్రయాణమైన నిమిషం లోపే విమానం కూలిపోవడంతో ప్లేన్లో ఉన్న 242 మందిలో ఒక్కరు మినహా దుర్మరణం పాలయ్యారు. ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడడం కూడా మిరాకిల్ అనే చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఘోర విమాన ప్రమాదాలు ఎన్నో జరిగాయి. ప్రతి సందర్భంలోనూ విమానాల్లో ఉన్న వారంతా ప్రాణాలు కోల్పోవడమే జరుగుతుంటుంది.

ఐతే ఇలా ప్లేన్స్ కూలినపుడు ప్రయాణికులు సురక్షితంగా బయటపడడానికి అవకాశమే లేదా? ఆ రకమైన టెక్నాలజీని అభివృద్ధి చేయడం అసాధ్యమా అనే ప్రశ్నలు ఎప్పట్నుంచో ఉన్నాయి. అందుకు సమాధానం వెతికే ప్రయత్నం చేసింది ఉక్రెయిన్. విమానాలు కూలినా ప్రయాణికులు సురక్షితంగా బయటపడేలా ఆ దేశం ఒక సాంకేతికను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్రయల్ రన్స్ నడుస్తున్నాయట. విమానంలో ప్రయాణికులు ఉన్న కంటైనర్.. ప్రమాదాల సమయంలో విడిపోయేలా, అది సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా ఉక్రెయిన్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఒక సాంకేతికతను అభివృద్ధి చేశారు.

విమానం కూలిపోయే సంకేతాలు కనిపించగానే ఒక బటన్ నొక్కితే ప్రయాణికులు ఉన్న కంటైనర్ ఇంజిన్ నుంచి వేరైపోతుంది. ఈ కంటైనర్ పైన ఉన్న భారీ ప్యారాచ్యూట్లు ఓపెన్ అవుతాయి. అవి సేఫ్‌గా కంటైనర్‌ను ల్యాండ్ చేస్తాయి. భూమి మీద అయినా, నీళ్ల మీద అయినా.. ఏ ఇబ్బంది లేకుండా కంటైనర్ ల్యాండ్ అయ్యేలా కింద కుషన్స్ యాక్టివేట్ అయి సర్దుకుంటాయి. దీంతో ప్రయాణికులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడతారు. దీనికి సంబంధించిన యానిమేటెడ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతోంది. నిజంగా ఈ టెక్నాలజీ అమల్లోకి వస్తే విమానయానంలో అదొక విప్లవాత్మక మార్పుగా మారడం ఖాయం. కాకపోతే దీనికి భారీగానే ఖర్చవుతుంది. ఇలాంటి విమానాల్లో ప్రయాణాలు కూడా ఖరీదుగా మారొచ్చు. ఈ ప్రయోగం విజయవంతం అవ్వాలని ఆశిద్దాం.

Satya

Recent Posts

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

2 hours ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

2 hours ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

2 hours ago

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

4 hours ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

5 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

5 hours ago