భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న వేళ, బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ సీజన్ ఐపీఎల్ను నిరవధికంగా వాయిదా వేసినట్టు బీసీసీఐ అధికారి తెలిపారు. ఆటగాళ్లు, సిబ్బంది, ప్రేక్షకుల భద్రతే ప్రథమం అన్న తత్వంతో ఈ నిర్ణయం తీసుకున్నామని బీసీసీఐ అధ్యక్షుడు వెల్లడించారు. ఇప్పటి వరకు అభిమానులు ఎదురుచూస్తున్న అన్ని మ్యాచ్లు నిలిచిపోవడం ఒక్కసారిగా క్రికెట్ లోకాన్ని షాక్కు గురిచేసింది.
గత కొన్ని రోజులుగా సరిహద్దు ప్రాంతాల్లో పెరుగుతున్న వాతావరణం క్రీడా రంగంపై తీవ్ర ప్రభావం చూపించడంలో ఇది తుది దశ. ధర్మశాలలో జరిగిన చివరి మ్యాచ్ మధ్యలోనే నిలిపివేయడం, అప్పటి నుంచి కొనసాగుతున్న భద్రతా చర్చలు చివరికి ఈ నిర్ణయానికి దారి తీసేశాయి. ఈ సందర్భంగా విదేశీ ఆటగాళ్లు, వారి బోర్డులు వ్యక్తం చేసిన భద్రతా ఆందోళనలు కూడా బీసీసీఐ నిర్ణయాన్ని ప్రభావితం చేశాయి.
ఆర్థికంగా ఐపీఎల్కు తీరని దెబ్బే అయినా, దేశ భద్రతపై రాజీ చేసేందుకు బీసీసీఐ సిద్ధంగా లేదని స్పష్టమవుతోంది. ప్రభుత్వం, భద్రతా విభాగాల నుంచి వచ్చిన సూచనలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. ఐపీఎల్ను తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తామన్నది పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది.
క్రికెట్ అభిమానులు ఈ నిర్ణయంతో నిరాశ చెందడం సహజం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సరైన నిర్ణయమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆటగాళ్ల ప్రాణాలకంటే, అభిమానుల భద్రతకంటే ఏ టోర్నీ పెద్దది కాదని వారంతా ఒకే మాట చెబుతున్నారు. ప్రస్తుతం ఆటగాళ్లకు, ఫ్రాంచైజీలకు, స్పాన్సర్లకు, అభిమానులకు బీసీసీఐ క్రమంగా సమాచారాన్ని అందిస్తోంది. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తామని బోర్డు పేర్కొంది.
తెలంగాణ… 4 కోట్ల మంది తెలంగాణ భూమిపుత్రుల జాగీరేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.…
గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక అభిమానులను బాధ పెడుతున్న మాస్ మహారాజ రవితేజ ఎట్టకేలకు రూటు మార్చేశారు. రొటీన్…
ఇవాళ సాయంత్రం ప్రీమియర్లతో విడుదల కాబోతున్న పెద్దికి సంబంధించి అందరు దృష్టి సారిస్తున్న ప్రధానాంశాల్లో ఏఅర్ రెహమాన్ సంగీతం ఒకటి.…
మెగా కౌంట్ డౌన్ లో సంవత్సరాలు నెలలుగా మారిపోయి, రోజులకు దిగిపోయి, ఇప్పుడు గంటల్లోకి వచ్చేసింది. మెగాభిమానులు, సినీ ప్రియులు…
తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాాలే ఇందుకు కారణమని చెప్పాలి. ఈ…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం నాడు హైదరాబాద్ వేదికగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వాదులను…