“న్యాయస్థానాలకు రాజ్యాంగపరమైన రక్షణ కల్పించడంతో ఎవరూ ఆయా కోర్టుల తీర్పులపై కామెంట్లు చేసే సాహసం చేయలేక పోతున్నారు. లేకపోతే.. “ అంటూ.. ఇటీవల ప్రముఖ విశ్లేషకుడు ఒకరు జాతీయ మీడియాలో వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఇదే వ్యాఖ్య మరోసారి రిపీట్ అవుతోంది. దీనికి కారణం.. తన భార్యను ఓ వ్యక్తి దారుణంగా `వాడేసుకున్నాడని`.. అసహజ లైంగిక చర్యలతోపాటు.. ఆమెపై అనేక రూపాల్లో శృంగారానికి పాల్పడ్డాడని పేర్కొంటూ.. ఓ భర్త కోర్టును ఆశ్రయించాడు.
సదరు నిందితుడిని అరెస్టు చేయాలని.. కోర్టును అభ్యర్థించాడు. కానీ.. ఘనత వహించిన ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. “ఇది మహా భారత కాలం కాదు.. నీ భార్య నీ ఆస్తే కాదు. భార్యను ఆస్తిగా పరిగణించే భావజాలానికి ఎప్పుడో కాలం చెల్లింది“ అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అంతేకాదు.. వివాహేతర సంబంధాన్ని నేరంగానో.. కుట్రగానో చూడాల్సిన అవసరం లేదని.. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకించింది.
అంతేకాదు.. వివాహేతర సంబంధం కేవలం ఇద్దరు వ్యక్తుల నైతికతకు సంబంధించిన విషయమని.. దానిని నేరంగా చూడాల్సిన అవసరం లేదని కోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో సదరు నిందితుడిని అరెస్టు చేయమని కానీ.. కేసు నమోదు చేయాలని కానీ.. కోర్టు ఆదేశించజాలదని పేర్కొన్నారు. అనంతరం.. నిందితుడు దాఖలు చేసిన పిటిషన్పై ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. ఈ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి జస్టిస్ నీనా అనే మహిళకావడం గమనార్హం.
This post was last modified on April 19, 2025 4:34 pm
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…