Trends

రూ.కోటికి అదనంగా మరో రూ. 25 లక్షల పరిహారం

గుజరాత్ వాణిజ్య రాజధాని అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో చోటుచేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన వారికి ఇవ్వనున్న పరిహారం మరింగా పెరిగింది. ఇప్పటికే ఎయిర్ ఇండియా మాతృ సంస్థ టాటా సన్స్ తరఫున ఒక్కో మృతుడికి రూ.1 కోటి పరిహారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రమాదం జరిగిన రోజే టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖర్ ప్రకటన చేశారు. తాజాగా ఎయిర్ ఇండియా శనివారం మరో ప్రకటన చేసింది. మృతుల కుటుంబాలకు మరో రూ.25 లక్షల పరిహారాన్ని ఇవ్వనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.

ఎయిర్ ఇండియా ప్రకటించిన రూ.25 లక్షల పరిహారం… టాటా సన్స్ ప్రకటించిన రూ.1 కోటి పరిహారానికి అదనమని కూడా ఆ సంస్థ విస్పష్టంగా చెప్పింది. అంతేకాకుండా తాను ప్రకటించిన రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియాను అత్యవసరమైన సాయంగా పరిగణించి తక్షణమే బాధిత కుటుంబాలకు అందజేయనున్నట్లుగా ఎయిర్ ఇండియా ప్రకటించడం గమనార్హం. ఈ లెక్కన మృతుల కుటుంబాలకు ఎయిర్ ఇండియా, టాటా సన్స్… రెండు సంస్థల నుంచి ఏకంగా చనిపోయిన ఒక్కొక్కరికి రూ.1.25 లక్షల పరిహారం అందనుంది.

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రస్తుతానికి చనిపోయిన వారి సంఖ్య 270ని దాటేసింది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. విమానం కుప్పకూలిన బీజే మెడికల్ కాలేజీ మెడికోలు 50 మంది దాకా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమచారాం. అంతేకాకుండా ఒకరిద్దరు మెడికోల ఆచూకీ లభించడం లేదన్న వార్తలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరణాల సంఖ్య మరింతగా పెరిగే ప్రమాదం లేకపోలేదనే చెప్పక తప్పదు.

ఇక విమాన ప్రమాదం జరిగిన తర్వాత మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకే దాదాపుగా రెండు రోజుల సమయం పట్టింది. విమానంలో బారీ ఎత్తున ఎయిర్ ఫ్యూయల్ ఉండటంతో అదంతా మండిపోయేదాకా మంటలు అదుపులోకి రాలేదు. తాజాగా శుక్రవారం రాత్రికి మంటలు అదుపులోకి రాగా… శనివారం ఉదయం నుంచి విమాన శకలాల తొలగింపు ప్రారంభం అయ్యింది. ఈ శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా? అన్న దిశగానూ రెస్క్యూ బృందాలు పరిశీలన చేస్తున్నారు. శిథిలాల తొలగింపు ప్రక్రియ పూర్తి అయితే తప్పించి మృతుల సంఖ్యపై ఓ అంచనాకు రాలేమని చెప్పాలి.

This post was last modified on June 14, 2025 7:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘హైదరాబాద్ హౌస్’లో పుతిన్ బస.. ఈ ప్యాలెస్ ఎవరిదో తెలుసా?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…

3 hours ago

బోకేలు, శాలువాలు లేవు… పవన్ రియాక్షన్ ఏంటి?

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…

6 hours ago

నెగిటివిటీ వలయంలో దురంధర్ విలవిలా

బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…

6 hours ago

పరకామణి దొంగను వెనకేసుకొచ్చిన జగన్!

చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…

9 hours ago

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…

10 hours ago

ప్రీమియర్లు క్యాన్సిల్… ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు

ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…

10 hours ago