భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇప్పటికీ వార్షిక కాంట్రాక్టుల జాబితాను విడుదల చేయలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాల గ్రేడ్ A+ కాంట్రాక్టులు ప్రమాదంలో ఉన్నాయన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం గ్రేడ్ A+ కేటగిరీలో ఉన్న ఆటగాళ్లకు సంవత్సరానికి రూ.7 కోట్లు వేతనంగా లభిస్తోందని టాక్. కానీ, ఈ ముగ్గురు ఆటగాళ్లు ఇప్పటికే టీ20 ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడం వారి భవిష్యత్తుపై అనుమానాలను పెంచుతోంది.
BCCI సాధారణంగా IPL ప్రారంభానికి ముందు కాంట్రాక్టుల జాబితాను ప్రకటిస్తుంది, కానీ ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ పూర్తయ్యే వరకు ఆగనున్నట్లు తెలుస్తోంది. ఈ మెగాటోర్నీలో ఈ ముగ్గురు ఎలా రానిస్తారో అనేదే కాంట్రాక్టుపై ప్రభావం చూపనుంది. మరోవైపు, జస్ప్రిత్ బుమ్రా కూడా A+ గ్రేడ్లో ఉన్నాడు. కానీ అతను అన్ని ఫార్మాట్లలో ఆడుతున్నాడనే కారణంగా అతడి కాంట్రాక్టుపై ఎలాంటి అనుమానాలు లేవు.
BCCI ఈసారి కాంట్రాక్టుల కేటగిరీలు మాత్రమే ప్రకటిస్తుందని, కానీ వేతన వివరాలను వెల్లడించకపోవచ్చని సమాచారం. గతంలో A+ గ్రేడ్కు 7 కోట్లు, A గ్రేడ్కు 5 కోట్లు, B గ్రేడ్కు 3 కోట్లు, C గ్రేడ్కు 1 కోట్లు కేటాయించారు. ఇక ప్రతీ మ్యాచ్ ఫీజులు అదనంగా ఉంటాయి. అయితే, రోహిత్, కోహ్లీ, జడేజా A+ కేటగిరీలో కొనసాగుతారా లేదా ఇతర కేటగిరీల్లోకి దిగజారతారామ్అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇక శ్రేయస్ అయ్యర్ గతంలో ఫిట్నెస్ కారణంగా కాంట్రాక్టుకు దూరంగా ఉన్నా, ఈసారి అతను టాప్ జాబితాలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో అతని అద్భుత ప్రదర్శన, దేశవాళీ క్రికెట్లో అతడి ఫామ్ బలమైన కారణాలుగా మారాయి. ఇక రోహిత్ శర్మ విషయానికి వస్తే, ఈ టోర్నీ తర్వాత అతను తన భవిష్యత్తుపై తీసుకునే నిర్ణయం కాంట్రాక్టుపై ప్రభావం చూపనుంది. ఇక BCCI కొత్త కాంట్రాక్టు జాబితా ఎప్పుడు ప్రకటిస్తుందో చూడాలి.
This post was last modified on March 7, 2025 3:01 pm
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…