Trends

అమరావతిలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం… ఐసీసీ గ్రీన్ సిగ్నల్?

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి క్రీడా రంగంలో ఓ చరిత్రాత్మక మైలురాయిని చేరుకోనుంది. దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా వెలుగొందబోతున్న ఈ ప్రాజెక్టుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని తెలుస్తోంది. మొత్తం 1.32 లక్షల సీటింగ్ సామర్థ్యం గల ఈ భారీ స్టేడియం అమరావతిలోని 200 ఎకరాల స్పోర్ట్స్ సిటీ భాగంగా నిర్మితమవుతుంది. నరేంద్ర మోడీ స్టేడియంతో సమానంగా ఉండే ఈ స్టేడియం భారత క్రికెట్ చరిత్రలో మరో ఘట్టాన్ని ప్రారంభించనుంది.

ఈ ప్రాజెక్టును ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) ప్రతిపాదించగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి మద్దతు ఇచ్చారు. రాష్ట్ర యువతలో క్రికెట్ అభిమానం పెంచడంతో పాటు, దేశవిదేశాల నుంచి ఆడగాళ్లను ఆకర్షించేలా ఈ స్టేడియాన్ని రూపొందించనున్నారు. ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్ వంటి మెగా ఈవెంట్లను అమరావతిలో నిర్వహించే లక్ష్యంతో ఈ నిర్మాణం సాగనుంది. అమరావతిని స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దే ప్రయత్నాల్లో ఇది కీలక అడుగుగా చెప్పవచ్చు.

స్టేడియానికి సరిపడే విధంగా రవాణా, పార్కింగ్, హోటల్స్, ట్రైనింగ్ అకాడెమీలు, రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ వంటి మౌలిక వసతుల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమాంతరంగా చేపట్టనుంది. ఇప్పటికే ఐసీసీ చైర్మన్ జై షా ఈ ప్రాజెక్టుకు అంగీకారం తెలపడం రాష్ట్రానికి ప్రతిష్ఠను తీసుకురానుంది. ఇక త్వరలోనే భూమి పూజ జరిపి నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు.

ఇదే సమయంలో విశాఖలోని స్టేడియాన్ని ఐపీఎల్ ప్రమాణాలకు తగినట్టు అభివృద్ధి చేయడం, మంగళగిరిలో రంజీ స్థాయి మ్యాచ్‌లకు వేదిక సిద్ధం చేయడం, కడప, విజయవాడ, విజయనగరం, అరకు, కుప్పం, కళ్యాణదుర్గం వంటి ప్రాంతాల్లో క్రికెట్ అకాడమీలను ఏర్పాటు చేయడమూ ఏసీఏ ప్రణాళికలో భాగంగా ఉన్నాయి. దీంతో రాష్ట్రం అంతటా క్రికెట్ దిశగా ఆసక్తి పెరుగుతుంది. ఈ క్రికెట్ స్టేడియం నిర్మాణంతో అమరావతి ఒక జాతీయ స్థాయి క్రికెట్ కేంద్రంగా మారనుంది.

This post was last modified on March 25, 2025 3:59 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

2 hours ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

3 hours ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

5 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

9 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

10 hours ago