Trends

ఇంగ్లండ్‌పై భారత్ విజృంభణ.. సిరీస్‌ పట్టేసిన టీమ్ ఇండియా

భారత్ మరోసారి టీ20 క్రికెట్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది. పుణెలో జరిగిన నాలుగో మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో గెలిచి, మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను తన ఖాతాలో వేసుకుంది.

182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ జట్టు గెలిచే క్రమంలో చివరలో మ్యాచ్ ను చేజార్చుకుంది. ఇక 19.4 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్ లలో హ్యారీ బ్రూక్ మాత్రమే మధ్యలో గెలుపుపై ఆశలు చిగురించాడు.

అతను 51 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడినా, జట్టుకు విజయం అందించలేకపోయాడు. ముఖ్యంగా భారత బౌలర్లు ఈ విజయానికి కారణమయ్యారు. హర్షిత్ రాణా వేసిన మొదటి ఓవర్ లొనే డేంజరస్ బ్యాట్స్ మెన్ లివింగ్ స్టన్ ను ఔట్ చేసి ఇంగ్లండ్ ను గట్టి దెబ్బ కొట్టాడు. హర్షిత్, రవి బిష్ణోయ్ చెరో మూడు వికెట్లు తీయగా వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు తీసి, ప్రత్యర్థి మిడిల్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్ ఒక్కో వికెట్ తీశారు.

మ్యాచ్ ప్రారంభంలో ఫిలిప్ సాల్ట్ (23), డకెట్ (39) దూకుడుగా ఆడినా, రవి బిష్ణోయ్ బౌలింగ్‌తో ఈ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేయడంతో భారత్ మళ్లీ కంట్రోల్‌లోకి వచ్చింది. అయితే భారత బ్యాటింగ్‌లో టాప్ ఆర్డర్ మరోసారి నిరాశపరిచింది. సంజు శాంసన్ (1), అభిషేక్ శర్మ (29) తక్కువ పరుగులకే ఔటవ్వగా, తిలక్ వర్మ (0), సూర్యకుమార్ యాదవ్ (0) డకౌట్ అయ్యారు. మహ్మూద్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి భారత్‌ను కష్టాల్లో పడేశాడు.

కానీ రింకు సింగ్ ఆటతో ఇంగ్లండ్ దూకుడుకు బ్రేక్ వేశాడు, ఆల్‌రౌండర్లు శివమ్ ధూబే (53) మరియు హార్దిక్ పాండ్య (53) అద్భుతమైన అర్ధశతకాలు సాధించి జట్టును గట్టెక్కించారు. ఈ విజయంతో టీమ్ ఇండియా మరో సిరీస్‌ను గెలుచుకొని తమ ఫామ్‌ను కొనసాగించింది.

ఇంగ్లండ్‌పై టీ20 క్రికెట్‌లో భారత్ హవా కొనసాగుతూనే ఉంది. చివరి మ్యాచ్ ఫలితం సంబంధం లేకపోయినా, భారత్ అది కూడా గెలిచి 4-1 తేడాతో సిరీస్ ముగించాలని చూస్తోంది. ఇక ఆ మ్యాచ్ లో బెంచ్ పైన ఉన్న ఆటగాళ్లకు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది.

This post was last modified on January 31, 2025 11:06 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

2 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

2 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

2 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

2 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

4 hours ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

4 hours ago