“న్యాయస్థానాలకు రాజ్యాంగపరమైన రక్షణ కల్పించడంతో ఎవరూ ఆయా కోర్టుల తీర్పులపై కామెంట్లు చేసే సాహసం చేయలేక పోతున్నారు. లేకపోతే.. “ అంటూ.. ఇటీవల ప్రముఖ విశ్లేషకుడు ఒకరు జాతీయ మీడియాలో వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఇదే వ్యాఖ్య మరోసారి రిపీట్ అవుతోంది. దీనికి కారణం.. తన భార్యను ఓ వ్యక్తి దారుణంగా `వాడేసుకున్నాడని`.. అసహజ లైంగిక చర్యలతోపాటు.. ఆమెపై అనేక రూపాల్లో శృంగారానికి పాల్పడ్డాడని పేర్కొంటూ.. ఓ భర్త కోర్టును ఆశ్రయించాడు.
సదరు నిందితుడిని అరెస్టు చేయాలని.. కోర్టును అభ్యర్థించాడు. కానీ.. ఘనత వహించిన ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. “ఇది మహా భారత కాలం కాదు.. నీ భార్య నీ ఆస్తే కాదు. భార్యను ఆస్తిగా పరిగణించే భావజాలానికి ఎప్పుడో కాలం చెల్లింది“ అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అంతేకాదు.. వివాహేతర సంబంధాన్ని నేరంగానో.. కుట్రగానో చూడాల్సిన అవసరం లేదని.. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకించింది.
అంతేకాదు.. వివాహేతర సంబంధం కేవలం ఇద్దరు వ్యక్తుల నైతికతకు సంబంధించిన విషయమని.. దానిని నేరంగా చూడాల్సిన అవసరం లేదని కోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో సదరు నిందితుడిని అరెస్టు చేయమని కానీ.. కేసు నమోదు చేయాలని కానీ.. కోర్టు ఆదేశించజాలదని పేర్కొన్నారు. అనంతరం.. నిందితుడు దాఖలు చేసిన పిటిషన్పై ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. ఈ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి జస్టిస్ నీనా అనే మహిళకావడం గమనార్హం.
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…