Trends

అమెరికా వెళుతున్నారా?.. తస్మాత్ జాగ్రత్త!

అగ్రరాజ్యం అమెరికా అంటే అందరికీ క్రేజే. చదువుకోవడానికి అయినా, ఉద్యోగం చేయడానికి అయినా.. చివరికి టూర్లకైనా కూడా మన తొలి ప్రాధాన్యం అమెరికాకే. ఆర్థిక పరిస్థితి సహకరించకపోతే తప్పించి.. ఈ భావనలో మార్పు ఉండదని చెప్పొచ్చు. ఆ దేశానికి ఉన్న క్రేజ్ అది. అయితే ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత అమెరికా వైపు చూడాలంటేనే అందరూ హడలిపోతున్నారు. ఇలాంటి వేళ… అమెరికాకు ఏ కారణంతో అయినా వెళ్లాలనుకునే వారు ఇకపై మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే… ఆ దేశంలో తనిఖీలు మరింత కఠినమైపోయాయి. నిత్యావసరాలుగా మారిన మన మొబైళ్లు, ల్యాప్ టాప్ లను అక్కడి పోలీసులు తనిఖీ చేస్తారు. అవసరమనుకుంటే సీజ్ చేస్తారు కూడా.

నిజమే..ఈ వార్తలు అక్షర సత్యమే. ఇకపై అమెరికాలో కాలుపెట్టే వారిపై తనిఖీలు మరింత ముమ్మరం కానున్నాయి. అలాంటి వారిలో గ్రీన్ కార్డ్ హోల్డర్లు అయినా, ఆ దేశ పౌరులు అయినా, సాధారణ విదేశీ ప్రయాణికులైనా కూడా తనిఖీల్లో ఎలాంటి తేడాలు ఉండవట. అయితే అమెరికా పౌరులు, గ్రీన్ కార్డ్ హోల్డర్లకు తనిఖీల్లో ఏదైనా తప్పు తేలితే.. వాటిపై పోరాటం చేసేందుకు హక్కు ఉంటుంది. ఇతరత్రా సాధారణ విదేశీయులకు మాత్రం ఆ హక్కు కూడా ఉండదట. వెరసి కొత్తగా అమలులోకి రానున్న తనిఖీలతో అమెరికాకు వెళ్లే ప్రయాణికులు మరింత జాగరూకతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా అమెరికా వెళ్లే సందర్భంగా మన వ్యక్తిగత సమాచారం ఉన్న డిజిటల్ పరికరాలను తీసుకోకుండా వెళితేనే సేఫ్ అని కూడా నిపుణులు సూచిస్తున్నారు.

యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) అధికారులు ఇకపై విమానాశ్రాయాల్లో తనిఖీలను ముమ్మరం చేయనున్నారట. ఇందులో భాగంగా ప్రయాణికుల వద్ద ఉండే మొబైల్, ల్యాప్ టాప్, ట్యాబ్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాలను తనిఖీ చేస్తారట. ఈ తనిఖీలకు అందరూ సమ్మతించాల్సిందేనట. తనిఖీల సందర్బంగా మరింత పరిశీలన అవసరం అనిపిస్తే… ఆయా వ్యక్తుల డిజిటల్ పరికరాలను అదికారులను సీజ్ చేస్తారట. నిర్దేశిత గడువు 5 రోజుల పాటు ఆ పరికరాలను వారి వద్దే ఉంచుకుంటారట. ఆ తర్వాత కూడా మరింత పరిశీలన అవసరం అయితే..మరో 7రోజుల పాటు వాటిని అదికారులు తమ వద్దే ఉంచుకునే అివకాశం లేకపోలేదట. ఇలా ఈ వాయిదాలను మరింతగా పెంచే ప్రమాదం లేకపోలేదట. అంతిమంగా మన పరికరాలు మన చేతికి వచ్చినా.. దానిలోని సమాచారం ఏ మేరకు సేఫ్ అన్నదే ఇప్పుడు అసలు సిసలు ప్రశ్నగా మారింది.

మన వ్యక్తిగత సమాచారాన్ని భద్రంగా ఉంచుకోవాలంటే… అమెరికా వెళ్లే సమయంలో మనం నిత్యం వినియోగించే డిజిటల్ పరికరాలను కాకుండా కేవలం టూర్ నిమిత్తం వినియోగించే పరికరాలను మాత్రమే వెంట తీసుకెళితే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వీటిలోనూ మన లాగిన్ ను డిజేబుల్ చేయాలని కూడా సూచిస్తున్నారు. మన కీలక సమాచారం ఉన్న వాటి పాస్ వర్డ్ లు, ఇతరత్రా అకౌంట్ల వివరాలు లేని వస్తువులను తీసుకెళ్లడం మంచిదని సలహా ఇస్తున్నారు. ఇక అమెరికాలో అదికారులు మన వస్తువులను సీజ్ చేస్తే… దానికి సంబంధించిన పత్రాలను తప్పనిసరిగా తీసుకోవాలని, ఆయా వస్తువులను తిరిగి మన చేతికి రాగానే వాటి పాస్ వర్డ్ లను మార్చుకోవాలని చెబుతున్నారు. మొత్తంగా ఇకపై అమెరికా టూర్ కు వెళ్లే ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నది సర్వత్రా వినిపిస్తున్నమాట.

Satya

Recent Posts

నైజామ్ టికెట్ రేట్లు… ఎడతెగని టెన్షన్లు

పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…

1 hour ago

బడ్జెట్ బయటికి చెప్పడం రిస్కంటారా

మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…

2 hours ago

మాటల్లో రాజీ లేదు.. చేతల్లో ఆలస్యం కాదు..

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…

3 hours ago

బాడీగార్డ్ గురించి ఓపెన్ అయిన చ‌ర‌ణ్‌

త‌న కొత్త సినిమా పెద్ది ప్ర‌మోష‌న్లలో భాగంగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఎక్క‌డికి వెళ్లినా… ఆయ‌న వెంట…

5 hours ago

30 దాటాక కూడా రేస్‌లో ఉండాలంటే…

ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…

11 hours ago

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో లోకేష్ భేటీ రీజ‌నేంటి?

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవేంద్ర ఫ‌డ‌ణవీస్‌తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…

12 hours ago