Trends

సుప్రీం తీర్పు: ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మరణం.. రూ.9కోట్ల పరిహారం

బస్సు ఢీ కొన్న ఘటనలో మరణించిన మహిళ కుటుంబానికి రూ.9కోట్ల (మరింత కచ్ఛితంగా చెప్పాలంటే రూ.9,64,52,220) పరిహారం ఇవ్వాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. దీనికి సంబంధించిన తీర్పును సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీర్పును ఇచ్చింది. ఈ కేసు వివరాల్లోకి వెళితే.. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న మహిళ పేరు లక్ష్మి నాగళ్ల. ఆమె 2009 జూన్ 13న భర్త.. ఇద్దరు కుమార్తెలతో కలిసి కారులో అన్నవరం నుంచి రాజమహేంద్రవరానికి వెళుతున్నారు. ఈ సందర్భంగా వీరి వాహనానికి ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో లక్ష్మి మరణించారు. అమెరికాలో కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్చేసి.. ఆ దేశ శాశ్విత నివాసిగా ఉన్న తన భార్య అక్కడే నెలకు 11,600 డాలర్లు సంపాదిస్తున్నారని.. ఆమె మరణానికి కారణమైన ఆర్టీసీ నుంచి రూ.9 కోట్లు పరిహారం ఇప్పించాలని భర్త శ్యాంప్రసాద్ నాగళ్ల సికింద్రాబాద్ మోటార్ యాక్సిడెంట్స్ ట్రైబ్యునల్ లో కేసు వేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న ట్రైబ్యునల్ రూ.8.05 కోట్ల పరిహారం చెల్లించాలని ఆర్టీసీని 2014లో ఆదేశించింది.

అయితే..ఈ తీర్పును సవాలు చేస్తూతెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. దీనికి బదులుగా తెలంగాణ హైకోర్టు రూ.5.75 కోట్ల పరిహారం ఇవ్వాలంటూ తీర్పును ఇచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ మరణించిన మహిళ భర్త సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు..బాధితురాలి కుటుంబానికి రూ.9.64 కోట్ల భారీ పరిహారాన్ని ఆర్టీసీ చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ తీర్పు ఇప్పుడు సంచలనంగా మారింది.

This post was last modified on February 12, 2025 1:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఓజీకే ఊగిపోతుంటే.. ఉస్తాద్‌ కూడానట

జనసేనాని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. కొన్ని రోజుల కిందటే మళ్లీ ‘పవర్ స్టార్’గా మారారు. రాజకీయ నేతగా, మంత్రిగా…

12 minutes ago

సినీ పితామహుడుగా జూనియర్ ఎన్టీఆర్ ?

ప్రస్తుతం వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమా, దేవర 2లకు కమిట్ మెంట్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత…

53 minutes ago

రోహిత్ శర్మ… ఒక్క ఫోటోతో పొలిటికల్ అలజడి!

ఇటీవల టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలవడం…

1 hour ago

గోవింద‌ప్ప‌కు జైలు.. ఇక నోరు విప్పడమే తరువాయి

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన లిక్క‌ర్ స్కాంలో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న నిందితుడు(ఏ-33)కి విజ‌య‌వాడ‌లోని ఏసీబీ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్…

1 hour ago

పాక్ కు మద్దతు ఇచ్చిన దేశాలకు ఊహించని నష్టాలు

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అనంతరం దేశవ్యాప్తంగా దేశభక్తి జ్వాలలు మిన్నంటుతున్నాయి. పాక్‌కు మద్దతు పలికిన…

2 hours ago

ఉన్నది ఇద్దరే!.. ప్రాధాన్యం ఎనలేనిదే!

నిజమే.. ఏపీలోని కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీకి లోక్ సభలో ఉన్నది ఇద్దరంటే ఇద్దరు సభ్యులు మాత్రమే.…

2 hours ago