Trends

భారత్-పాక్ మ్యాచ్ క్రేజ్ – టికెట్ల కోసం ఐసీసీ కొత్త ప్లాన్!

వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా మ్యాచ్‌లకు ప్రత్యేకంగా అదనపు టికెట్లు విడుదల చేయాలని ఐసీసీ నిర్ణయించింది. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా జరగనున్న ఈ మెగా టోర్నీలో భారత్ గ్రూప్-ఏలో భాగంగా బంగ్లాదేశ్, పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లతో తలపడనుంది. భారత అభిమానుల నుంచి భారీ డిమాండ్ ఉన్నందున, ఈ అదనపు టికెట్లు అందుబాటులోకి తెచ్చామని ఐసీసీ ప్రకటించింది.

ఈ టోర్నీ హైబ్రిడ్ మోడల్‌లో జరుగుతున్న నేపథ్యంలో, భారత జట్టు అన్ని మ్యాచ్‌లు దుబాయ్ వేదికగానే ఆడనుంది. టీమిండియా ఫైనల్‌కు చేరినట్టయితే, టైటిల్ మ్యాచ్ కూడా దుబాయ్‌లోనే జరుగుతుందని ఐసీసీ స్పష్టం చేసింది. అయితే, భారత్ సెమీఫైనల్లో ఓడిపోతే మాత్రం ఫైనల్ మ్యాచ్ పాకిస్థాన్‌లోని లాహోర్ వేదికగా జరగనుంది. అందువల్ల, ఫైనల్ మ్యాచ్ టికెట్ల విడుదలకు ఇంకా స్పష్టత రాలేదని ఐసీసీ తెలిపింది.

టీమిండియా ఈ టోర్నీలో ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్, ఫిబ్రవరి 23న పాకిస్థాన్, మార్చి 2న న్యూజిలాండ్‌తో గ్రూప్ దశలో తలపడనుంది. ఈ మ్యాచ్‌లకు ఇప్పటికే టికెట్లు అమ్మకానికి వచ్చాయి. అయితే, భారత జట్టు మ్యాచ్‌లకు భారీ స్థాయిలో ప్రేక్షకులు రావచ్చని అంచనా వేసి, ఐసీసీ అదనపు టికెట్లను విడుదల చేయడం విశేషం. అభిమానుల కోసం టికెట్ బుకింగ్ మరింత సులభతరం చేయాలని కూడా అధికారికంగా ప్రకటించింది.

ఐసీసీ తాజా ప్రకటనతో భారత క్రికెట్ ప్రేమికులు ఉత్సాహంగా ఉన్నారు. ముఖ్యంగా, భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కోసం ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరుగుతుందన్న ఉత్కంఠ కొనసాగుతున్నప్పటికీ, సెమీఫైనల్ అనంతరం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. టోర్నీ ప్రారంభానికి సమయం దగ్గరపడుతున్న కొద్దీ, అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరుగుతోంది.

This post was last modified on February 16, 2025 5:19 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ధనుష్‌కు మాత్రం ఎలా సాధ్యం?

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…

37 minutes ago

ఆవిడ వల్లే ఎన్టీఆర్‌కు భారత రత్న రావట్లేదా?

టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…

2 hours ago

పిఠాపురం ఫ్లెక్సీల రగడ… వర్మదే తప్పన్న బాబు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…

3 hours ago

సినిమా చేయనందుకు హీరో 10 కోట్ల పరిహారం

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…

4 hours ago

IPL: ఛాన్స్ మిస్ చేసుకుంటున్న పెద్ది

ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…

4 hours ago

ఈ నలుగురు కొడితే 10 వేల కోట్లా?

తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా విస్తరించింది. ఒకప్పుడు వందల కోట్లతో ముగిసిపోయే లెక్కలు, ఇప్పుడు వేల…

5 hours ago