ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ పరిస్థితి సంక్లిష్టంగా మారింది. ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ఆ జట్టు ఓటమిపాలై, సెమీఫైనల్ అవకాశాలను సంకోచంలోకి నెట్టుకుంది. ఇప్పుడు పాక్ ఆశలు పూర్తిగా ఇతర జట్లు ఎలా ఆడతాయనేదానిపైనే ఆధారపడి ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు న్యూజిలాండ్, బంగ్లాదేశ్ మధ్య జరగబోయే మ్యాచ్ పాకిస్తాన్ భవితవ్యాన్ని నిర్ణయించనుంది.
పాకిస్తాన్కు సెమీస్ అవకాశాలు మళ్లీ సజీవంగా రావాలంటే కివీస్ బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోవాలి. ఆ తర్వాత పాక్, బంగ్లాదేశ్ మ్యాచ్లో పాకిస్తాన్ తప్పనిసరిగా గెలవాలి. చివరగా, మార్చి 2న న్యూజిలాండ్తో భారత్ పోరులో భారత్ విజయం సాధించాలి. ఈ మూడు పరిస్థితులు అనుకున్నట్లు జరిగితేనే పాకిస్తాన్కు సెమీస్ తలుపులు తెరుచుకుంటాయి.
ఈ సమీకరణల ప్రకారం, టీమిండియా 6 పాయింట్లతో గ్రూప్-ఏలో అగ్రస్థానంలో నిలుస్తుంది. మిగతా మూడు జట్లు 2 పాయింట్లతో సమానంగా ఉంటాయి. ఆ సమయంలో నెట్ రన్రేట్ ఆధారంగా రెండో స్థానంలో ఉన్న జట్టుకే సెమీఫైనల్కు అవకాశం లభిస్తుంది. పాకిస్తాన్ ప్రస్తుతం న్యూజిలాండ్, బంగ్లాదేశ్ కంటే తక్కువ రన్రేట్లో ఉన్నందున, కేవలం గెలిచేంత మాత్రమే కాకుండా, పెద్ద మార్జిన్తో విజయాలు సాధించాల్సిన అవసరం ఉంది.
ఒకవేళ న్యూజిలాండ్ ఈరోజు బంగ్లాదేశ్ను ఓడిస్తే, భారత్, న్యూజిలాండ్ సెమీస్కు దూసుకెళ్తాయి. ఆ సందర్భంలో పాకిస్తాన్ కప్ ఆశలు పూర్తిగా ముగుస్తాయి. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ అభిమానులు తమ జట్టు గెలవాలని మాత్రమే కాదు, భారత్ కూడా న్యూజిలాండ్పై గెలవాలి అనేలా ప్రార్థించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మొత్తంగా పాకిస్తాన్ పరిస్థితి దారుణంగా మారింది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన జట్టుకు వరుస పరాజయాలు ఎదురవడం, ఇప్పుడు ప్రత్యర్థి విజయాలపై ఆధారపడి ఉండడం ఆ జట్టు పరిస్థితి ఎంత దారుణంగా మారిందో చూపుతోంది. ఇక పాక్ సెమీస్ రేసులో నిలవాలంటే, తాము గెలవడమే కాకుండా, భారత్ సైతం వారిని ఆదుకోవాలని ఆశ్రయించాల్సిన దశకు చేరింది.
This post was last modified on February 24, 2025 2:05 pm
కొన్ని సినీ సిత్రాలు విచిత్రంగా ఉంటాయి. అవి సదరు హీరోలు దర్శకులు చెప్పినప్పుడే బయటికి వస్తాయి. అలాంటిదే ఇది. ఎల్లుండి…
పహల్ గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో భారత్ కు చెందిన 26 మంది సాధారణ పౌరులు మృత్యువాత పడిన సంగతి…
సమంత నిర్మాతగా మారి తీసిన శుభం ఎల్లుండి విడుదల కాబోతోంది. దీని మీద బోలెడంత నమ్మకంతో ఉన్న సామ్ నిన్నటి…
జమ్ము కశ్మీర్ లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని భారత్ తీవ్రంగానే పరిగణించింది. ఉగ్ర దాడి జరిగిన నాటి…
ఇవాళ ఉదయం నిద్ర లేచి కళ్ళు తెరిచి టీవీ ఛానల్స్, సోషల్ మీడియా చూసిన భారతీయుల మొహాలు ఒక్కసారిగా ఆనందంతో…
భారత సాయుధ దళాలు బుధవారం తెల్లవారుజామున పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని (పీవోకే) ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడ్డాయి. ‘ఆపరేషన్ సిందూర్’…