భారత్-పాకిస్థాన్ సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకోవడం వల్ల, ప్లేఆఫ్స్కు సమీపంలోనే కొందరు ఆటగాళ్లు తమ జాతీయ జట్లకు ప్రాతినిధ్యం వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రభావం RCBతో పాటు మరికొన్ని జట్లపై కూడా పడింది. ఈ సీజన్ కోసం కొత్త రూల్ తీసుకు వచ్చారు. ఆటగాళ్లు అందుబాటులో లేకపోతే కొత్తగా ఎవరినైనా తెచ్చుకోవచ్చని ప్రకటన చేసింది.
ఇక ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ దశకు చేరుతున్న కీలక సమయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టులో ఒక కీలక మార్పు చోటుచేసుకుంది. ఇంగ్లండ్ ఆటగాడు జాకబ్ బెతెల్ తన జాతీయ జట్టు బాధ్యతల కారణంగా లీగ్ దశ తర్వాత జట్టుకు దూరం కానున్నాడు. ఈ నేపధ్యంలో ఆర్సీబీ మేనేజ్మెంట్ అతని స్థానంలో న్యూజిలాండ్కు చెందిన వికెట్ కీపర్-బ్యాటర్ టిమ్ సీఫెర్ట్ను ఎంపిక చేసింది.
సీఫెర్ట్ కోసం ఫ్రాంచైజీ రూ.2 కోట్లు ఖర్చు చేసింది. ప్రస్తుతం అంతర్జాతీయ టీ20ల్లో మంచి ఫార్మ్లో ఉన్న సీఫెర్ట్, ఇటీవల పాకిస్థాన్తో జరిగిన సిరీస్లో గట్టిగానే ఆడాడు. ఇప్పుడు RCB తరఫున మే 27న లక్నో సూపర్ జెయింట్స్తో జరగనున్న లీగ్ మ్యాచ్లో తొలి అవకాశం దక్కే అవకాశముంది. బెంగళూరు జట్టుకు ఇది కొత్త ఊపునిస్తుందనే ఆశాభావం అభిమానుల్లో కనిపిస్తోంది.
ఇటీవల వరుస విజయాలతో ఆర్సీబీ ప్లేఆఫ్స్కు బెర్త్ దక్కించుకుంది. ఇలాంటి సమయంలో టిమ్ సీఫెర్ట్ లాంటి ఆటగాడు చేరడం జట్టుకు మరింత బలాన్నిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక జట్టులో ఎవరెవరు తుది జట్టులో చోటు దక్కించుకుంటారన్న ఉత్కంఠ మరోసారి పెరిగింది. మొత్తానికి, ఈ మార్పు RCB గేమ్ప్లాన్కు కొత్త శక్తి తీసుకురావడమైపోయింది.
This post was last modified on May 22, 2025 6:36 pm
ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ కు ఒక అలవాటు ఉంది.. అదే 'స్లో స్టార్ట్ అండ్ డెడ్లీ ఫినిష్'. ఈ…
నాని ప్యారడైజ్ మీద అంచనాల గురించి ప్రత్యేకంగా మళ్ళీ చెప్పనక్కర్లేదు. ఆగస్ట్ 21 విడుదల కోసం అభిమానులే కాదు మూవీ…
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ తో 40 ఏళ్ల బంధాన్ని వీడి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరిన సీనియర్…
ఒక డిజాస్టర్ పడితే చాలు దర్శకుడి ట్రాక్ రికార్డు గతంలో ఎంత ఉందనేది నిర్మాతలు పట్టించుకోరు. అందులోనూ వెటరన్ డైరెక్టర్స్…
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఏపీ సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్ గా…
మలయాళంలో ఎక్కడ చూసినా వినిపిస్తున్న పేరు వాలా 2. అతి తక్కువ బడ్జెట్ లో రూపొంది రెండు వందల కోట్ల…