Trends

భారీ ఆదాయం భారత్ వల్లే.. ఇంగ్లండ్ కు స్ట్రాంగ్ కౌంటర్

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ జట్టు సెమీఫైనల్‌కు చేరకపోవడం అక్కడి మాజీ క్రికెటర్లకు తీవ్ర అసంతృప్తిని కలిగించింది. అయితే తమ జట్టు ప్రదర్శనలో లోపాలను విశ్లేషించకుండా, భారత్ విజయాలను తప్పుబడటమే వారికి ఇష్టం వచ్చిందని చెప్పాలి. పాకిస్థాన్‌కు భద్రతా సమస్యల కారణంగా భారత్ తమ మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై ఇంగ్లండ్ మాజీలు నాజర్ హుస్సేన్, మైక్ ఆర్థర్టన్ విమర్శలు గుప్పిస్తూ, ఒకేచోట మ్యాచ్‌లు ఆడటం భారత్‌కు లాభపడుతోందంటూ కామెంట్లు చేశారు.

ఈ వ్యాఖ్యలపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ గట్టిగా స్పందించారు. ఇలాంటి అసంతృప్తి వ్యాఖ్యలు చేయడం మానేసి, తమ జట్టు ఆటగాళ్ల ప్రదర్శనపై దృష్టి సారించాలని సూచించారు. భారత్ ఆడే మైదానం, వాతావరణం లాభపడుతోందని చెప్పే ముందు, స్వంత జట్టు ఎందుకు విఫలమైందో అర్థం చేసుకోవాలని అన్నారు. ఆటలో విజయం సాధించలేకపోయినంత మాత్రాన, ఇతర జట్లను తప్పుబట్టడం సరైన పద్ధతి కాదని గవాస్కర్ ఘాటుగా సమాధానమిచ్చారు.

ఇంగ్లండ్ ఆటగాళ్ల మానసిక స్థితి, ప్రదర్శన, ఆఖరి క్షణాల్లో తీసుకున్న నిర్ణయాలు అన్నీ కలిపి వారిని సెమీస్‌కు అర్హత పొందనివ్వలేదని గవాస్కర్ గుర్తుచేశారు. భారత్‌కు లభించిన అవకాశాన్ని చూసి అసూయపడటానికి బదులు, ఇంగ్లండ్ జట్టు భవిష్యత్తులో ఎలా మెరుగుపడాలో చర్చించుకోవడం మంచిదని హితవు పలికారు. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ కల్పిస్తున్న ఆర్థిక మద్దతును గుర్తుంచుకోవాలని, టీవీ హక్కులు, స్పాన్సర్‌షిప్‌ల ద్వారా ప్రపంచ క్రికెట్‌కు భారత్ నింపుతున్న కృషిని గుర్తించాలని సూచించారు.

“మీ జీతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో మీరే తెలుసుకోండి. భారత క్రికెట్ మార్కెట్ వల్లే అంతర్జాతీయ క్రికెట్‌కు భారీ ఆదాయం వస్తోంది. అది లేకుంటే మీ పరిస్థితి ఏంటో మళ్లీ ఆలోచించండి!” అంటూ గవాస్కర్ కౌంటర్ ఇచ్చారు. మొత్తానికి, ఇంగ్లండ్ మాజీల వ్యాఖ్యలపై గవాస్కర్ చురకలు వేసిన విధానం ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది.

This post was last modified on March 1, 2025 4:54 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పవన్, ఫాన్స్ ఉన్నారు… హైప్ వస్తుందిలే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కేవలం ఎనిమిది నెలల్లో మూడో సినిమా రాబోతోంది. గత ఏడాది రెండు నెలల…

2 hours ago

డెవిల్ పాట మీద బూతు వివాదం

కాదేది బూతుకు అనర్హం అన్నారో సినీ కవి. కొందరు దీన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే కన్నడ ప్యాన్…

4 hours ago

40 ఏళ్ల బంధాన్ని తెంచుకుంటున్నారా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఇటీవలి…

5 hours ago

టికెట్ రేట్ల పెంపు లేదు… అయినా హ్యాపీనే

తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు జిఓ కోసం ఎదురు చూసిన మైత్రి సంస్థకు చివరికి అది జరిగే సూచనలు లేకపోవడంతో…

6 hours ago

SRH ఈ హెచ్చరికలు వినాల్సిందే..

'ద హండ్రెడ్' వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం ఊహించని వివాదానికి దారితీస్తోంది. ఈ…

8 hours ago

మీరు కాల్చండి.. నేను చూసుకుంటా. అని ఎవరన్నారు?

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో కూడా సంచలనంగా మారిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం…

12 hours ago