Trends

కోహ్లీ రెస్టారెంట్‌పై కేసు: ఏం జరిగిందంటే?

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరు మీద బెంగళూరులోని వన్8 కమ్యూన్ రెస్టారెంట్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. స్పోర్ట్స్ మేనియా మాత్రమే కాదు, కోహ్లీ బిజినెస్ ఆంగిల్ కూడా హాట్ టాపిక్ అవుతోంది. కానీ, ఈసారి మాత్రం పోజిటివ్ విషయంతో కాదు. ఆయన రెస్టారెంట్‌పై స్థానిక పోలీసులు సీటీబీ చట్ట ఉల్లంఘనకు సంబంధించి కేసు నమోదు చేశారు. 

ఊహించని పరిణామంతో మీడియాలో హైలైట్ అయిపోయింది. వివరాల్లోకి వెళితే, బెంగళూరులోని కస్తూర్బా రోడ్‌లో ఉన్న వన్8 కమ్యూన్ పబ్‌లో ఇటీవల పోలీసులు అకస్మత్ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో, అక్కడ స్మోకింగ్ కోసం ప్రత్యేకంగా కేటాయించిన ఏరియా లేదని గుర్తించారు. ఇది కోట్పా (COTPA) చట్టాన్ని ఉల్లంఘించినట్లే కావడంతో, మేనేజ్‌మెంట్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నారు. 

కబ్బన్ పార్క్ స్టేషన్ పరిధిలోని ఈ పబ్‌పై సెక్షన్ 4, 21 కింద కేసులు నమోదయ్యాయి. పబ్ మేనేజర్‌తో పాటు అక్కడ పని చేస్తున్న కొంతమంది సిబ్బందిపై కూడా అధికారులు కేసులు పెట్టారు. పోలీస్ ఎస్సై మీడియాతో మాట్లాడుతూ, “ప్రతి కమర్షియల్ స్థలంలో స్మోకింగ్ జోన్ తప్పనిసరి. ఇది ప్రజా ఆరోగ్యాన్ని కాపాడే చట్టం. సదరు పబ్ నిబంధనలను పాటించకపోవడంతోనే కేసు నమోదు చేశాం” అని స్పష్టం చేశారు. చట్ట ప్రకారం ఈ నిర్లక్ష్యం జరిమానా లేదా మరింత కఠిన చర్యలకు దారితీయొచ్చు. అయితే ఘటనపై ఇప్పటివరకు కోహ్లీ ఎక్కడ స్పందించలేదు. ఇక RCB ఐపీఎల్ ఫైనల్ లో పంజాబ్ తో తలపడనున్న విషయం తెలిసిందే.

This post was last modified on June 2, 2025 2:42 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Virat Kohli

Recent Posts

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

1 hour ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

3 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

4 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

4 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

4 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

5 hours ago