Trends

అమెరికా వెళుతున్నారా?.. తస్మాత్ జాగ్రత్త!

అగ్రరాజ్యం అమెరికా అంటే అందరికీ క్రేజే. చదువుకోవడానికి అయినా, ఉద్యోగం చేయడానికి అయినా.. చివరికి టూర్లకైనా కూడా మన తొలి ప్రాధాన్యం అమెరికాకే. ఆర్థిక పరిస్థితి సహకరించకపోతే తప్పించి.. ఈ భావనలో మార్పు ఉండదని చెప్పొచ్చు. ఆ దేశానికి ఉన్న క్రేజ్ అది. అయితే ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత అమెరికా వైపు చూడాలంటేనే అందరూ హడలిపోతున్నారు. ఇలాంటి వేళ… అమెరికాకు ఏ కారణంతో అయినా వెళ్లాలనుకునే వారు ఇకపై మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే… ఆ దేశంలో తనిఖీలు మరింత కఠినమైపోయాయి. నిత్యావసరాలుగా మారిన మన మొబైళ్లు, ల్యాప్ టాప్ లను అక్కడి పోలీసులు తనిఖీ చేస్తారు. అవసరమనుకుంటే సీజ్ చేస్తారు కూడా.

నిజమే..ఈ వార్తలు అక్షర సత్యమే. ఇకపై అమెరికాలో కాలుపెట్టే వారిపై తనిఖీలు మరింత ముమ్మరం కానున్నాయి. అలాంటి వారిలో గ్రీన్ కార్డ్ హోల్డర్లు అయినా, ఆ దేశ పౌరులు అయినా, సాధారణ విదేశీ ప్రయాణికులైనా కూడా తనిఖీల్లో ఎలాంటి తేడాలు ఉండవట. అయితే అమెరికా పౌరులు, గ్రీన్ కార్డ్ హోల్డర్లకు తనిఖీల్లో ఏదైనా తప్పు తేలితే.. వాటిపై పోరాటం చేసేందుకు హక్కు ఉంటుంది. ఇతరత్రా సాధారణ విదేశీయులకు మాత్రం ఆ హక్కు కూడా ఉండదట. వెరసి కొత్తగా అమలులోకి రానున్న తనిఖీలతో అమెరికాకు వెళ్లే ప్రయాణికులు మరింత జాగరూకతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా అమెరికా వెళ్లే సందర్భంగా మన వ్యక్తిగత సమాచారం ఉన్న డిజిటల్ పరికరాలను తీసుకోకుండా వెళితేనే సేఫ్ అని కూడా నిపుణులు సూచిస్తున్నారు.

యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) అధికారులు ఇకపై విమానాశ్రాయాల్లో తనిఖీలను ముమ్మరం చేయనున్నారట. ఇందులో భాగంగా ప్రయాణికుల వద్ద ఉండే మొబైల్, ల్యాప్ టాప్, ట్యాబ్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాలను తనిఖీ చేస్తారట. ఈ తనిఖీలకు అందరూ సమ్మతించాల్సిందేనట. తనిఖీల సందర్బంగా మరింత పరిశీలన అవసరం అనిపిస్తే… ఆయా వ్యక్తుల డిజిటల్ పరికరాలను అదికారులను సీజ్ చేస్తారట. నిర్దేశిత గడువు 5 రోజుల పాటు ఆ పరికరాలను వారి వద్దే ఉంచుకుంటారట. ఆ తర్వాత కూడా మరింత పరిశీలన అవసరం అయితే..మరో 7రోజుల పాటు వాటిని అదికారులు తమ వద్దే ఉంచుకునే అివకాశం లేకపోలేదట. ఇలా ఈ వాయిదాలను మరింతగా పెంచే ప్రమాదం లేకపోలేదట. అంతిమంగా మన పరికరాలు మన చేతికి వచ్చినా.. దానిలోని సమాచారం ఏ మేరకు సేఫ్ అన్నదే ఇప్పుడు అసలు సిసలు ప్రశ్నగా మారింది.

మన వ్యక్తిగత సమాచారాన్ని భద్రంగా ఉంచుకోవాలంటే… అమెరికా వెళ్లే సమయంలో మనం నిత్యం వినియోగించే డిజిటల్ పరికరాలను కాకుండా కేవలం టూర్ నిమిత్తం వినియోగించే పరికరాలను మాత్రమే వెంట తీసుకెళితే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వీటిలోనూ మన లాగిన్ ను డిజేబుల్ చేయాలని కూడా సూచిస్తున్నారు. మన కీలక సమాచారం ఉన్న వాటి పాస్ వర్డ్ లు, ఇతరత్రా అకౌంట్ల వివరాలు లేని వస్తువులను తీసుకెళ్లడం మంచిదని సలహా ఇస్తున్నారు. ఇక అమెరికాలో అదికారులు మన వస్తువులను సీజ్ చేస్తే… దానికి సంబంధించిన పత్రాలను తప్పనిసరిగా తీసుకోవాలని, ఆయా వస్తువులను తిరిగి మన చేతికి రాగానే వాటి పాస్ వర్డ్ లను మార్చుకోవాలని చెబుతున్నారు. మొత్తంగా ఇకపై అమెరికా టూర్ కు వెళ్లే ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నది సర్వత్రా వినిపిస్తున్నమాట.

This post was last modified on April 18, 2025 2:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

3 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

7 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

8 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

9 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

10 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

10 hours ago