తెలంగాణలో ఆశ్చర్యకరమైన వైద్య ఘటన చోటుచేసుకుంది. 26 ఏళ్ల యువకుడి ఊపిరితిత్తుల్లో గత 21 ఏళ్లుగా పెన్ క్యాప్ ఉండిపోయిందని, ఆ సమస్యను గుర్తించి విజయవంతంగా తొలగించారని కొండాపూర్ కిమ్స్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. నెల రోజులుగా యువకుడు శ్వాస సమస్యలు, బరువు తగ్గడం, నిరంతరమైన దగ్గుతో బాధపడుతున్నాడు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు స్థానిక వైద్యులు గుర్తించగా, మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు అతడిని కిమ్స్ ఆసుపత్రికి తీసుకువచ్చారు.
ఆసుపత్రిలో సీటీ స్కాన్ నిర్వహించగా, ఊపిరితిత్తుల్లో గడ్డలాంటి ఆకారం కనిపించింది. మొదట దాన్ని సాధారణ ఇన్ఫెక్షన్ అని భావించిన వైద్యులు, మరింత లోతుగా పరీక్షించగా ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. గడ్డలాంటి ఆకారం కాదు, అసలు సమస్య ఊపిరితిత్తుల్లో చిక్కుకుపోయిన పెన్ క్యాప్ అని తెలిసింది. విషయం బయటకురాగానే కుటుంబ సభ్యులను విచారించగా, చిన్నప్పుడు ఆ బాలుడు పెన్ క్యాప్ మింగిన విషయం గుర్తు చేసుకున్నారు. 5 ఏళ్ల వయసులోనే ఇలా జరిగిందని, కానీ అప్పటి వైద్య పరీక్షల్లో ఏమీ తేలలేదని తల్లిదండ్రులు తెలిపారు.
డాక్టర్ శుభకర్ నాదెళ్ల నేతృత్వంలో వైద్య బృందం అత్యంత జాగ్రత్తగా శస్త్రచికిత్స నిర్వహించింది. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఆపరేషన్లో ఫ్లెక్సిబుల్ బ్రాంకోస్కోపీ సాయంతో ముందుగా క్యాప్ చుట్టూ పేరుకుపోయిన కణజాలాన్ని తొలగించారు. తర్వాత, క్యాప్ ను సురక్షితంగా బయటకు తీశారు. వైద్యులు ఎంతో శ్రమించడంతో ఆ యువకుడు పూర్తి ఆరోగ్యంగా కోలుకున్నాడు.
ఇంతకాలం పెన్ క్యాప్ ఊపిరితిత్తుల్లోనే ఉండిపోవడం, అయినా యువకుడు సాధారణ జీవితం గడపగలగడం ఆశ్చర్యకరమైన విషయం అని వైద్యులు తెలిపారు. చిన్నప్పుడు మింగిన చిన్న వస్తువులు ఈ విధంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయొచ్చని, అందుకే తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ ఘటన వైద్య శాస్త్రంలో అరుదైన సందర్భమని, దీని వల్ల భవిష్యత్తులో ఇలాంటి కేసులను త్వరగా గుర్తించే అవకాశం ఉంటుందని వైద్యులు అభిప్రాయపడ్డారు.
ఏపీ సీఎం చంద్రబాబు.. పాలన, ఆయన తీసుకున్న నిర్ణయాలు.. వేస్తున్న అడుగులు, భవిష్యత్తు ఆంధ్ర ప్రదేశ్ నిర్మాణం.. వంటి పలు…
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడతారన్న పేరుంది. పైగా మాటల విషయంలో ఆమె…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…
జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు వరంగల్లో పర్యటించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి నిరంజన్…
ఏపీలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుందని.. మళ్లీ మళ్లీ ప్రభుత్వం మారే పరిస్థితి కూడా ఉండదని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ఆ…