Trends

సీఎస్కే తేల్చేసింది.. ఇక నిర్ణయం ధోనీదే

కెరీర్లో ఎన్నడూ లేనంతగా విమర్శలు, వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు మహేంద్రసింగ్ ధోని ఈ మధ్య. అతడి సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్‌లో ఎన్నడూ చూడని పరాభవాలు చవిచూసింది. లీగ్‌లో ఆడిన ప్రతిసారీ సెమీస్ లేదా ప్లేఆఫ్ చేరిన ఆ జట్టు.. తొలిసారి ఈ సీజన్లో ముందంజ వేయలేకపోయింది. ఇప్పటిదాకా టోర్నీలో ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టు అదే. అంతే కాదు.. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది.

టోర్నీలో వేరే జట్లు కూడా ఓడుతున్నాయి కానీ.. చెన్నై ఆట, ఓడిన తీరు ఘోరాతి ఘోరం. కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా ధోని పూర్తిగా తేలిపోయాడు ఈ సీజన్లో. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ డిమాండ్లకు తగ్గట్లుగా ఆడలేక రిటైర్మెంట్ తీసుకున్న ధోని.. ఐపీఎల్‌లో కూడా కొనసాగలేడన్న అభిప్రాయం ఈ సీజన్లో కలిగించాడు. ఒక్క మ్యాచ్‌లో కూడా ధోని సాధికారికంగా బ్యాటింగ్ చేయలేదు. దీంతో అతడి కథ ముగిసిందనే అభిప్రాయం చాలామందిలో కలిగింది. ధోని వీరాభిమానులు సైతం అతణ్నలా చూడలేకపోయారు.

ఈ నేపథ్యంలో ధోనీకిదే చివరి ఐపీఎల్ సీజన్ అవుతుందేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి. ధోని ఎవరితోనూ చెప్పించుకునే రకం కాదని అందరికీ తెలుసు. తనలో చేవ తగ్గిందని తెలిస్తే తనకు తానుగా తప్పుకునే రకం. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్‌ వరకు ధోని ఉంటాడా లేదా అన్న ఉత్కంఠ మొదలైంది. అతడి నుంచి సీజన్ చివర్లో ఏమైనా అనౌన్స్‌మెంట్ వస్తుందేమో అని కూడా చూస్తున్నారు. కానీ ఈ లోపు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ స్పందించింది.

ఈ సీజన్లో తమ జట్టు విఫలమైనప్పటికీ వచ్చే సీజన్‌కు కూడా ధోనీనే కెప్టెన్ అని ప్రకటించేసింది. ఒక సీజన్లో ఫెయిలైనంత మాత్రాన ధోనీ మీద తమ నమ్మకం సడలిపోదని పేర్కొంది. ఫ్రాంఛైజీ వరకైతే ధోని పట్ల ఎలాంటి వ్యతిరేకత లేదని, అతనే కొనసాగాలని కోరుకుంటోందని స్పష్టమైపోయింది. ఇక తేల్చాల్సింది ధోనీనే. ఇంకో ఐదు నెలల్లోనే మళ్లీ ఐపీఎల్ వస్తుంది కాబట్టి కొనసాగుదామని అనుకుంటాడా లేక తన ఫిట్నెస్, జట్టు పరిస్థితి చూసుకుని ఇక చాలని కాడి వదిలేస్తాడా అన్నది ధోని నిర్ణయమే. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.

This post was last modified on October 28, 2020 4:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

25 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

2 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

3 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago