Trends

పైలట్ ఆఖరి మాట!.. నో పవర్, నో థ్రస్ట్, గోయింగ్ డౌన్!

అహ్మదాబాద్ లో ఘోర ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం.. ఎయిర్ పోర్టు దాటగానే కుప్పకూలిపోవడానికి గల కారణాలేమిటన్న దానిపై విచారణ జరుగుతోంది. ఇప్పటికే విమానం బ్లాక్ బాక్స్ ను స్వాధీనం చేసుకున్న దర్యాప్తు బృందాలు అందులో దాగి ఉన్న వివరాలను డీకోడ్ చేసే పనిలో ఉన్నాయి. ప్రస్తుతానికి విమానం కూలిపోవడానికి ముందు విమానం పైలట్ సుమిత్ సభర్వాల్ చెప్పిన మాటలు వెలుగులోకి వచ్చాయి. సుమిత్ మాటలు విమానం ప్రమాదాన్ని ఇక నిలువరించడానికి సాధ్యం కాదని తేల్చి చెప్పేశాయి.

బ్లాక్ బాక్స్ ను పరిశీలించిన దర్యాప్తు అధికారులు… అందులో చివరి 5 సెకన్లలో పైలట్ సుమిత్ సభర్వాల్… ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)తో కొన్ని మాటలు చెప్పారు. ‘మేడే, మేడే, మేడే’ అంటూ వరుసగా మూడు సార్లు చెప్పిన సుమిత్… ఆ తర్వాత వెనువెంటనే ‘నో పవర్, నో థ్రస్ట్, గోయింగ్ డౌన్’ అంటూ కీలక పదాలను వినియోగించారు. అంటే… ఇక విమానం తన స్వాధీనంలో లేదని, విమానం కూలిపోవడం ఖాయమని కూడా ఆయన చెప్పకనే చెప్పేశారు.

సాధారణంగా విమానాల్లో రెండు ఇంజిన్లు ఉంటాయి. ఒక ఇంజిన్ ఫెయిల్ అయినా…మరో ఇంజిన్ తో విమానం ఎంచక్కా గమ్యస్థానం చేరుకుంటుంది. అయితే అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఇంజిన్ ఫెయిల్ అన్న మాటే లేదు. పవర్ స్థంభించడంతోనే ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు. పవర్ లేకుండా రెండు ఇంజిన్లు ఉన్నా ప్రయోజనం లేదు కదా. పవర్ లేని కారణంగా విమానం ముందుకు కదిలే పరిస్థితి లేదని, ఈ కారణంగా విమానం నేలకు దిగుతోందని సుమిత్ చెప్పారు. సుమిత్ ఈ విషయాలు చెప్పిన తర్వాత ఏటీసీ స్పందించేలోగానే విమానం కుప్పకూలిపోయింది.

This post was last modified on June 14, 2025 7:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజ్యసభ స్థానాలు అప్పుడే రిజర్వ్ అయిపోయాయా?

రాష్ట్రంలో కీలకమైన నాలుగు రాజ్యసభ ఖాళీ అవుతున్నాయి. వీటిలో మూడు వైసీపీకి చెందిన నాయకులవి కాగా ఒకటి టిడిపికి చెందిన…

46 minutes ago

‘బౌండరీలు’ దాటుతున్న టికెట్ రేట్లు!

ఐపీఎల్‌-2026లో అత్యధిక క్రేజ్‌ దక్కించుకున్న మ్యాచ్‌లలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోరు ఒకటి. మే 22న ఉప్పల్‌లోని రాజీవ్…

2 hours ago

అచ్చియమ్మ… తొందర లేదమ్మా

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది ప్రమోషన్లలో జాన్వీ కపూర్ కనిపించకపోవడం గురించి సోషల్ మీడియాలో రకరకాల అర్థాలు తీస్తున్నారు.…

3 hours ago

ఈ దఫా ‘ఆన్ లైన్’ మహానాడు!

తెలుగు దేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు ఈ దఫా సరికొత్తగా జరగనుంది. ఏటా మే నెల 27,28 తేదీల్లో…

4 hours ago

కూటమిది స్పీడు కాదు… జెట్ స్పీడు

ఏపీలో టీడీపీ సారథ్యంలో కొనసాగుతున్న కూటమి సర్కారు దూకుడు ప్రదర్శిస్తోంది. రాష్ట్రాన్ని అభివృద్ది బాట పట్టించే విషయంలో ప్రత్యేకించి రాష్ట్రానికి…

5 hours ago

ఇంత నొప్పి ఎలా తట్టుకుంటున్నావ్ పవన్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవలే శస్త్ర చికిత్స తీసుకుని… అనంతరం స్వల్ప వ్యవధి విశ్రాంతి…

6 hours ago