Trends

ఛాంపియన్స్ ట్రోఫీకి పాక్ ఉగ్ర ముప్పు?

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్‌లో జరుగుతున్న వేళ, ఆ దేశ ఇంటెలిజెన్స్ వర్గాలు కొత్త ముప్పును గుర్తించాయి. పాకిస్థానీ టెర్రరిస్టు గ్రూపులు ఈ మెగా ఈవెంట్‌ను టార్గెట్ చేస్తూ, మ్యాచ్‌లకు హాజరైన విదేశీయులను కిడ్నాప్ చేయాలనే పథకం వేసినట్లు సమాచారం. ముఖ్యంగా తెహ్రిక్-ఇ-తాలిబన్ (TTP), ఐసిస్, బలూచిస్థాన్ గ్రూపులు ఈ కుట్రలో భాగమని ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి.

ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించి, స్టేడియంల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఈ అంశాన్ని బహిర్గతం చేస్తూ, టోర్నీకి హాజరైన విదేశీయులు టార్గెట్ అవ్వవచ్చని భద్రతా బలగాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఆ దేశంలో క్రికెట్ పునరుద్ధరణ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) చేస్తున్న కృషికి ఇది భారీ ఎదురుదెబ్బ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటికే భారత్ పాకిస్థాన్‌లో భద్రతా సమస్యలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆ దేశంలో ఆడటానికి నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో పీసీబీ హైబ్రిడ్ మోడల్‌ అంగీకరించి, భారత మ్యాచ్‌లు దుబాయ్‌లో నిర్వహించాల్సి వచ్చింది. ఈ తాజా భద్రతా హెచ్చరికలతో మరింత ఆందోళన పెరిగింది.

ఇక క్రికెట్ పరంగా కూడా పాకిస్థాన్ పరిస్థితి ఆశాజనకంగా లేదు. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలై, సెమీఫైనల్ అవకాశాలు దాదాపు కోల్పోయినట్టే. న్యూజిలాండ్ చేతిలో 60 పరుగుల తేడాతో, భారత్ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయిన పాక్ జట్టు ఇప్పుడు అద్భుతం జరిగితే తప్ప తదుపరి దశకు వెళ్లలేని స్థితిలో ఉంది. ఈ పరిస్థితుల్లో భద్రతా సమస్యలు కూడా తలెత్తడంతో పాకిస్థాన్ క్రికెట్‌పై మరింత ఒత్తిడి పెరిగింది.

This post was last modified on February 24, 2025 9:17 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

జిల్లాల విభ‌జ‌న‌… వ్యూహం ఏంటి సీఎం సార్?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భారీ స్ట్రాట‌జీకి తెర‌దీశారు. త్వ‌ర‌లోనే జిల్లాల విభ‌జ‌న చేయ‌నున్న‌ట్టు ఆయ‌న స్వ‌యంగా ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం…

3 hours ago

పోలీసు కస్టడీపై కోర్టుకు వెళ్లిన అంబటి

వైసీపీ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు హైకోర్టును ఆశ్ర‌యించారు. పోలీసులు త‌న‌ను క‌స్ట‌డీలో హింసించారని.. దీంతో త‌న‌కు…

6 hours ago

యుద్ధంతో టీవీ ధరలకు షాక్.. సేల్స్ డౌన్

గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…

7 hours ago

కలెక్షన్లు అంటే కామెడీ అయిపోయింది

మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…

10 hours ago

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

12 hours ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

12 hours ago