Trends

రోహిత్, కోహ్లీ, జడేజా.. BCCI జీతాల్లో మార్పులు?

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇప్పటికీ వార్షిక కాంట్రాక్టుల జాబితాను విడుదల చేయలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాల గ్రేడ్ A+ కాంట్రాక్టులు ప్రమాదంలో ఉన్నాయన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం గ్రేడ్ A+ కేటగిరీలో ఉన్న ఆటగాళ్లకు సంవత్సరానికి రూ.7 కోట్లు వేతనంగా లభిస్తోందని టాక్. కానీ, ఈ ముగ్గురు ఆటగాళ్లు ఇప్పటికే టీ20 ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడం వారి భవిష్యత్తుపై అనుమానాలను పెంచుతోంది.

BCCI సాధారణంగా IPL ప్రారంభానికి ముందు కాంట్రాక్టుల జాబితాను ప్రకటిస్తుంది, కానీ ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ పూర్తయ్యే వరకు ఆగనున్నట్లు తెలుస్తోంది. ఈ మెగాటోర్నీలో ఈ ముగ్గురు ఎలా రానిస్తారో అనేదే కాంట్రాక్టుపై ప్రభావం చూపనుంది. మరోవైపు, జస్ప్రిత్ బుమ్రా కూడా A+ గ్రేడ్‌లో ఉన్నాడు. కానీ అతను అన్ని ఫార్మాట్లలో ఆడుతున్నాడనే కారణంగా అతడి కాంట్రాక్టుపై ఎలాంటి అనుమానాలు లేవు.

BCCI ఈసారి కాంట్రాక్టుల కేటగిరీలు మాత్రమే ప్రకటిస్తుందని, కానీ వేతన వివరాలను వెల్లడించకపోవచ్చని సమాచారం. గతంలో A+ గ్రేడ్‌కు 7 కోట్లు, A గ్రేడ్‌కు 5 కోట్లు, B గ్రేడ్‌కు 3 కోట్లు, C గ్రేడ్‌కు 1 కోట్లు కేటాయించారు. ఇక ప్రతీ మ్యాచ్ ఫీజులు అదనంగా ఉంటాయి. అయితే, రోహిత్, కోహ్లీ, జడేజా A+ కేటగిరీలో కొనసాగుతారా లేదా ఇతర కేటగిరీల్లోకి దిగజారతారామ్అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఇక శ్రేయస్ అయ్యర్ గతంలో ఫిట్నెస్ కారణంగా కాంట్రాక్టుకు దూరంగా ఉన్నా, ఈసారి అతను టాప్ జాబితాలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో అతని అద్భుత ప్రదర్శన, దేశవాళీ క్రికెట్‌లో అతడి ఫామ్ బలమైన కారణాలుగా మారాయి. ఇక రోహిత్ శర్మ విషయానికి వస్తే, ఈ టోర్నీ తర్వాత అతను తన భవిష్యత్తుపై తీసుకునే నిర్ణయం కాంట్రాక్టుపై ప్రభావం చూపనుంది. ఇక BCCI కొత్త కాంట్రాక్టు జాబితా ఎప్పుడు ప్రకటిస్తుందో చూడాలి.

Kumar

Recent Posts

సుకుమార్ వేసిన దారిలో ఎందరో

ఎనిమిది సంవత్సరాల క్రితం రంగస్థలం విడుదలకు ముందు ఇది ఎలా ఉంటుందనే అనుమానాలు ఫ్యాన్స్ లోనే ఉండేవి. కారణం టిపికల్…

6 hours ago

దురంధర్ విలన్ ‘ఇక్కా’ ఎలా ఉంది

ఒకప్పటి హీరో అక్షయ్ ఖన్నా అంటే జెన్ జీ ప్రేక్షకులకు వెంటనే ఫ్లాష్ కాదు. దురంధర్ విలన్ రెహమాన్ డెకాయిట్…

6 hours ago

ధనుష్ మురుగన్… త్రివిక్రమ్ రియాక్షన్ ఏంటో

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే ప్యాన్ ఇండియా మూవీ ప్రకటన పోస్టర్ రూపంలో రావడం ఆలస్యం తెలుగు…

6 hours ago

అక్క రాజ్యం చూపిస్తానంటున్న కవిత

తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత విశ్వ‌రూపం చూపించారు. ప‌దునైన మాట‌ల‌తో విరుచుకుప‌డ్డారు. ``ఇప్ప‌టి వ‌ర‌కు మీరు అన్న‌..…

7 hours ago

‘భాగ్యశ్రీ’ భాగ్యరేఖ మారినట్టేనా

మిస్టర్ బచ్చన్ లాంటి డిజాస్టర్ తో టాలీవుడ్ కెరీర్ మొదలుపెట్టిన భాగ్యశ్రీ బోర్సేకు చాలా కాలం టైం కలిసి రాలేదు.…

7 hours ago

‘భద్రాచలం రాముడి మీద ఆనా… ఈసారి కాంగ్రెస్ పార్టీకి 117!’

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చి తీరుతుంద‌న్నారు.…

8 hours ago