Trends

ఇకపై భారత్ తరహాలో అమెరికాలో ఎన్నికలు? ట్రంప్ కీలక ఆదేశం!

అమెరికా ఎన్నికల వ్యవస్థపై ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వచ్చే అధ్యక్ష ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ట్రంప్ ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌కు సంతకం చేశారు. దీనితో ఎన్నికల ప్రాసెస్‌లో పౌరసత్వ ధ్రువీకరణ, మెయిల్‌-ఇన్ బ్యాలెట్ల లెక్కింపులో కొత్త మార్గదర్శకాలు ప్రవేశించనున్నాయి. గతంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఇలావుంటే, తాజా ఆర్డర్ ప్రకారం ఓటర్లు తమ అమెరికన్ పౌరసత్వాన్ని స్పష్టంగా నిరూపించాల్సి ఉంటుంది. అలాగే, ఎన్నికల రోజునాటికి అందిన మెయిల్‌-ఇన్ లేదా గైర్హాజరీ బ్యాలెట్లను మాత్రమే లెక్కించాలన్న నిబంధనను ఈ ఆర్డర్ స్పష్టంగా పేర్కొంది. అమెరికన్ పౌరులు కాకపోయిన వారు రాజకీయ విరాళాలు ఇవ్వకుండా అడ్డుకునే విధంగా ఈ ఆదేశం రూపొందించబడింది. వలసదారుల ఓటింగ్ హక్కులపై ఇదొక ఆత్మపరిశీలన లాంటి చర్యగా భావిస్తున్నారు.

ఈ సందర్భంగా ట్రంప్ భారత్, బ్రెజిల్ వంటి దేశాల్లో అమలవుతున్న ఎన్నికల విధానాలను ఉదాహరణగా ప్రస్తావించారు. ఈ దేశాల్లో ఓటర్లు బయోమెట్రిక్ ఆధారంగా గుర్తింపును నిర్ధారించుకుంటుండగా, అమెరికాలో మాత్రం ఇప్పటికీ స్వీయ ధ్రువీకరణపై ఆధారపడడం దురదృష్టకరమని విమర్శించారు. ఓటింగ్ విధానంలో స్థిరత లేకపోవడం వల్లే మోసాలకు, అనుమానాలకు తావిస్తున్నాయని అభిప్రాయపడ్డారు.

“స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన, మోసంలేని ఎన్నికలు మాత్రమే ఒక రాజ్యాంగ గణతంత్రానికి బలంగా నిలుస్తాయి,” అని ట్రంప్ స్పష్టంగా పేర్కొన్నారు. గతంలో ఎన్నికల ఫలితాలపై వ్యక్తమైన అనుమానాల నేపథ్యంలో ఈ రకమైన సంస్కరణలు ప్రజల విశ్వాసాన్ని తిరిగి చేకూర్చే అవకాశముంది. అయితే, వ్యతిరేక పార్టీలు ఈ ఆదేశాన్ని ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించాయి. మరి ట్రంప్ ఈ విషయంలో ఇంకా ఎలాంటి ట్విస్టులు ఇస్తాడో.

This post was last modified on March 26, 2025 3:13 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

37 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

6 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

9 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

12 hours ago