ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ పరిస్థితి సంక్లిష్టంగా మారింది. ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ఆ జట్టు ఓటమిపాలై, సెమీఫైనల్ అవకాశాలను సంకోచంలోకి నెట్టుకుంది. ఇప్పుడు పాక్ ఆశలు పూర్తిగా ఇతర జట్లు ఎలా ఆడతాయనేదానిపైనే ఆధారపడి ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు న్యూజిలాండ్, బంగ్లాదేశ్ మధ్య జరగబోయే మ్యాచ్ పాకిస్తాన్ భవితవ్యాన్ని నిర్ణయించనుంది.
పాకిస్తాన్కు సెమీస్ అవకాశాలు మళ్లీ సజీవంగా రావాలంటే కివీస్ బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోవాలి. ఆ తర్వాత పాక్, బంగ్లాదేశ్ మ్యాచ్లో పాకిస్తాన్ తప్పనిసరిగా గెలవాలి. చివరగా, మార్చి 2న న్యూజిలాండ్తో భారత్ పోరులో భారత్ విజయం సాధించాలి. ఈ మూడు పరిస్థితులు అనుకున్నట్లు జరిగితేనే పాకిస్తాన్కు సెమీస్ తలుపులు తెరుచుకుంటాయి.
ఈ సమీకరణల ప్రకారం, టీమిండియా 6 పాయింట్లతో గ్రూప్-ఏలో అగ్రస్థానంలో నిలుస్తుంది. మిగతా మూడు జట్లు 2 పాయింట్లతో సమానంగా ఉంటాయి. ఆ సమయంలో నెట్ రన్రేట్ ఆధారంగా రెండో స్థానంలో ఉన్న జట్టుకే సెమీఫైనల్కు అవకాశం లభిస్తుంది. పాకిస్తాన్ ప్రస్తుతం న్యూజిలాండ్, బంగ్లాదేశ్ కంటే తక్కువ రన్రేట్లో ఉన్నందున, కేవలం గెలిచేంత మాత్రమే కాకుండా, పెద్ద మార్జిన్తో విజయాలు సాధించాల్సిన అవసరం ఉంది.
ఒకవేళ న్యూజిలాండ్ ఈరోజు బంగ్లాదేశ్ను ఓడిస్తే, భారత్, న్యూజిలాండ్ సెమీస్కు దూసుకెళ్తాయి. ఆ సందర్భంలో పాకిస్తాన్ కప్ ఆశలు పూర్తిగా ముగుస్తాయి. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ అభిమానులు తమ జట్టు గెలవాలని మాత్రమే కాదు, భారత్ కూడా న్యూజిలాండ్పై గెలవాలి అనేలా ప్రార్థించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మొత్తంగా పాకిస్తాన్ పరిస్థితి దారుణంగా మారింది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన జట్టుకు వరుస పరాజయాలు ఎదురవడం, ఇప్పుడు ప్రత్యర్థి విజయాలపై ఆధారపడి ఉండడం ఆ జట్టు పరిస్థితి ఎంత దారుణంగా మారిందో చూపుతోంది. ఇక పాక్ సెమీస్ రేసులో నిలవాలంటే, తాము గెలవడమే కాకుండా, భారత్ సైతం వారిని ఆదుకోవాలని ఆశ్రయించాల్సిన దశకు చేరింది.
This post was last modified on February 24, 2025 2:05 pm
ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.…
సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…
మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…
ఒక గంట కునుకు పడితే ఎక్కడ పనికి బ్రేక్ పడుతుందో అన్న రేంజ్ లో చివరి దశ ప్యారడైజ్ పనులను…
దేవుడు నుదుటి మీద రాసే రాతైనా అర్ధం అవుతుందేమో కానీ వైద్యుడు రాసే మందుల పేర్లు మాత్రం అర్ధం కావన్నది…