ముంబై పేలుళ్లు, భారత పార్లమెంటుపై ఉగ్రవాద దాడులను లైవ్లో పర్యవేక్షించినట్టు ఆరోపణలు ఉన్న.. మోస్ట్ వాంటెడ్ ఐసిసి ఉగ్రవాది.. ఇస్లామిక్ స్టేట్ ప్రపంచ స్థాయి కార్యక్రమాల అధినేత అబ్దులా మక్కీని అమెరికా దారుణంగా హత మార్చింది. నడిరోడ్డుపై ఆయన ప్రయాణిస్తున్న కారుపై క్షిపణిని ప్రయోగించి.. ప్రాణాలు తీసింది. దీనికి అమెరికా మిత్ర దేశం.. ఇరాక్ కూడా సహకరించడం గమనార్హం. ఇరాక్-అమెరికా చేపట్టిన సంయుక్త ఆపరేషన్లో మక్కీ హతమైనట్టు అగ్రరాజ్యం అధినేత ట్రంప్ ప్రకటించారు.
ఎవరీ మక్కీ?
ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి ఉగ్ర కార్యక్రమాలు చేపట్టాలన్నా.. దానికి పక్కా ప్లాన్ వేయడంలోనూ.. అనుకున్నది అనుకున్నట్టు చేయడంలోనూ.. అబ్దుల్లా మక్కీ పేరొందిన ఉగ్రవాది. పాకిస్థాన్, ఇరాక్ దేశాల్లో బలమైన శిబిరాలను ఏర్పాటు చేసి.. యువతకు ఉగ్రకార్యక్రమాల్లోనూ ఈయన శిక్షణ ఇస్తున్నాడు. ముంబై ఉగ్రదాడులు, పార్లమెంటుపై జరిగిన దాడులకు పక్కా స్కెచ్ వేసింది కూడా ఈయనేనని భారత్ ఇప్పటికీ విశ్వసిస్తోంది. గతంలోనే ఈయనను హతమార్చేందుకు ప్రణాళిక వేసిన అమెరికా.. తాజాగా ఆ పని పూర్తి చేసింది.
ఎలా చంపారు?
ఈ నెల 13న అమెరికా-ఇరాక్ సేనలు.. సంయుక్తగా అత్యంత రహస్య ఆపరేషన్ నిర్వహించాయి. మక్కీ కారులో వెళ్తుండగా అమెరికా దళాలు క్షిపణి ప్రయోగించాయి. దీంతో ఘటనాస్థలంలోనే అతను హతమయ్యాడు. అతనితో పాటు మరో ఉగ్రవాది కూడా చనిపోయినట్లు అమెరికా ఇంటెలిజెన్స్ పేర్కొంది. ఈ క్షిపణి దాడి అనంతరం మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. అయితే.. వారు ముందుగానే తమను తాము పేల్చేసుకునేందుకు సూసైడ్ బాంబులు అమర్చుకున్నట్టు గుర్తించారు.
ఇరాక్కు స్వేచ్ఛ
ఇరాక్ సహా చుట్టుపక్కల ముస్లిం దేశాలకు కంట్లో నలుసుగా మారిన మక్కీ.. హత్యతో ఇరాక్కు స్వేచ్ఛ లభించిందని ఆ దేశ ప్రధాని ప్రకటించారు. ఇది ఇరాకీ ప్రజలకు.. పండుగ రోజని చెప్పారు. ఇక, అమెరికా కూడా.. ఇరాక్ స్వేచ్ఛగా జీవించవచ్చని పేర్కొంది. మక్కీని హత మార్చడంలో అమెరికా ఎంతో సాహసోపేత విన్యాసం చేసిందని ట్రంప్ పేర్కొనడం గమనార్హం. ఇరాక్కు శాంతి, ప్రపంచానికి ప్రశాంతత లభించాయని తెలిపారు.
మరో ఏడాది తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పాదయాత్రల సందడి మొదలుకానుంది. ఎన్నికలకు ముందు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రధాన పార్టీలు…
థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…