ఏపీ పోలీసులు విధి నిర్వహణలో సత్తా చాటుతున్నారు. అందివచ్చిన సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకుంటూ దేశంలోనే ఉత్తమ పనితీరు కనబరుస్తున్న ఏపీ పోలీసులు తాజాగా ప్రాణాలు తీసుకునేందుకు సిద్ధమైన ఓ వైద్య విద్యార్థి ప్రాణాలను కాపాడారు. ఇందుకోసం ఏపీ పోలీసులకు కేవలం 20 నిమిషాలు సరిపోయాయి. ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ ఘటన తిరుపతిలోని రామచంద్రాపురం పరిధి రాయలచెరువు సమీపంలోని అటవీ ప్రాంతంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.
ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. నంద్యాల జిల్లాకు చెందిన ఓ విద్యార్థి తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. గత కొంతకాలంగా వ్యక్తిగత కారణాలతో మానసికంగా కుంగిపోయిన సదరు విద్యార్థి ఆత్మహత్యకు దాదాపుగా సిద్ధమైపోయాడు. శుక్రవారం రాత్రి హాస్టల్ నుంచి బయటకు వచ్చేసిన సదరు విద్యార్థి… నేరుగా రాయలచెరువు సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడి నుంచే అతడు తన స్నేహితులకు ఫోన్ చేసి తాను చనిపోతున్నానని తెలిపాడు.
దీంతో వెనువెంటనే స్పందించిన అతడి మిత్రులు విషయాన్ని అతడి తల్లిదండ్రులతో పాటుగా అలిపిరి పోలీస్ స్టేషన్ కు తెలియజేశారు. ఈ ఫిర్యాదుపై అలిపిరి పోలీసుల నుంచి సమాచారం అందుకున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి బొడ్డు హేమంత్ వెనువెంటనే రంగంలోకి దిగిపోయారు. అధునాతన టెక్నాలజీని వినియోగించి బాదితుడు రాయలచెరువు సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అక్కడికి చేరుకుని అతడి ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్నారు. అనంతరం అతడికి కౌన్సిలింగ్ ఇచ్చి అక్కడి నుంచి తరలించారు.
మొన్నామధ్య కాకినాడ జిల్లాలోనూ ఇదే తరహాలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు సిద్ధం కాగా…ఆ జిల్లా పోలీసులు పొరుగు జిల్లాల పోలీసుల సహకారం తీసుకుని… కేవలం ఆరంటే ఆరు నిమిషాల్లో అతడిని కాపాడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మరో నిమిషం ఆలస్యమైనా కూడా బాధితుడు లాడ్జీలోని ఫ్యానుకు విగత జీవిగా వేలాడేవాడే. అయితే పోలీసుల సమయస్ఫూర్తి, సాంకేతికత వినియోగంతో ఆ వ్యక్తిని కాపాడారు. వెరసి పనితీరులో ఏపీ పోలీసులు సత్తా చాటుతున్నారనే చెప్పాలి.
This post was last modified on April 19, 2025 12:47 pm
కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన ఫలితాలు అందుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ సంపాదిస్తాయి. టీవీల్లో, ఆన్ లైన్లో గొప్ప ఆదరణ…
దేశవ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాలను పునర్విభించి .. మహిళలకు రిజర్వేషన్ కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వం ఆశలు ప్రస్తుత సమావేశాల్లో నెరవేరేలా కనిపించడం…
తెలంగాణాలో ఎమ్మెల్యేలు, మంత్రులకు తమ కుమారుల ప్రేమ వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి…
ఇంకా రాకా షూటింగ్ పూర్తి కాలేదు. మూడు నెలలకు పైనే వర్కింగ్ డేస్ అవసరమవుతాయని అంటున్నారు. అందుకే విడుదల తేదీ…
రాష్ట్రంలో వైద్యం ఖరీదైన వస్తువుగా మారిపోయింది. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ పరీక్షలు, ఇతరత్రా ఖర్చుల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి…
కన్నడ సినిమాలో అతి పెద్ద స్టార్లలో ఒకడైన దర్శన్.. ఏ బాధలూ లేని జీవితాన్ని, బంగారం లాంటి జీవితాన్ని ఎలా…