గుజరాత్ వాణిజ్య రాజధాని అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో చోటుచేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన వారికి ఇవ్వనున్న పరిహారం మరింగా పెరిగింది. ఇప్పటికే ఎయిర్ ఇండియా మాతృ సంస్థ టాటా సన్స్ తరఫున ఒక్కో మృతుడికి రూ.1 కోటి పరిహారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రమాదం జరిగిన రోజే టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖర్ ప్రకటన చేశారు. తాజాగా ఎయిర్ ఇండియా శనివారం మరో ప్రకటన చేసింది. మృతుల కుటుంబాలకు మరో రూ.25 లక్షల పరిహారాన్ని ఇవ్వనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.
ఎయిర్ ఇండియా ప్రకటించిన రూ.25 లక్షల పరిహారం… టాటా సన్స్ ప్రకటించిన రూ.1 కోటి పరిహారానికి అదనమని కూడా ఆ సంస్థ విస్పష్టంగా చెప్పింది. అంతేకాకుండా తాను ప్రకటించిన రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియాను అత్యవసరమైన సాయంగా పరిగణించి తక్షణమే బాధిత కుటుంబాలకు అందజేయనున్నట్లుగా ఎయిర్ ఇండియా ప్రకటించడం గమనార్హం. ఈ లెక్కన మృతుల కుటుంబాలకు ఎయిర్ ఇండియా, టాటా సన్స్… రెండు సంస్థల నుంచి ఏకంగా చనిపోయిన ఒక్కొక్కరికి రూ.1.25 లక్షల పరిహారం అందనుంది.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రస్తుతానికి చనిపోయిన వారి సంఖ్య 270ని దాటేసింది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. విమానం కుప్పకూలిన బీజే మెడికల్ కాలేజీ మెడికోలు 50 మంది దాకా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమచారాం. అంతేకాకుండా ఒకరిద్దరు మెడికోల ఆచూకీ లభించడం లేదన్న వార్తలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరణాల సంఖ్య మరింతగా పెరిగే ప్రమాదం లేకపోలేదనే చెప్పక తప్పదు.
ఇక విమాన ప్రమాదం జరిగిన తర్వాత మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకే దాదాపుగా రెండు రోజుల సమయం పట్టింది. విమానంలో బారీ ఎత్తున ఎయిర్ ఫ్యూయల్ ఉండటంతో అదంతా మండిపోయేదాకా మంటలు అదుపులోకి రాలేదు. తాజాగా శుక్రవారం రాత్రికి మంటలు అదుపులోకి రాగా… శనివారం ఉదయం నుంచి విమాన శకలాల తొలగింపు ప్రారంభం అయ్యింది. ఈ శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా? అన్న దిశగానూ రెస్క్యూ బృందాలు పరిశీలన చేస్తున్నారు. శిథిలాల తొలగింపు ప్రక్రియ పూర్తి అయితే తప్పించి మృతుల సంఖ్యపై ఓ అంచనాకు రాలేమని చెప్పాలి.
This post was last modified on June 14, 2025 7:05 pm
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…
``కాంగ్రెస్ పార్టీలో నేనైనా ఆమె అయినా ఒక్కటే. పార్టీ క్రమశిక్షణ విషయంలో అందరూ సమానమే. ఎవరు ఏం చేశారన్నది పార్టీ…
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…
‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…
వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…