Trends

రూ.కోటికి అదనంగా మరో రూ. 25 లక్షల పరిహారం

గుజరాత్ వాణిజ్య రాజధాని అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో చోటుచేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన వారికి ఇవ్వనున్న పరిహారం మరింగా పెరిగింది. ఇప్పటికే ఎయిర్ ఇండియా మాతృ సంస్థ టాటా సన్స్ తరఫున ఒక్కో మృతుడికి రూ.1 కోటి పరిహారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రమాదం జరిగిన రోజే టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖర్ ప్రకటన చేశారు. తాజాగా ఎయిర్ ఇండియా శనివారం మరో ప్రకటన చేసింది. మృతుల కుటుంబాలకు మరో రూ.25 లక్షల పరిహారాన్ని ఇవ్వనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.

ఎయిర్ ఇండియా ప్రకటించిన రూ.25 లక్షల పరిహారం… టాటా సన్స్ ప్రకటించిన రూ.1 కోటి పరిహారానికి అదనమని కూడా ఆ సంస్థ విస్పష్టంగా చెప్పింది. అంతేకాకుండా తాను ప్రకటించిన రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియాను అత్యవసరమైన సాయంగా పరిగణించి తక్షణమే బాధిత కుటుంబాలకు అందజేయనున్నట్లుగా ఎయిర్ ఇండియా ప్రకటించడం గమనార్హం. ఈ లెక్కన మృతుల కుటుంబాలకు ఎయిర్ ఇండియా, టాటా సన్స్… రెండు సంస్థల నుంచి ఏకంగా చనిపోయిన ఒక్కొక్కరికి రూ.1.25 లక్షల పరిహారం అందనుంది.

అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రస్తుతానికి చనిపోయిన వారి సంఖ్య 270ని దాటేసింది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. విమానం కుప్పకూలిన బీజే మెడికల్ కాలేజీ మెడికోలు 50 మంది దాకా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమచారాం. అంతేకాకుండా ఒకరిద్దరు మెడికోల ఆచూకీ లభించడం లేదన్న వార్తలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరణాల సంఖ్య మరింతగా పెరిగే ప్రమాదం లేకపోలేదనే చెప్పక తప్పదు.

ఇక విమాన ప్రమాదం జరిగిన తర్వాత మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకే దాదాపుగా రెండు రోజుల సమయం పట్టింది. విమానంలో బారీ ఎత్తున ఎయిర్ ఫ్యూయల్ ఉండటంతో అదంతా మండిపోయేదాకా మంటలు అదుపులోకి రాలేదు. తాజాగా శుక్రవారం రాత్రికి మంటలు అదుపులోకి రాగా… శనివారం ఉదయం నుంచి విమాన శకలాల తొలగింపు ప్రారంభం అయ్యింది. ఈ శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా? అన్న దిశగానూ రెస్క్యూ బృందాలు పరిశీలన చేస్తున్నారు. శిథిలాల తొలగింపు ప్రక్రియ పూర్తి అయితే తప్పించి మృతుల సంఖ్యపై ఓ అంచనాకు రాలేమని చెప్పాలి.

This post was last modified on June 14, 2025 7:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

11 రూపాయల టికెట్లు రాంగా రైటా

ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…

2 hours ago

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

4 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

6 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

6 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

8 hours ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

8 hours ago