Trends

ఇడ్లీ సాంబార్ అమ్మటం వల్లే గోవాకు విదేశీయులు రావట్లేదు

గోవాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఒకరు చేసిన వ్యాఖ్యలు షాకింగ్ గా మారాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారటంతో పాటు.. మరీ ఇంత అతి అవసరమా? అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. తాజాగా ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన గోవా పర్యాటకానికి దెబ్బ పడిందని..గతంలో పోలిస్తే విదేశీ టూరిస్టులు రావటం తగ్గినట్లుగా పేర్కొన్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. విదేశీ పర్యాటకులు రాకపోవటానికి కారణం.. బీచ్ లలో ఇడ్లీ సాంబార్ అమ్మటం అంటూ చేసిన వ్యాఖ్యలే అభ్యంతరకరంగా మారాయి.

నార్త్ గోవాలోని కలంగూట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే మైఖేల్ లోబో.. “బెంగళూరు నుంచి వచ్చిన వారు బీచ్ దుకాణాల్లో వడా పావ్ లు అమ్ముతున్నారు.మరికొందరు ఇడ్లీ సాంబార్ అమ్ముతున్నారు. అందుకే గడిచిన రెండేళ్లుగా గోవాకు విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గిపోయింది” అని పేర్కొన్నారు. ఇంత మాట్లాడిన పెద్ద మనిషి.. ఇడ్లీ సాంబార్.. వడా పావ్ అమ్మటానికి విదేశీ పర్యాటకులు తగ్గటానికి మధ్య ఉన్న లింకేమిటో మాత్రం వెల్లడించకపోవటం గమనార్హం.

అయితే.. గోవాకు విదేశీ పర్యాటకులు తగ్గటానికి అనేక కారణాలు ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ – రష్యా టూరిస్టులు గోవాకు రావట్లేదని చెప్పారు. ఫారిన్ టూరిస్టులు గోవాకు రాకపోవటానికి ప్రభుత్వం ఒక్కటే కారణం కాదన్న ఆయన.. దీనికి అందరూ బాధ్యులేనని చెప్పారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి గోవా వాసులు తమ షాపుల్ని అద్దెకు ఇవ్వటాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు.

గోవాకు విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గటానికి దారి తీసిన కారణాల్నిఅన్వేషించాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక ట్యాక్సీలు.. క్యాబ్ ల మధ్య కూడా అనేక సమస్యలు ఉన్నట్లు పేర్కొన్నారు. మొత్తంగా ఇప్పుడున్న పరిస్థితిని వెంటనే చక్కదిద్దాలని లేదంటే గోవా టూరిజంకు చీకటి రోజులు ఖాయమన్న ఆయన వార్నింగ్ ఇప్పుడు అందరూ అలెర్టు అయ్యేలా మారిందని మాత్రం చెప్పక తప్పదు.

This post was last modified on February 28, 2025 1:53 pm

Share
Show comments
Published by
Satya
Tags: GoaTourism

Recent Posts

రేవంత్ రెడ్డి `వ‌న్ మ్యాన్ ఆర్మీ`… సరిపోవట్లేదా?

తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌లో వ‌న్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి క‌నిపిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి…

3 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో ఎవరిది పైచేయి?

ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల్లో ఒక‌ప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్ద‌గా క‌నిపించ‌డం లేద‌న్న టాక్ వినిపిస్తోంది. కీల‌క నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

3 hours ago

క‌ర‌ణం `క‌ల‌` ఏమైంద‌బ్బా ..!

క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి.. రాజ‌కీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన నేత‌. కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్‌ను ఎమ్మెల్యేగా చూసుకోవాల‌న్న…

7 hours ago

ఏలా చూసినా… మన సీట్లు పెరుగుతాయి

నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…

7 hours ago

RRR వల్ల కానిది దురంధర్ చేయగలదా

బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…

8 hours ago

అక్కడ నెలకు రెండు సార్లు జీతం? ఇదేదో బాగుందే..

ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…

8 hours ago