Trends

ఛాంపియన్స్ ట్రోఫీ: పాకిస్థాన్ సెక్యూరిటీ ఏ రేంజ్ లో ఉందంటే?

పాకిస్థాన్ లో క్రికెట్ ఆడాలి అంటేనే భయపడే పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం పాకిస్థాన్ విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. 29 ఏళ్ల తర్వాత ఐసీసీ ఈవెంట్ కు ఆతిథ్యం ఇస్తున్న పాక్, ఈ అవకాశం పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. సెక్యురిటీ విషయంలో బలాన్ని చూపించుకోవాలి అని పాకిస్థాన్ ప్రభుత్వం గతంలో ఎప్పుడు లేనంత హడావుడి చేస్తోంది.

కరాచీ, లాహోర్, రావల్పిండి స్టేడియాలను పునరుద్ధరించి ఆధునీకరించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB), ఈ టోర్నీని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. టోర్నీ నిర్వాహణలో భద్రతకు కూడా పెద్దపీట వేసింది. మొత్తం 18 మంది సీనియర్ అధికారులతో పాటు 54 మంది డీఎస్పీలు, 135 మంది ఇన్‌స్పెక్టర్లు, 10,556 మంది కానిస్టేబుళ్లు, 1,200 మంది సబ్ ఆర్డినేట్లు భద్రతా ఏర్పాట్లలో భాగమయ్యారు.

వీటితోపాటు ప్రత్యేకంగా 200 మంది మహిళా పోలీసులు కూడా నియమించబడ్డారు. ఆటగాళ్లు, ఇతర ప్రముఖుల కోసం 9 ప్రత్యేక చార్టర్డ్ ఫ్లైట్లు ఏర్పాటు చేశారు. లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్ మధ్య ఈ విమానాలు నడుస్తాయి. పాక్ ప్రభుత్వం కూడా ఈ ఈవెంట్‌కు ప్రాధాన్యం ఇస్తూ, అన్ని విభాగాలను సమన్వయం చేస్తోంది. ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్‌లో జరుగుతోంది. టోర్నీ మొత్తం 8 జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి పోటీపడతాయి.

పాకిస్థాన్‌తో పాటు దుబాయ్ కూడా మ్యాచ్‌లకు వేదిక అవుతోంది. టీమిండియా తన అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లోనే ఆడనుంది. ఫిబ్రవరి 17న మొదలైన ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీ మార్చి 9న ముగుస్తుంది. తొలి మ్యాచ్ కరాచీ వేదికగా పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు తలపడగా, ప్రేక్షకుల హోరాహోరీ కలకలం రేపింది. అయితే పాక్ ఎన్ని ప్రయత్నాలు చేసినా, భారత జట్టు దుబాయ్‌నే వేదికగా ఎంచుకోవడం విశేషం.

This post was last modified on February 19, 2025 9:30 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

RRR వల్ల కానిది దురంధర్ చేయగలదా

బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…

25 minutes ago

అక్కడ నెలకు రెండు సార్లు జీతం? ఇదేదో బాగుందే..

ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…

26 minutes ago

నో డౌట్‌: కేసీఆర్‌తోనే క‌విత ఢీ!

తెలంగాణ‌లో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌.. త‌న‌య క‌విత.. నిన్న…

2 hours ago

త‌మిళ‌నాట మైకులు బంద్‌… ఎవ‌రి సత్తా ఎంత‌?

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసింది. ఎన్నిక‌ల సంఘం నిబంధ‌న‌ల మేర‌కు మంగ‌ళ‌వారం సాయంత్రం 5 గంట‌లకే అన్ని పార్టీలు..…

3 hours ago

ఈటీవీ విన్… జాగ్రత్తపడాలి

ఈటీవీ విన్.. పోస్టర్ మీద ఈ లోగో ఉంటే చాలు.. అది సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా అందులో…

6 hours ago

బన్నీపై 7th ఫెయిల్ ట్రోలింగ్

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండింగ్ టాపిక్‌గా మారుతుందో.. దేని మీద నెటిజన్లు చర్చలు పెడతారో చెప్పలేం. కొన్నిసార్లు ఎప్పటివో…

7 hours ago