బెంగళూరులో ఓ మహిళ ఆటో డ్రైవర్ను చెప్పుతో కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ ఘటన శనివారం జరిగింది. పంఖూరి మిశ్రా అనే మహిళ తన భర్తతో కలిసి బైక్పై ప్రయాణిస్తుండగా, ఆటో డ్రైవర్ తన పాదంపై చక్రం నడిపాడని ఆరోపించారు. అనంతరం ఆమె ఆటో డ్రైవర్ను హిందీలో దూషించి, ఫోన్లో వీడియో తీస్తున్నాడని కోపంతో చెప్పుతో కొట్టారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆటో డ్రైవర్ లోకేశ్ స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పెద్ద ఎత్తున వైరల్ అయింది. కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు స్పందించి, డ్రైవర్ ఫిర్యాదు మేరకు మిశ్రాను ఆదివారం అరెస్టు చేశారు. అనంతరం ఆమెను స్టేషన్ బెయిల్పై విడుదల చేశారు.
తాజాగా సోమవారం పంఖూరి మిశ్రా తన భర్తతో కలిసి లోకేశ్ను కలసి క్షమాపణ చెప్పింది. “క్షమించండి. నేను ప్రెగ్నెంట్.. గర్భస్రావం అవుతుందేమోననే భయం కారణంగానే అలా ప్రవర్తించాను” అని మిశ్రా అన్నారు. ఆమె, భర్త ఇద్దరూ లోకేశ్ దంపతుల కాళ్ల మీద పడుతూ క్షమాపణ కోరారు. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆటో డ్రైవర్ లోకేశ్ మాట్లాడుతూ, “తనకు హిందీ భాష అర్థం కాకపోవడం వల్లే వీడియో తీసాను. మిశ్రా భర్త ద్విచక్ర వాహనంపై కూర్చొని ఉండగా ఆమె దాడి చేశారు. నా తప్పు ఏమీ లేదు. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే స్పష్టమవుతుంది” అని తెలిపారు. ఈ సంఘటనపై పోలీసులు ఇంకా దర్యాప్తు జరుపుతున్నారు.
This post was last modified on June 2, 2025 2:29 pm
బ్లాక్ ఫ్రైడే, గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్ సహా పలు గొప్ప చిత్రాలతో బాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో కేవలం చర్చలు, ప్రశ్నలకే పరిమితం కాకుండా మంత్రులు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడలు పోటీలు…
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…