“న్యాయస్థానాలకు రాజ్యాంగపరమైన రక్షణ కల్పించడంతో ఎవరూ ఆయా కోర్టుల తీర్పులపై కామెంట్లు చేసే సాహసం చేయలేక పోతున్నారు. లేకపోతే.. “ అంటూ.. ఇటీవల ప్రముఖ విశ్లేషకుడు ఒకరు జాతీయ మీడియాలో వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఇదే వ్యాఖ్య మరోసారి రిపీట్ అవుతోంది. దీనికి కారణం.. తన భార్యను ఓ వ్యక్తి దారుణంగా `వాడేసుకున్నాడని`.. అసహజ లైంగిక చర్యలతోపాటు.. ఆమెపై అనేక రూపాల్లో శృంగారానికి పాల్పడ్డాడని పేర్కొంటూ.. ఓ భర్త కోర్టును ఆశ్రయించాడు.
సదరు నిందితుడిని అరెస్టు చేయాలని.. కోర్టును అభ్యర్థించాడు. కానీ.. ఘనత వహించిన ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. “ఇది మహా భారత కాలం కాదు.. నీ భార్య నీ ఆస్తే కాదు. భార్యను ఆస్తిగా పరిగణించే భావజాలానికి ఎప్పుడో కాలం చెల్లింది“ అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అంతేకాదు.. వివాహేతర సంబంధాన్ని నేరంగానో.. కుట్రగానో చూడాల్సిన అవసరం లేదని.. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకించింది.
అంతేకాదు.. వివాహేతర సంబంధం కేవలం ఇద్దరు వ్యక్తుల నైతికతకు సంబంధించిన విషయమని.. దానిని నేరంగా చూడాల్సిన అవసరం లేదని కోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో సదరు నిందితుడిని అరెస్టు చేయమని కానీ.. కేసు నమోదు చేయాలని కానీ.. కోర్టు ఆదేశించజాలదని పేర్కొన్నారు. అనంతరం.. నిందితుడు దాఖలు చేసిన పిటిషన్పై ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. ఈ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి జస్టిస్ నీనా అనే మహిళకావడం గమనార్హం.
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…
మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్ను అనుకోకుండా రివీల్…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి…
"ఏనుగు పోతుంటే చూడరు.. చీమ కుడితే గగ్గోలు పెడతారు" అనే సామెత రాజకీయాలకు కూడా సరిగ్గా సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.…
ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…
కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…