అహ్మదాబాద్ లో ఘోర ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం.. ఎయిర్ పోర్టు దాటగానే కుప్పకూలిపోవడానికి గల కారణాలేమిటన్న దానిపై విచారణ జరుగుతోంది. ఇప్పటికే విమానం బ్లాక్ బాక్స్ ను స్వాధీనం చేసుకున్న దర్యాప్తు బృందాలు అందులో దాగి ఉన్న వివరాలను డీకోడ్ చేసే పనిలో ఉన్నాయి. ప్రస్తుతానికి విమానం కూలిపోవడానికి ముందు విమానం పైలట్ సుమిత్ సభర్వాల్ చెప్పిన మాటలు వెలుగులోకి వచ్చాయి. సుమిత్ మాటలు విమానం ప్రమాదాన్ని ఇక నిలువరించడానికి సాధ్యం కాదని తేల్చి చెప్పేశాయి.
బ్లాక్ బాక్స్ ను పరిశీలించిన దర్యాప్తు అధికారులు… అందులో చివరి 5 సెకన్లలో పైలట్ సుమిత్ సభర్వాల్… ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)తో కొన్ని మాటలు చెప్పారు. ‘మేడే, మేడే, మేడే’ అంటూ వరుసగా మూడు సార్లు చెప్పిన సుమిత్… ఆ తర్వాత వెనువెంటనే ‘నో పవర్, నో థ్రస్ట్, గోయింగ్ డౌన్’ అంటూ కీలక పదాలను వినియోగించారు. అంటే… ఇక విమానం తన స్వాధీనంలో లేదని, విమానం కూలిపోవడం ఖాయమని కూడా ఆయన చెప్పకనే చెప్పేశారు.
సాధారణంగా విమానాల్లో రెండు ఇంజిన్లు ఉంటాయి. ఒక ఇంజిన్ ఫెయిల్ అయినా…మరో ఇంజిన్ తో విమానం ఎంచక్కా గమ్యస్థానం చేరుకుంటుంది. అయితే అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఇంజిన్ ఫెయిల్ అన్న మాటే లేదు. పవర్ స్థంభించడంతోనే ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు. పవర్ లేకుండా రెండు ఇంజిన్లు ఉన్నా ప్రయోజనం లేదు కదా. పవర్ లేని కారణంగా విమానం ముందుకు కదిలే పరిస్థితి లేదని, ఈ కారణంగా విమానం నేలకు దిగుతోందని సుమిత్ చెప్పారు. సుమిత్ ఈ విషయాలు చెప్పిన తర్వాత ఏటీసీ స్పందించేలోగానే విమానం కుప్పకూలిపోయింది.
జనవరిలో 'అనగనగా ఒక రాజు' విడుదల టైంలో నిర్మాత నాగవంశీ ఇకపై తమ బ్యానర్ నుంచి నెలకో సినిమా ఉంటుందని…
టాలీవుడ్ హీరోయిన్లలో సమంత చాలా చాలా స్పెషల్ అని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. విజయశాంతిలా, అనుష్కలా యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలు చేయకపోయినా…
ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో కీలక నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొన్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై శ్రీలక్ష్మికి ఎట్టకేలకు పోస్టింగ్…
సరిగ్గా ఇంకో పదిహేను రోజుల్లో లెనిన్ విడుదల కానుంది. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ…
ఇండియాలో మోస్ట్ సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ల్లో ‘మీర్జాపూర్’ ఒకటి. యూపీ నేపథ్యంలో సాగే ఈ క్రైమ్ సిరీస్.. తొలి…
ఫలితాలతో సంబంధం లేకుండా అవకాశాలు అందుకునే కథానాయికలు చాలా కొద్ది మందే ఉంటారు. అందుకు వారి గ్లామర్, యాక్టింగ్ టాలెంట్తో…