Trends

పైలట్ ఆఖరి మాట!.. నో పవర్, నో థ్రస్ట్, గోయింగ్ డౌన్!

అహ్మదాబాద్ లో ఘోర ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం.. ఎయిర్ పోర్టు దాటగానే కుప్పకూలిపోవడానికి గల కారణాలేమిటన్న దానిపై విచారణ జరుగుతోంది. ఇప్పటికే విమానం బ్లాక్ బాక్స్ ను స్వాధీనం చేసుకున్న దర్యాప్తు బృందాలు అందులో దాగి ఉన్న వివరాలను డీకోడ్ చేసే పనిలో ఉన్నాయి. ప్రస్తుతానికి విమానం కూలిపోవడానికి ముందు విమానం పైలట్ సుమిత్ సభర్వాల్ చెప్పిన మాటలు వెలుగులోకి వచ్చాయి. సుమిత్ మాటలు విమానం ప్రమాదాన్ని ఇక నిలువరించడానికి సాధ్యం కాదని తేల్చి చెప్పేశాయి.

బ్లాక్ బాక్స్ ను పరిశీలించిన దర్యాప్తు అధికారులు… అందులో చివరి 5 సెకన్లలో పైలట్ సుమిత్ సభర్వాల్… ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)తో కొన్ని మాటలు చెప్పారు. ‘మేడే, మేడే, మేడే’ అంటూ వరుసగా మూడు సార్లు చెప్పిన సుమిత్… ఆ తర్వాత వెనువెంటనే ‘నో పవర్, నో థ్రస్ట్, గోయింగ్ డౌన్’ అంటూ కీలక పదాలను వినియోగించారు. అంటే… ఇక విమానం తన స్వాధీనంలో లేదని, విమానం కూలిపోవడం ఖాయమని కూడా ఆయన చెప్పకనే చెప్పేశారు.

సాధారణంగా విమానాల్లో రెండు ఇంజిన్లు ఉంటాయి. ఒక ఇంజిన్ ఫెయిల్ అయినా…మరో ఇంజిన్ తో విమానం ఎంచక్కా గమ్యస్థానం చేరుకుంటుంది. అయితే అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఇంజిన్ ఫెయిల్ అన్న మాటే లేదు. పవర్ స్థంభించడంతోనే ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు. పవర్ లేకుండా రెండు ఇంజిన్లు ఉన్నా ప్రయోజనం లేదు కదా. పవర్ లేని కారణంగా విమానం ముందుకు కదిలే పరిస్థితి లేదని, ఈ కారణంగా విమానం నేలకు దిగుతోందని సుమిత్ చెప్పారు. సుమిత్ ఈ విషయాలు చెప్పిన తర్వాత ఏటీసీ స్పందించేలోగానే విమానం కుప్పకూలిపోయింది.

This post was last modified on June 14, 2025 7:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలుగువారి మ‌న‌సు దోచిన‌ దురంధ‌ర్

రెండు నెల‌ల కింద‌ట రిలీజైన దురంధ‌ర్ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవ‌లం…

4 hours ago

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

7 hours ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

8 hours ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

10 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

10 hours ago

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

11 hours ago