Trends

సుప్రీం తీర్పు: ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మరణం.. రూ.9కోట్ల పరిహారం

బస్సు ఢీ కొన్న ఘటనలో మరణించిన మహిళ కుటుంబానికి రూ.9కోట్ల (మరింత కచ్ఛితంగా చెప్పాలంటే రూ.9,64,52,220) పరిహారం ఇవ్వాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. దీనికి సంబంధించిన తీర్పును సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీర్పును ఇచ్చింది. ఈ కేసు వివరాల్లోకి వెళితే.. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న మహిళ పేరు లక్ష్మి నాగళ్ల. ఆమె 2009 జూన్ 13న భర్త.. ఇద్దరు కుమార్తెలతో కలిసి కారులో అన్నవరం నుంచి రాజమహేంద్రవరానికి వెళుతున్నారు. ఈ సందర్భంగా వీరి వాహనానికి ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో లక్ష్మి మరణించారు. అమెరికాలో కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్చేసి.. ఆ దేశ శాశ్విత నివాసిగా ఉన్న తన భార్య అక్కడే నెలకు 11,600 డాలర్లు సంపాదిస్తున్నారని.. ఆమె మరణానికి కారణమైన ఆర్టీసీ నుంచి రూ.9 కోట్లు పరిహారం ఇప్పించాలని భర్త శ్యాంప్రసాద్ నాగళ్ల సికింద్రాబాద్ మోటార్ యాక్సిడెంట్స్ ట్రైబ్యునల్ లో కేసు వేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న ట్రైబ్యునల్ రూ.8.05 కోట్ల పరిహారం చెల్లించాలని ఆర్టీసీని 2014లో ఆదేశించింది.

అయితే..ఈ తీర్పును సవాలు చేస్తూతెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. దీనికి బదులుగా తెలంగాణ హైకోర్టు రూ.5.75 కోట్ల పరిహారం ఇవ్వాలంటూ తీర్పును ఇచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ మరణించిన మహిళ భర్త సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు..బాధితురాలి కుటుంబానికి రూ.9.64 కోట్ల భారీ పరిహారాన్ని ఆర్టీసీ చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ తీర్పు ఇప్పుడు సంచలనంగా మారింది.

This post was last modified on February 12, 2025 1:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘హైదరాబాద్ హౌస్’లో పుతిన్ బస.. ఈ ప్యాలెస్ ఎవరిదో తెలుసా?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…

3 hours ago

బోకేలు, శాలువాలు లేవు… పవన్ రియాక్షన్ ఏంటి?

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…

6 hours ago

నెగిటివిటీ వలయంలో దురంధర్ విలవిలా

బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…

6 hours ago

పరకామణి దొంగను వెనకేసుకొచ్చిన జగన్!

చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…

9 hours ago

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…

10 hours ago

ప్రీమియర్లు క్యాన్సిల్… ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు

ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…

10 hours ago