Trends

ఆ దేశంలో భారత మహిళకు మరణశిక్ష

విదేశాల్లో ఉద్యోగం పేరుతో వెళ్లిన ఓ భారతీయ మహిళకు అక్కడే మరణశిక్ష అమలవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన షెహజాది ఖాన్‌ అనే మహిళ యూఏఈలో హత్య కేసులో దోషిగా తేలడంతో ఆమెకు అక్కడి ప్రభుత్వం మరణశిక్ష విధించింది. ఫిబ్రవరి 15న ఈ శిక్షను అమలు చేయగా, తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

కుమార్తెను కాపాడాలని ఆమె కుటుంబం ఎంతగా ప్రయత్నించినా, చివరకు ఫలితం లేకుండానే ఆమె ప్రాణాలు కోల్పోయింది. మరణశిక్ష అమలుకు ముందు, షెహజాదికి తన చివరి కోరికను తెలియజేయాలని జైలు అధికారులు అనుమతించారు. దీంతో ఆమె తన కుటుంబ సభ్యులతో చివరిసారి మాట్లాడింది. నిర్దోషినని చెప్పుకుంటూనే కన్నీటిపర్యంతమైంది. కానీ, ఆ అశ్రువులు ఏమీ చేయలేకపోయాయి.

ఈ ఘటన వెనుక షెహజాది జీవితం మలుపులు తిరిగిన కథ కూడా ఉంది. 2020లో యూపీలోని తన గ్రామంలో ఓ అగ్నిప్రమాదంలో గాయపడిన ఆమె, కోలుకున్నాక జీవితం మెరుగుపడుతుందని భావించి ఒక వ్యక్తి మాటలు నమ్మి యూఏఈ వెళ్లింది. అయితే, అక్కడ పని కల్పిస్తానని నమ్మించి ఆమెను ఒక కుటుంబానికి విక్రయించారు. షెహజాది ఫైజ్‌, నాడియా అనే దంపతుల ఇల్లు చేరింది. అక్రమ మానవ రవాణా కేసులో ఆ దంపతులపై కూడా కేసు నమోదైంది.

అయితే మరో ఆశ్చర్యకరమైన ఘటన ఆ ఫ్యామిలీలోనే చోటు చేసుకుంది. మొదట దంపతులు వారి చిన్నారి సంరక్షణ బాధ్యత ఆమెకు అప్పగించారు. అనుకోకుండా ఆ చిన్నారి మృతి చెందింది. దీంతో షెహజాదిపై హత్య ఆరోపణలు మోపి, ఆమెను నేరస్తూరాలిగా నిలిపారు. తాను క్షేమంగానే చిన్నారిని చూసుకునేదాన్నని, కానీ ఆ దంపతుల వల్లే పాప చనిపోయినట్లు ఆమె తెలిపింది.

మెడిసిన్ విషయంలో నిర్లక్ష్యం వహించారని కోర్టుకు తెలుపగా, కోర్టు మాత్రం ఆమె వాదనను అంగీకరించలేదు. అక్కడి దర్యాప్తు బృందాలు ఆమెపై తీవ్ర ఆరోపణలు మోపడంతో, చివరకు మరణశిక్ష విధించారు. యూపీలోని షెహజాది తండ్రి ప్రభుత్వాన్ని ఆశ్రయించినా, ఆమెను కాపాడే అవకాశం లేకుండా పోయింది. షెహజాదికి మరణశిక్ష అమలవగా, ఈ ఘటన ఇప్పుడు భారతదేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

This post was last modified on March 4, 2025 4:57 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

2 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

6 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

7 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

7 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

8 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

10 hours ago