ఐపీఎల్ 2025లో పది రోజుల విరామం తర్వాత మళ్లీ వేదిక వేడెక్కబోతుంది. శనివారం రాత్రి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం మరోమారు కోహ్లీ నినాదాలతో మార్మోగనుంది. కారణం– ఆర్సీబీ vs కేకేఆర్ మ్యాచ్ కంటే ముందుగా, ఈసారి అందరి దృష్టి విరాట్ కోహ్లీపై ఎక్కువగా ఉంది. ఇటీవలే టెస్ట్ క్రికెట్కు గుడ్బై చెప్పిన కోహ్లీ, మళ్లీ తన అభిమానుల ముందు బరిలోకి దిగుతున్నాడు. ఇది ఆర్సీబీకి ఓ సుదీర్ఘ విరామం తర్వాత కీలకమైన పోరు కావడమే కాదు, కోహ్లీ భావోద్వేగాలకు తెరలేపే రాత్రిగా కూడా మిగలనుంది.
ఈ సీజన్లో ఆర్సీబీ ఇప్పటికే 11 మ్యాచ్లు ఆడి 8 విజయాలతో 16 పాయింట్లు సాధించింది. ఒక గెలుపు ప్లే ఆఫ్స్ టికెట్ను లాక్ చేయబోతున్న తరుణంలో కోహ్లీ వంటి సీనియర్ ఆటగాడి ఆట అత్యవసరం. విరామానికి ముందు జట్టు జోష్లో ఉండటం, ప్లేయర్ల ఫామ్ పునరుద్ధరమవుతుందా అన్న ప్రశ్నలతో మ్యాచ్కు ముందు ఉత్కంఠ పెరిగింది. మరోవైపు కేకేఆర్ మాత్రం మిడిల్ టేబుల్లో నిలవడంతో ఈ మ్యాచ్ వారికి కూడా డూ ఆర్ డై గా మారనుంది.
కోహ్లీ తాజా నిర్ణయం స్టేడియంలో అభిమాని స్పందనను పెంచగా, మ్యాచ్కి ముందు తెల్ల జెర్సీల్లో అభిమానులు తరలివచ్చే అవకాశముంది. అయితే, కోహ్లీ ఎప్పటిలాగే తన ఎమోషన్స్ను వదిలేసి బ్యాట్తో సమాధానం చెప్పే తరహాలో ఉండబోతున్నాడు. 36 ఏళ్ల వయసులోనూ తన మానసిక దృఢతతో జట్టుకు ముందుండే లీడర్గా నిలవాలని చూస్తున్న కోహ్లీ ఈ మ్యాచ్ను ‘వ్యక్తిగతంగా కాదు.. వ్యూహాత్మకంగా’ తీసుకుంటాడని విశ్లేషకుల అభిప్రాయం.
This post was last modified on May 16, 2025 8:15 pm
నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమమ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన నటుడు. ఆ…
అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…
హీరో హీరోయిన్లకు.. పెద్ద టెక్నీషియన్లకు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోషకాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాళ్లకు…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…
మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…