Trends

మరణం అంచున ఉన్న వ్యక్తిని బ్రతికించిన AI

మానవాళికి కృత్రిమ మేధ (ఏఐ) ఉపయోగం ఎలా ఉంటుందో చాటి చెప్పే ఉదంతం ఇది. అమెరికాలో అరుదైన వ్యాధితో మరణం అంచున ఉన్న ఓ యువకుడికి, వైద్యులు గుణమెలేదని చేతులెత్తేయగా… ఏఐ మళ్లీ జీవాన్ని కలిగించింది. ఏఐ సాంకేతికత వైద్యరంగంలో ఎలా విప్లవాత్మక మార్పులు తెస్తుందో చెప్పే ఉదాహరణగా ఇది మారింది. అమెరికా వాషింగ్టన్‌కి చెందిన 33ఏళ్ల జోసెఫ్ కోట్స్ అనే యువకుడు ‘పోయెమ్స్ సిండ్రోమ్’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు.

ఇది శరీరంలోని నాడీ వ్యవస్థ, గుండె, మూత్రపిండాలు వంటి భాగాలను పాడుచేస్తుంది. జోసెఫ్‌కు కాళ్లు, చేతులు చచ్చుబడిపోతుండగా, గుండె తక్కువ వేగంతో పనిచేయడం మొదలైంది. మూత్రపిండాలు కూడా విఫలమయ్యాయి. సంప్రదాయ వైద్యం ఫలించకపోవడంతో వైద్యులు నిరాశ చెందారు. కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతుండగా, అతని ప్రియురాలు తారా మాత్రం చివరి ఆశగా ఏఐ వైద్యుల్ని ఆశ్రయించింది.

ఫిలడెల్ఫియాకు చెందిన డాక్టర్ డేవిడ్ ఫెగిన్బామ్, ఆరోగ్య డేటాను ఏఐకి ఇచ్చి విశ్లేషించగా కొత్త చికిత్స మార్గాలు సూచించబడ్డాయి. కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ, స్టెరాయిడ్ల మిశ్రమంతో జోసెఫ్‌కు వైద్యం అందించాలని ఏఐ సూచించింది. ఈ విధానాన్ని అనుసరించి చికిత్స చేశారు. ట్రీట్మెంట్ మొదలైన వారం రోజుల్లోనే ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. నాలుగు నెలల చికిత్స తర్వాత జోసెఫ్ పూర్తిగా కోలుకోవడమే కాకుండా, స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్‌కు సైతం సిద్దంగా ఉన్నాడని వైద్యులు పేర్కొన్నారు.

ఈ ఘటన కృత్రిమ మేధ సామర్థ్యాన్ని ప్రపంచానికి మరోసారి చాటిచెప్పింది. జోసెఫ్ జీవితం ఏఐ వైద్యపద్ధతుల వల్లే నిలిచిందని వైద్యులు స్పష్టం చేశారు. ఈ విజయం ఎవరూ ఊహించని విధంగా వైద్యరంగాన్ని తిరిగి ఆలోచించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది కేవలం ఒక వ్యక్తి కథ కాదు… రేపటి వైద్యానికి మార్గదర్శకంగా నిలిచే సాక్ష్యం. మరి రానున్న రోజుల్లో AI ఇంకా ఎలాంటి అద్భుతాలను సృష్టిస్తుందో చూడాలి.

This post was last modified on March 26, 2025 2:45 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

సాయిపల్లవి బరిలో ఉంటే అవార్డ్ ఇవ్వాల్సిందే

హీరోల కోసం థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు చాలామందే ఉంటారు. హీరోయిన్ల గ్లామర్ కోసం కూడా కొంతమంది సినిమాలకు వస్తారు. కానీ…

11 minutes ago

‘పవన్ హఠావో’ రచయిత మృతి కేసు మిస్టరీ వీడింది

“పవన్ కళ్యాణ్ హఠావో..పాలిటిక్స్ బచావో“ పుస్తక రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి వ్యవహారం తెలంగాణతో పాటు ఏపీ…

36 minutes ago

విన్యాసం మీదే బాక్సాఫీస్ ఆశలు

గత నెల రోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా డ్రైగా ఉంది. కపుల్ ఫ్రెండ్లీ లాంటివి కాసింత పాజిటివ్ టాక్ తో…

36 minutes ago

ఇటు వివాదం… అటు ముహూర్తం

జై హనుమాన్.. ఈ సినిమా కోసం రెండేళ్ల కిందట్నుంచి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2024 సంక్రాంతికి…

52 minutes ago

కమల్ హీరో… రజినీ విలన్?

సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్‌ల కలయికలో 46 ఏళ్ల తర్వాత సినిమా రాబోతుండడం వాళ్లిద్దరి అభిమానులనే…

2 hours ago

ప్రేమ పెళ్ళి.. తల్లిదండ్రులకు సమాచారం తప్పనిసరి

వివాహ నమోదు నిబంధనల్లో మార్పులు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం కీలక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. పెళ్లి నమోదు చేసుకునే జంటలు…

3 hours ago