భారత్ మరోసారి టీ20 క్రికెట్లో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఇంగ్లండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది. పుణెలో జరిగిన నాలుగో మ్యాచ్లో 15 పరుగుల తేడాతో గెలిచి, మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ను తన ఖాతాలో వేసుకుంది.
182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ జట్టు గెలిచే క్రమంలో చివరలో మ్యాచ్ ను చేజార్చుకుంది. ఇక 19.4 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్ లలో హ్యారీ బ్రూక్ మాత్రమే మధ్యలో గెలుపుపై ఆశలు చిగురించాడు.
అతను 51 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడినా, జట్టుకు విజయం అందించలేకపోయాడు. ముఖ్యంగా భారత బౌలర్లు ఈ విజయానికి కారణమయ్యారు. హర్షిత్ రాణా వేసిన మొదటి ఓవర్ లొనే డేంజరస్ బ్యాట్స్ మెన్ లివింగ్ స్టన్ ను ఔట్ చేసి ఇంగ్లండ్ ను గట్టి దెబ్బ కొట్టాడు. హర్షిత్, రవి బిష్ణోయ్ చెరో మూడు వికెట్లు తీయగా వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు తీసి, ప్రత్యర్థి మిడిల్ ఆర్డర్ను దెబ్బతీశాడు. అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్ ఒక్కో వికెట్ తీశారు.
మ్యాచ్ ప్రారంభంలో ఫిలిప్ సాల్ట్ (23), డకెట్ (39) దూకుడుగా ఆడినా, రవి బిష్ణోయ్ బౌలింగ్తో ఈ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేయడంతో భారత్ మళ్లీ కంట్రోల్లోకి వచ్చింది. అయితే భారత బ్యాటింగ్లో టాప్ ఆర్డర్ మరోసారి నిరాశపరిచింది. సంజు శాంసన్ (1), అభిషేక్ శర్మ (29) తక్కువ పరుగులకే ఔటవ్వగా, తిలక్ వర్మ (0), సూర్యకుమార్ యాదవ్ (0) డకౌట్ అయ్యారు. మహ్మూద్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి భారత్ను కష్టాల్లో పడేశాడు.
కానీ రింకు సింగ్ ఆటతో ఇంగ్లండ్ దూకుడుకు బ్రేక్ వేశాడు, ఆల్రౌండర్లు శివమ్ ధూబే (53) మరియు హార్దిక్ పాండ్య (53) అద్భుతమైన అర్ధశతకాలు సాధించి జట్టును గట్టెక్కించారు. ఈ విజయంతో టీమ్ ఇండియా మరో సిరీస్ను గెలుచుకొని తమ ఫామ్ను కొనసాగించింది.
ఇంగ్లండ్పై టీ20 క్రికెట్లో భారత్ హవా కొనసాగుతూనే ఉంది. చివరి మ్యాచ్ ఫలితం సంబంధం లేకపోయినా, భారత్ అది కూడా గెలిచి 4-1 తేడాతో సిరీస్ ముగించాలని చూస్తోంది. ఇక ఆ మ్యాచ్ లో బెంచ్ పైన ఉన్న ఆటగాళ్లకు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది.
This post was last modified on January 31, 2025 11:06 pm
ఒక కథ ఒక చోటి నుంచి ఇంకో చోటికి ప్రయాణం చేయడం.. ఎవరికో అనుకున్న కథ ఇంకెవరికో సెట్ కావడం…
బీజేపీ సీనియర్ నాయకుడు, ఘోషా మహల్ ఎమ్మెల్యే, వివాదాలకు కేంద్రంగా ఉన్న రాజా సింగ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.…
కేవలం సినిమాలో వినోదం ఉంటే సరిపోదని.. ప్రమోషన్లను కూడా సినిమా థీమ్కు తగ్గట్లు సరదాగా డిజైన్ చేసి ప్రేక్షకుల దృష్టిని…
భారతదేశంలో 5G సేవలు చాలా వేగంగా విస్తరిస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం 776 జిల్లాల్లో…
‘మిర్చి’ సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్లో ‘నా ఫ్యామిలీ సేఫ్’ అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ ఎంత పాపులరో కొత్తగా చెప్పాల్సిన…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడును గురువారం తెలంగాణకు చెందిన సీనియర్ మోస్ట్ రాజకీయ నేత, మాజీ మంత్రి…