Trends

20 నిమిషాల్లో మెడికో ప్రాణం కాపాడిన ఏపీ పోలీస్

ఏపీ పోలీసులు విధి నిర్వహణలో సత్తా చాటుతున్నారు. అందివచ్చిన సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకుంటూ దేశంలోనే ఉత్తమ పనితీరు కనబరుస్తున్న ఏపీ పోలీసులు తాజాగా ప్రాణాలు తీసుకునేందుకు సిద్ధమైన ఓ వైద్య విద్యార్థి ప్రాణాలను కాపాడారు. ఇందుకోసం ఏపీ పోలీసులకు కేవలం 20 నిమిషాలు సరిపోయాయి. ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ ఘటన తిరుపతిలోని రామచంద్రాపురం పరిధి రాయలచెరువు సమీపంలోని అటవీ ప్రాంతంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.

ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. నంద్యాల జిల్లాకు చెందిన ఓ విద్యార్థి తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. గత కొంతకాలంగా వ్యక్తిగత కారణాలతో మానసికంగా కుంగిపోయిన సదరు విద్యార్థి ఆత్మహత్యకు దాదాపుగా సిద్ధమైపోయాడు. శుక్రవారం రాత్రి హాస్టల్ నుంచి బయటకు వచ్చేసిన సదరు విద్యార్థి… నేరుగా రాయలచెరువు సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడి నుంచే అతడు తన స్నేహితులకు ఫోన్ చేసి తాను చనిపోతున్నానని తెలిపాడు.

దీంతో వెనువెంటనే స్పందించిన అతడి మిత్రులు విషయాన్ని అతడి తల్లిదండ్రులతో పాటుగా అలిపిరి పోలీస్ స్టేషన్ కు తెలియజేశారు. ఈ ఫిర్యాదుపై అలిపిరి పోలీసుల నుంచి సమాచారం అందుకున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి బొడ్డు హేమంత్ వెనువెంటనే రంగంలోకి దిగిపోయారు. అధునాతన టెక్నాలజీని వినియోగించి బాదితుడు రాయలచెరువు సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అక్కడికి చేరుకుని అతడి ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్నారు. అనంతరం అతడికి కౌన్సిలింగ్ ఇచ్చి అక్కడి నుంచి తరలించారు.

మొన్నామధ్య కాకినాడ జిల్లాలోనూ ఇదే తరహాలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు సిద్ధం కాగా…ఆ జిల్లా పోలీసులు పొరుగు జిల్లాల పోలీసుల సహకారం తీసుకుని… కేవలం ఆరంటే ఆరు నిమిషాల్లో అతడిని కాపాడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మరో నిమిషం ఆలస్యమైనా కూడా బాధితుడు లాడ్జీలోని ఫ్యానుకు విగత జీవిగా వేలాడేవాడే. అయితే పోలీసుల సమయస్ఫూర్తి, సాంకేతికత వినియోగంతో ఆ వ్యక్తిని కాపాడారు. వెరసి పనితీరులో ఏపీ పోలీసులు సత్తా చాటుతున్నారనే చెప్పాలి.

This post was last modified on April 19, 2025 12:47 pm

Share

Recent Posts

ట్రంప్ తుంట‌రి నిర్ణ‌యం… తిట్టిపోస్తున్న నెటిజ‌న్లు!

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణ‌యాలు విస్మ‌యానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఇరాన్‌పై ఒంటికాలిపై లేచిన…

1 hour ago

పులివెందులకు రమ్మంటావా… తాడేపల్లికి రమ్మంటావా

డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…

2 hours ago

అసెంబ్లీలో మంత్రుల పక్కన సీఎం కూర్చోవడం ఎప్పుడైనా చూసారా?

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…

5 hours ago

ఇంట్రెస్టింగ్… ఫ్లాప్ దర్శకుల కలయికలో సినిమా?

సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే…

7 hours ago

ఇరుముడి కొట్టుడు మళ్లీ మొదలు

‘టాక్సిక్’ వచ్చిన తర్వాత ‘ఇరుముడి’ రన్ మీద ప్రభావం తప్పదేమో అని డౌట్ ఉండేది. పెద్ద పాన్ ఇండియా సినిమా…

7 hours ago

సుబ్బులక్ష్మి బయోపిక్… సాయిపల్లవి స్థానంలో రష్మిక

సుప్రసిద్ధ గాయని ఏంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీసేందుకు నిర్మాత బన్నీ వాస్, అల్లు అరవింద్, రాక్…

8 hours ago