భారత క్రికెట్లో అత్యంత విజయవంతమైన జోడీల్లో సచిన్ టెండూల్కర్-వీరేంద్ర సెహ్వాగ్లది ఒకటి. గంగూలీతో కలిసి చరిత్రాత్మక భాగస్వామ్యాలు ఎన్నో నెలకొల్పి, రికార్డుల మోత మోగించాక.. సచిన్ వీరూతో జత కలిశాడు. సచిన్ స్ఫూర్తితో క్రికెట్లోకి వచ్చి, సచిన్ను అనుకరిస్తూ బ్యాటింగ్ చేస్తూ ఆకట్టుకున్న వీరూ.. ఆ తర్వాత తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకున్నాడు.
సచిన్ కెరీర్ ఆరంభంలో ఎలా దూకుడుగా ఆడేవాడో.. అదే స్థాయిలో కెరీర్ ఆద్యంతం విధ్వసంక రీతిలో ఆడుతూ ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే మోస్ట్ డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాట్స్మన్గా గుర్తింపు తెచ్చుకున్నాడతను. వీరూ అంటేనే విధ్వసం అనే పేరు వచ్చింది.
తాజాగా వీరూ 42వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా వీరూ ‘గాడ్’గా పిలుచుకునే సచిన్ అతడికి తనదైన శైలిలో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు.
వీరూకు ఇప్పుడు 42 ఏళ్లు వచ్చాయని.. 4, 2 కలిపితే 6 అవుతుందని.. కెరీర్లో ఎప్పుడూ వీరూ 4, 6లతోనే డీల్ చేశాడని పేర్కొంటూ.. అతను వందేళ్లు వర్ధిల్లాని ఆశిస్తూ హిందీలో జన్మదిన శుభాకాంక్షలు చెప్పాడు సచిన్.
దీనికి వీరూ కూడా తనదైన శైలిలో బదులిచ్చాడు. సచిన్కు 47 ఏళ్లొచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ.. 4, 7 కలిపితే 11 అవుతుందని.. కానీ సచిన్ మాత్రం కెరీర్ ఆద్యంతం సెంచరీలతోనే డీల్ చేశాడని.. ఆటకు సచిన్ చేసిన సేవలను అభివర్ణించడానికి ఏ నంబర్ల కాంబినేషన్ కూడా సరిపోదని వీరూ పేర్కొన్నాడు. తనకు స్ఫూర్తిగా నిలిచినందుకు, జన్మదిన శుభాకాంక్షలు చెప్పినందుకు వీరూ సచిన్కు ధన్యవాదాలు చెప్పాడు.
క్రికెట్ కెరీర్లో ఆద్యంతం ఎలా అయితే డాషింగ్ బ్యాటింగ్తో అభిమానులను అలరించాడో.. ట్విట్టర్లో సైతం వీరూ అలాగే సరదా పోస్టులతో వినోదాన్నందిస్తుంటాడు. అందుకే సచిన్ కూడా వీరూకు ఫన్నీగా విష్ చేస్తే.. అతను తనదైన శైలిలో మాస్టర్కు బదులిచ్చాడు.
This post was last modified on October 21, 2020 10:26 am
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…