మహా కుంభమేళా, భక్తులకే కాదు, వ్యాపారస్తులకు కూడా అపారమైన ఆదాయాన్ని అందించే అవకాశాన్ని కల్పిస్తుంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఇటీవల జరిగిన కుంభమేళాలో ఇదే రీతిలో ఓ కుటుంబం అద్భుతమైన లాభాలను సొంతం చేసుకుంది. అరైల్ గ్రామానికి చెందిన పింటూ మహ్రా కుటుంబం, త్రివేణి సంగమ వద్ద 45 రోజుల పాటు 130 బోట్లను నడిపి దాదాపు రూ. 30 కోట్లు సంపాదించింది. సాధారణంగా రోజుకు కొన్ని వందల రూపాయల కోసం శ్రమించే వారి కోసం ఇది పెద్ద అదృష్టం. కానీ అనూహ్యంగా ఈ సంపద ఇప్పుడు వారికి తలనొప్పిగా మారింది.
అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ వ్యవహారాన్ని ప్రస్తావించడంతో, ఈ విషయం సామాన్య ప్రజల దృష్టికి వచ్చింది. అప్పటివరకు ప్రశాంతంగా సాగిన పింటూ కుటుంబ జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఈ వార్త వైరల్ కావడంతో ఆదాయపన్ను శాఖ కూడా స్పందించింది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, పింటూ కుటుంబానికి రూ. 12.8 కోట్లు పన్నుగా చెల్లించాలంటూ నోటీసులు జారీ అయ్యాయి. ఇది ఒక్కసారిగా వారి జీవితంలో ఊహించని మార్పును తీసుకువచ్చింది.
పెరిగిన ఆదాయం, ఆర్థికంగా బలపడిన అనుభూతి తక్కువ కాలం మాత్రమే ఆనందాన్ని అందించింది. పింటూ కుటుంబం రోజుకు కొన్ని వందల రూపాయలకే బోట్లను నడిపేది. కానీ కుంభమేళా సమయంలో అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఒక్కో బోట్ రైడ్కు రూ. 1000 వరకు వసూలు చేయగలిగారు. తాత్కాలికంగా వచ్చిన ఈ అదృష్టం, వారు అనుకున్నంత సులభం కాదని ఆలస్యంగా తెలిసింది. సాధారణంగా పెద్ద వ్యాపారులు, సంస్థలు తమ ఆదాయంపై పన్ను చెల్లించడంలో అనుభవం కలిగి ఉంటారు. కానీ పింటూ లాంటి వారికి ఇటువంటి అనుభవం లేకపోవడంతో ఇప్పుడు వారు పన్ను రుసుము చెల్లించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ సంఘటన ద్వారా అనేక విషయాలు స్పష్టమవుతున్నాయి. ప్రభుత్వానికి తెలియకుండా వచ్చిన ఆదాయాన్ని ఉపయోగించుకోవడం ఎంత ప్రమాదకరమో ఇది తేటతెల్లం చేసింది. పింటూ కుటుంబం లాంటి చిన్న వ్యాపారస్తులకు అకస్మాత్తుగా వచ్చిన ఆదాయంపై తగిన అవగాహన లేకపోవడం, వారు ఆర్థికంగా ఇంకా కుదుటపడకముందే పన్ను భారం మోపబడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన భవిష్యత్తులో ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకునే ఇతర చిన్న వ్యాపారులకు ఒక గుణపాఠంగా నిలవనుంది.
This post was last modified on March 15, 2025 5:57 pm
మాస్ రాజా రవితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు వాళ్లుండే ప్రతి చోటా ఇరగాడేస్తోంది. తెలుగులో…
బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…
మాస్ రాజా రవితేజ నుంచి సరైన సినిమా వస్తే.. పరిస్థితులు కూడా అనుకూలిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో…
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా నుంచి దీపికా పదుకొనేను తప్పించడం మీద ఎప్పుడో…