విదేశాల్లో ఉద్యోగం పేరుతో వెళ్లిన ఓ భారతీయ మహిళకు అక్కడే మరణశిక్ష అమలవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉత్తరప్రదేశ్కు చెందిన షెహజాది ఖాన్ అనే మహిళ యూఏఈలో హత్య కేసులో దోషిగా తేలడంతో ఆమెకు అక్కడి ప్రభుత్వం మరణశిక్ష విధించింది. ఫిబ్రవరి 15న ఈ శిక్షను అమలు చేయగా, తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
కుమార్తెను కాపాడాలని ఆమె కుటుంబం ఎంతగా ప్రయత్నించినా, చివరకు ఫలితం లేకుండానే ఆమె ప్రాణాలు కోల్పోయింది. మరణశిక్ష అమలుకు ముందు, షెహజాదికి తన చివరి కోరికను తెలియజేయాలని జైలు అధికారులు అనుమతించారు. దీంతో ఆమె తన కుటుంబ సభ్యులతో చివరిసారి మాట్లాడింది. నిర్దోషినని చెప్పుకుంటూనే కన్నీటిపర్యంతమైంది. కానీ, ఆ అశ్రువులు ఏమీ చేయలేకపోయాయి.
ఈ ఘటన వెనుక షెహజాది జీవితం మలుపులు తిరిగిన కథ కూడా ఉంది. 2020లో యూపీలోని తన గ్రామంలో ఓ అగ్నిప్రమాదంలో గాయపడిన ఆమె, కోలుకున్నాక జీవితం మెరుగుపడుతుందని భావించి ఒక వ్యక్తి మాటలు నమ్మి యూఏఈ వెళ్లింది. అయితే, అక్కడ పని కల్పిస్తానని నమ్మించి ఆమెను ఒక కుటుంబానికి విక్రయించారు. షెహజాది ఫైజ్, నాడియా అనే దంపతుల ఇల్లు చేరింది. అక్రమ మానవ రవాణా కేసులో ఆ దంపతులపై కూడా కేసు నమోదైంది.
అయితే మరో ఆశ్చర్యకరమైన ఘటన ఆ ఫ్యామిలీలోనే చోటు చేసుకుంది. మొదట దంపతులు వారి చిన్నారి సంరక్షణ బాధ్యత ఆమెకు అప్పగించారు. అనుకోకుండా ఆ చిన్నారి మృతి చెందింది. దీంతో షెహజాదిపై హత్య ఆరోపణలు మోపి, ఆమెను నేరస్తూరాలిగా నిలిపారు. తాను క్షేమంగానే చిన్నారిని చూసుకునేదాన్నని, కానీ ఆ దంపతుల వల్లే పాప చనిపోయినట్లు ఆమె తెలిపింది.
మెడిసిన్ విషయంలో నిర్లక్ష్యం వహించారని కోర్టుకు తెలుపగా, కోర్టు మాత్రం ఆమె వాదనను అంగీకరించలేదు. అక్కడి దర్యాప్తు బృందాలు ఆమెపై తీవ్ర ఆరోపణలు మోపడంతో, చివరకు మరణశిక్ష విధించారు. యూపీలోని షెహజాది తండ్రి ప్రభుత్వాన్ని ఆశ్రయించినా, ఆమెను కాపాడే అవకాశం లేకుండా పోయింది. షెహజాదికి మరణశిక్ష అమలవగా, ఈ ఘటన ఇప్పుడు భారతదేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
This post was last modified on March 4, 2025 4:57 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…