Trends

మోదీ సేనలోకి మరో సీనియర్ క్రికెటర్

క్రికెట్ కెరీర్ లు గుడ్ బై చెప్పిన అనంతరం కొందరు ఆటగాళ్లు డైరెక్ట్ గా పాలిటిక్స్ లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఈమధ్య కాలంలో గంభీర్, మనోజ్ తివారి లాంటి ప్లేయర్స్ బాగా సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ఇక టీమిండియా మాజీ ఆటగాడు కెదార్ జాదవ్ రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టాడు. 2024లో క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన ఈ ఆల్‌రౌండర్ తాజాగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరాడు. 

ముంబయిలో జరిగిన ఒక పార్టీ కార్యక్రమంలో మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బావన్‌కులే సమక్షంలో జాదవ్ చేరిక జరగింది. మున్ముందు బీజేపీలో సేవలందించాలని ఆయన నిర్ణయించుకున్నారు. కెదార్ జాదవ్ మాట్లాడుతూ, “ఛత్రపతి శివాజీ మహారాజ్‌కు వందనం. ప్రధాని మోదీ గారి నాయకత్వంలో, మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్‌తో కలిసి బీజేపీ అభివృద్ధి కోసం పనిచేస్తోంది. చంద్రశేఖర్ బావన్‌కులే గారి ఆహ్వానంతో నేను బీజేపీలో చేరుతున్నాను” అని చెప్పారు. రాజకీయాల్లో నూతన అధ్యాయం ప్రారంభించిన జాదవ్‌పై బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మాజీ క్రికెటర్‌ను పార్టీలోకి స్వాగతించిన బావన్‌కులే, “ఇది మాకు ఆనందదాయకమైన రోజు. క్రికెట్‌ రంగంలోనే కాకుండా అన్ని రంగాల్లోనూ ప్రభావం చూపిన వ్యక్తి జాదవ్. ఆయన పార్టీలో చేరడం గర్వకారణం. ఆయనతో పాటు హింగోలీ, నాందేడ్‌ నుంచి ఇతరులు కూడా బీజేపీలో చేరారు” అన్నారు. జాదవ్‌ 2014లో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌ ద్వారా టీమిండియాలోకి ప్రవేశించి, 2020లో న్యూజిలాండ్‌ పర్యటనలో చివరిసారిగా ఆడాడు. 

తన ఆరేళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో 73 వన్డేల్లో 1389 పరుగులు, 9 టీ20ల్లో 122 పరుగులు చేశాడు. ఆఫ్హ్ బీట్ బౌలింగ్‌ శైలితో 42 వన్డేల్లో 27 వికెట్లు కూడా తీశాడు. 2018 ఆసియా కప్ గెలిచిన టీమ్‌లో సభ్యుడిగా ఉన్నాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్, కోచ్చి టస్కర్స్, ఆర్‌సీబీ, సీఎస్‌కే తరఫున జాదవ్ ఆడాడు. సీఎస్‌కేతో 2018లో ఐపీఎల్ ట్రోఫీ గెలిచాడు. జూన్ 2024లో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన జాదవ్, రాజకీయాల్లో కొత్త అడుగు వేసాడు. మరి ఈ కొత్త వేదికపై అతడి ప్రయాణం ఎలా సాగుతుందో చూడాలి.

This post was last modified on April 8, 2025 6:12 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…

2 hours ago

స‌మంత బంగారం కోసం రాజు గారు వ‌స్తారా?

ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళంలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ద‌శాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన క‌థానాయిక స‌మంత‌. కానీ కొన్నేళ్లుగా…

3 hours ago

ఆ యూట్యూబర్లకు ‘పరాభవం’ తప్పదట

సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…

3 hours ago

క‌విత పార్టీకి న్యాయ చిక్కులు… ఏం జరిగింది?

బీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత త‌న…

5 hours ago

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

5 hours ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

6 hours ago