Trends

ఊరించి ముంచేసిన బంగ్లాదేశ్ : పాక్ ఇక ఇంటికే!

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ ప్రయాణం అర్ధాంతరంగా ముగిసింది. న్యూజిలాండ్ జట్టు బంగ్లాదేశ్ పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించడంతో, పాక్ సెమీస్ కు వెళ్లే మార్గం పూర్తిగా మూసుకుపోయింది. గ్రూప్-ఏలో ఇప్పటికే రెండు మ్యాచ్ ల్లో ఓటమి చెందిన పాకిస్థాన్, ఇప్పుడు చివరగా బంగ్లాదేశ్ పై గెలిచినా కూడా, దాని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.

న్యూజిలాండ్ ఈరోజు బంగ్లాదేశ్ పై విజయం సాధించిన తర్వాత, గ్రూప్-ఏలో భారత్, కివీస్ రెండూ 4 పాయింట్లతో సెమీస్ బెర్తు ఖరారు చేసుకున్నాయి. పాకిస్థాన్ ఇంకా ఒక మ్యాచ్ ఆడాల్సి ఉన్నప్పటికీ, అది కేవలం ఫార్మాలిటీ మాత్రమే. ఈ పరాజయంతో పాకిస్థాన్ అభిమానుల్లో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాతో బరిలోకి దిగిన పాక్ ఈసారి చాలా నిరాశపరిచింది.

ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ ముందుగా బ్యాటింగ్ చేసి 236 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. అనంతరం కివీస్ మొదట తడబడింది. 15 వికెట్లకు రెండు వికెట్లు పడడంతో పాక్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకునే పరిస్థితి కనిపించింది. 73 పరుగుల వద్ద కాన్వె కూడా ఔట్ అవ్వడంతో మ్యాచ్ యూ టర్న్ కానుందని అనుకున్నారు. కానీ రచిన్ రవీంద్ర తన సెంచరీతో పాక్ ఆశలను ఆవిరి చేశాడు.

బంగ్లాదేశ్ మొదట 3 వికెట్లు తీసి కాస్త ఊరించి ఆ తరువాత నిండా ముంచేసిన పరిస్థితి ఏర్పడింది. రవీంద్ర న్యూజిలాండ్ విజయానికి కీలకంగా నిలిచాడు. 105 బంతుల్లో 112 పరుగులు చేసిన అతడు, బంగ్లాదేశ్ బౌలర్లను ఇబ్బందికి గురిచేశాడు. టామ్ లాథమ్ 55 పరుగులు, గ్లెన్ ఫిలిప్స్ 21 (నాటౌట్) తో నిలిచారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజూర్ రెహ్మాన్ తలో వికెట్ తీసుకున్నారు.

ఇప్పటికే రెండు పరాజయాలతో వెనకబడ్డ పాకిస్థాన్, ఈ ఫలితంతో పూర్తిగా బయటకు వెళ్లింది. చివరి మ్యాచ్ బంగ్లాదేశ్ తో ఉన్నప్పటికీ, అది కేవలం గౌరవం కాపాడుకోవడానికి మాత్రమే. న్యూజిలాండ్, భారత్ రెండూ సెమీస్ లోకి అడుగు పెట్టగా, పాక్ అభిమానులు మరోసారి నిరాశతో తలదించుకున్నారు. టోర్నీ ప్రారంభం నుంచి బలహీన ప్రదర్శన, అనవసర ఒత్తిడి, తక్కువ స్థాయిలో ఆటతీరు పాక్ జట్టును విఫలమయ్యేలా చేశాయి.

This post was last modified on February 24, 2025 11:39 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

37 minutes ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

1 hour ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

1 hour ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

2 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

3 hours ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

3 hours ago