ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి క్రీడా రంగంలో ఓ చరిత్రాత్మక మైలురాయిని చేరుకోనుంది. దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా వెలుగొందబోతున్న ఈ ప్రాజెక్టుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని తెలుస్తోంది. మొత్తం 1.32 లక్షల సీటింగ్ సామర్థ్యం గల ఈ భారీ స్టేడియం అమరావతిలోని 200 ఎకరాల స్పోర్ట్స్ సిటీ భాగంగా నిర్మితమవుతుంది. నరేంద్ర మోడీ స్టేడియంతో సమానంగా ఉండే ఈ స్టేడియం భారత క్రికెట్ చరిత్రలో మరో ఘట్టాన్ని ప్రారంభించనుంది.
ఈ ప్రాజెక్టును ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) ప్రతిపాదించగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి మద్దతు ఇచ్చారు. రాష్ట్ర యువతలో క్రికెట్ అభిమానం పెంచడంతో పాటు, దేశవిదేశాల నుంచి ఆడగాళ్లను ఆకర్షించేలా ఈ స్టేడియాన్ని రూపొందించనున్నారు. ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్ వంటి మెగా ఈవెంట్లను అమరావతిలో నిర్వహించే లక్ష్యంతో ఈ నిర్మాణం సాగనుంది. అమరావతిని స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దే ప్రయత్నాల్లో ఇది కీలక అడుగుగా చెప్పవచ్చు.
స్టేడియానికి సరిపడే విధంగా రవాణా, పార్కింగ్, హోటల్స్, ట్రైనింగ్ అకాడెమీలు, రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ వంటి మౌలిక వసతుల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమాంతరంగా చేపట్టనుంది. ఇప్పటికే ఐసీసీ చైర్మన్ జై షా ఈ ప్రాజెక్టుకు అంగీకారం తెలపడం రాష్ట్రానికి ప్రతిష్ఠను తీసుకురానుంది. ఇక త్వరలోనే భూమి పూజ జరిపి నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు.
ఇదే సమయంలో విశాఖలోని స్టేడియాన్ని ఐపీఎల్ ప్రమాణాలకు తగినట్టు అభివృద్ధి చేయడం, మంగళగిరిలో రంజీ స్థాయి మ్యాచ్లకు వేదిక సిద్ధం చేయడం, కడప, విజయవాడ, విజయనగరం, అరకు, కుప్పం, కళ్యాణదుర్గం వంటి ప్రాంతాల్లో క్రికెట్ అకాడమీలను ఏర్పాటు చేయడమూ ఏసీఏ ప్రణాళికలో భాగంగా ఉన్నాయి. దీంతో రాష్ట్రం అంతటా క్రికెట్ దిశగా ఆసక్తి పెరుగుతుంది. ఈ క్రికెట్ స్టేడియం నిర్మాణంతో అమరావతి ఒక జాతీయ స్థాయి క్రికెట్ కేంద్రంగా మారనుంది.
This post was last modified on March 25, 2025 3:59 pm
దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…