Trends

కొత్త టెక్నాలజీ.. విమానం కూలినా అందరూ సేఫ్

అహ్మదాబాద్‌లో ఇటీవలి ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశంలో తీవ్ర విషాదాన్నే నింపింది. అహ్మదాబాద్ నుంచి లండన్‌కు ప్రయాణమైన నిమిషం లోపే విమానం కూలిపోవడంతో ప్లేన్లో ఉన్న 242 మందిలో ఒక్కరు మినహా దుర్మరణం పాలయ్యారు. ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడడం కూడా మిరాకిల్ అనే చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఘోర విమాన ప్రమాదాలు ఎన్నో జరిగాయి. ప్రతి సందర్భంలోనూ విమానాల్లో ఉన్న వారంతా ప్రాణాలు కోల్పోవడమే జరుగుతుంటుంది.

ఐతే ఇలా ప్లేన్స్ కూలినపుడు ప్రయాణికులు సురక్షితంగా బయటపడడానికి అవకాశమే లేదా? ఆ రకమైన టెక్నాలజీని అభివృద్ధి చేయడం అసాధ్యమా అనే ప్రశ్నలు ఎప్పట్నుంచో ఉన్నాయి. అందుకు సమాధానం వెతికే ప్రయత్నం చేసింది ఉక్రెయిన్. విమానాలు కూలినా ప్రయాణికులు సురక్షితంగా బయటపడేలా ఆ దేశం ఒక సాంకేతికను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్రయల్ రన్స్ నడుస్తున్నాయట. విమానంలో ప్రయాణికులు ఉన్న కంటైనర్.. ప్రమాదాల సమయంలో విడిపోయేలా, అది సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా ఉక్రెయిన్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఒక సాంకేతికతను అభివృద్ధి చేశారు.

విమానం కూలిపోయే సంకేతాలు కనిపించగానే ఒక బటన్ నొక్కితే ప్రయాణికులు ఉన్న కంటైనర్ ఇంజిన్ నుంచి వేరైపోతుంది. ఈ కంటైనర్ పైన ఉన్న భారీ ప్యారాచ్యూట్లు ఓపెన్ అవుతాయి. అవి సేఫ్‌గా కంటైనర్‌ను ల్యాండ్ చేస్తాయి. భూమి మీద అయినా, నీళ్ల మీద అయినా.. ఏ ఇబ్బంది లేకుండా కంటైనర్ ల్యాండ్ అయ్యేలా కింద కుషన్స్ యాక్టివేట్ అయి సర్దుకుంటాయి. దీంతో ప్రయాణికులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడతారు. దీనికి సంబంధించిన యానిమేటెడ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతోంది. నిజంగా ఈ టెక్నాలజీ అమల్లోకి వస్తే విమానయానంలో అదొక విప్లవాత్మక మార్పుగా మారడం ఖాయం. కాకపోతే దీనికి భారీగానే ఖర్చవుతుంది. ఇలాంటి విమానాల్లో ప్రయాణాలు కూడా ఖరీదుగా మారొచ్చు. ఈ ప్రయోగం విజయవంతం అవ్వాలని ఆశిద్దాం.

This post was last modified on June 16, 2025 3:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కేంద్రంలో వైసీపీ వాయిస్ క‌ట్‌…?

కేంద్రంలోను.. ఢిల్లీ రాజకీయాల్లోనూ ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ కొంత మేర‌కు హ‌వా చెలాయిస్తున్న విష‌యం తెలిసిందే. అధికారంలో ఉన్న‌ప్పుడు ఇప్పుడు…

22 minutes ago

అదే చెక్క‌కుర్చీ… అదే టేబుల్‌… ఐదోసారి సీఎం!

దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా.. ఏ నాయ‌కుడు అయినా.. ఒక్క‌సారి ముఖ్య‌మంత్రి అయితే చాలు.. కూర్చునే కుర్చీ నుంచి తిరిగే…

2 hours ago

సింగల్ స్క్రీన్ VS మల్టీప్లెక్స్… ఏది రైటు?

ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి…

4 hours ago

దురంధర్ పోటీ సినిమాకు ఘోర అవమానం

గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…

5 hours ago

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

6 hours ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

7 hours ago