ఐపీఎల్ 2025లో పది రోజుల విరామం తర్వాత మళ్లీ వేదిక వేడెక్కబోతుంది. శనివారం రాత్రి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం మరోమారు కోహ్లీ నినాదాలతో మార్మోగనుంది. కారణం– ఆర్సీబీ vs కేకేఆర్ మ్యాచ్ కంటే ముందుగా, ఈసారి అందరి దృష్టి విరాట్ కోహ్లీపై ఎక్కువగా ఉంది. ఇటీవలే టెస్ట్ క్రికెట్కు గుడ్బై చెప్పిన కోహ్లీ, మళ్లీ తన అభిమానుల ముందు బరిలోకి దిగుతున్నాడు. ఇది ఆర్సీబీకి ఓ సుదీర్ఘ విరామం తర్వాత కీలకమైన పోరు కావడమే కాదు, కోహ్లీ భావోద్వేగాలకు తెరలేపే రాత్రిగా కూడా మిగలనుంది.
ఈ సీజన్లో ఆర్సీబీ ఇప్పటికే 11 మ్యాచ్లు ఆడి 8 విజయాలతో 16 పాయింట్లు సాధించింది. ఒక గెలుపు ప్లే ఆఫ్స్ టికెట్ను లాక్ చేయబోతున్న తరుణంలో కోహ్లీ వంటి సీనియర్ ఆటగాడి ఆట అత్యవసరం. విరామానికి ముందు జట్టు జోష్లో ఉండటం, ప్లేయర్ల ఫామ్ పునరుద్ధరమవుతుందా అన్న ప్రశ్నలతో మ్యాచ్కు ముందు ఉత్కంఠ పెరిగింది. మరోవైపు కేకేఆర్ మాత్రం మిడిల్ టేబుల్లో నిలవడంతో ఈ మ్యాచ్ వారికి కూడా డూ ఆర్ డై గా మారనుంది.
కోహ్లీ తాజా నిర్ణయం స్టేడియంలో అభిమాని స్పందనను పెంచగా, మ్యాచ్కి ముందు తెల్ల జెర్సీల్లో అభిమానులు తరలివచ్చే అవకాశముంది. అయితే, కోహ్లీ ఎప్పటిలాగే తన ఎమోషన్స్ను వదిలేసి బ్యాట్తో సమాధానం చెప్పే తరహాలో ఉండబోతున్నాడు. 36 ఏళ్ల వయసులోనూ తన మానసిక దృఢతతో జట్టుకు ముందుండే లీడర్గా నిలవాలని చూస్తున్న కోహ్లీ ఈ మ్యాచ్ను ‘వ్యక్తిగతంగా కాదు.. వ్యూహాత్మకంగా’ తీసుకుంటాడని విశ్లేషకుల అభిప్రాయం.
This post was last modified on May 16, 2025 8:15 pm
ప్రస్తుతం మంచి ఊపులో షూటింగ్ జరుపుకుంటున్న బాలకృష్ణ - గోపీచంద్ మలినేని మూవీలో ముందు తీసుకున్న హీరోయిన్ నయనతార. ఇది…
స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన, పరీక్షలు రాయాల్సిన వయసులో ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఎలా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం. సినీ…
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
నిందితులను పోలీసులు పబ్లిక్లో కొట్టడం వంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. అటువంటి సందర్భాల్లో అలా కొట్టడం మానవ హక్కుల ఉల్లంఘన…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…