Trends

జై షా ఉన్నా ఐసీసీ లెక్క చేయలేదా?

టెస్ట్ క్రికెట్‌కు గర్వకారణమైన డబ్ల్యూటీసీ ఫైనల్స్ నిర్వహణపై భారత్ కలలు మరోసారి నెరవేరకుండానే ఆగిపోయాయి. ఐసీసీ కొత్త ఛైర్మన్‌గా బీసీసీఐ కార్యదర్శి జై షా బాధ్యతలు చేపట్టినప్పటికీ, రాబోయే మూడు వరుస టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌కు భారత్‌కు ఆతిథ్య హక్కులు దక్కలేదు. బీసీసీఐ నూతన శక్తితో అధికారంలోకి వచ్చిన ఈ సమయంలోనూ, ప్రపంచ టెస్ట్ పోటీలకు లార్డ్స్ వేదికగా నిర్ణయించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

ఇప్పటికే 2021, 2023, 2025 డబ్ల్యూటీసీ ఫైనల్స్‌ ఇంగ్లండ్‌లో జరిగాయి. తాజా సమాచారం ప్రకారం, 2027 వరకూ ఈ సంప్రదాయం అలానే కొనసాగనుంది. ఐసీసీ సింగపూర్‌లో జరగనున్న వార్షిక సమావేశంలో లార్డ్స్‌తోపాటు ఇతర ఇంగ్లండ్ వేదికలకు అధికారికంగా ఆతిథ్య హక్కులు అప్పగించనున్నారు. ఇది భారత్‌కు పెద్ద దెబ్బే.

జై షా ఐసీసీ ఛైర్మన్ కావడంతో, క్రికెట్ ప్రియులు టెస్ట్ ఫైనల్స్‌కు భారత గడ్డపై వేదికలపై ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ తాజా నిర్ణయం ఆ కలలను కుదిపేసింది. భారత్‌ వేదికలు, మౌలిక సదుపాయాల పరంగా ప్రపంచంలోనే అత్యుత్తమమైనవిగా పేరు తెచ్చుకున్నా, వాతావరణం, ప్రయాణ సౌలభ్యం పేరుతో భారత్‌కు అవమానంగా వేదికలు దక్కకుండా చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇంగ్లండ్‌లో వర్షం తక్కువగా ఉండే జూన్ సీజన్, లార్డ్స్ మైదానానికి ఉన్న చారిత్రక నేపథ్యం, గ్లోబల్ కనెక్టివిటీ వంటివి ఈ నిర్ణయానికి కారణాలుగా చెబుతున్నారు. అయితే ఇందులో రాజకీయ కారణాలు లేకపోవచ్చని చెప్పలేరు. ఐసీసీ పగ్గాలు జై షా చేతుల్లో ఉన్నా, భారత్‌ను ప్రధాన వేదికగా నిలబెట్టేందుకు ఆయన చొరవ చూపలేదన్న వాదన బయటకు వస్తోంది.

క్రికెట్‌లో భారత్ ప్రాభవం పెరుగుతున్న తరుణంలో కూడా ఈవెంట్‌లకు ఆతిథ్య దక్కకపోవడంపై బీసీసీఐ ఆవేదన వ్యక్తం చేస్తోంది. టెస్ట్ ఫార్మాట్‌కు భారతదేశం ఇచ్చే ప్రాధాన్యం, ఆర్థిక స్థిరత, అభిమానుల ఆదరణ చూస్తే.. కనీసం ఒక ఫైనల్ అయినా భారత్‌లో జరగాల్సింది. కానీ తాజా పరిణామాలు చూస్తే, ఆ గౌరవం కోసం భారత్ ఇంకా కాసేపు ఎదురు చూడాల్సిందేనని అనిపిస్తోంది.

This post was last modified on June 14, 2025 2:36 pm

Share

Recent Posts

మైత్రీ సినిమాలన్నీ గతంలోకే వెళ్తున్నాయే!

మైత్రీ మూవీ మేకర్స్ చేతిలో ఉన్న లైనప్ చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కనిపిస్తోంది. ప్రెజెంట్ నడుస్తున్న కథల కంటే…

7 minutes ago

రేషన్ కార్డుపై మోదీ బొమ్మ వేయాల్సిందే!

ఈ రోజుల్లో పబ్లిసిటీకి కాదేదీ అనర్హం…రాజకీయ నేతలు మొదలు సినీ తారల వరకు అందరూ పబ్లిసిటీనే నమ్ముకున్నారంటే అతిశయోక్తి కాదు.…

25 minutes ago

జగన్ కు అవమానం… జైలు సిబ్బంది క్లారిటీ

ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ని పరామర్శించేందుకు కర్నూలు జిల్లా పంచలింగాల జైలు వద్దకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్…

56 minutes ago

వెంకటేష్ ప్రయాణానికి అప్పుడే 40 ఏళ్ళు

సరిగ్గా నాలుగు దశాబ్దాల క్రితం ఇదే రోజు 1986 సంవత్సరం ఆగస్ట్ 14 కలియుగ పాండవులు రిలీజయ్యింది. మాములుగా స్టార్…

1 hour ago

సాక్ష్యాల తారుమారు కేసులో సీదిరి అప్పల రాజుకు బెయిల్

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తనయుడు ఆరవ్ శర్మ చేసిన బైక్ యాక్సిడెంట్ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం…

2 hours ago

ఆవారాపన్ 2… అంతగా ఏముందబ్బా

కొత్తగా రిలీజైన సినిమాల్లో అడ్వాన్స్ బుకింగ్ పరంగా దూసుకుపోతున్న సినిమాగా ఆవారాపన్ 2 అన్ని రాష్టాల ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.…

2 hours ago