Trends

ఇంగ్లండ్‌పై భారత్ విజృంభణ.. సిరీస్‌ పట్టేసిన టీమ్ ఇండియా

భారత్ మరోసారి టీ20 క్రికెట్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది. పుణెలో జరిగిన నాలుగో మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో గెలిచి, మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను తన ఖాతాలో వేసుకుంది.

182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ జట్టు గెలిచే క్రమంలో చివరలో మ్యాచ్ ను చేజార్చుకుంది. ఇక 19.4 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్ లలో హ్యారీ బ్రూక్ మాత్రమే మధ్యలో గెలుపుపై ఆశలు చిగురించాడు.

అతను 51 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడినా, జట్టుకు విజయం అందించలేకపోయాడు. ముఖ్యంగా భారత బౌలర్లు ఈ విజయానికి కారణమయ్యారు. హర్షిత్ రాణా వేసిన మొదటి ఓవర్ లొనే డేంజరస్ బ్యాట్స్ మెన్ లివింగ్ స్టన్ ను ఔట్ చేసి ఇంగ్లండ్ ను గట్టి దెబ్బ కొట్టాడు. హర్షిత్, రవి బిష్ణోయ్ చెరో మూడు వికెట్లు తీయగా వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు తీసి, ప్రత్యర్థి మిడిల్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్ ఒక్కో వికెట్ తీశారు.

మ్యాచ్ ప్రారంభంలో ఫిలిప్ సాల్ట్ (23), డకెట్ (39) దూకుడుగా ఆడినా, రవి బిష్ణోయ్ బౌలింగ్‌తో ఈ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేయడంతో భారత్ మళ్లీ కంట్రోల్‌లోకి వచ్చింది. అయితే భారత బ్యాటింగ్‌లో టాప్ ఆర్డర్ మరోసారి నిరాశపరిచింది. సంజు శాంసన్ (1), అభిషేక్ శర్మ (29) తక్కువ పరుగులకే ఔటవ్వగా, తిలక్ వర్మ (0), సూర్యకుమార్ యాదవ్ (0) డకౌట్ అయ్యారు. మహ్మూద్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి భారత్‌ను కష్టాల్లో పడేశాడు.

కానీ రింకు సింగ్ ఆటతో ఇంగ్లండ్ దూకుడుకు బ్రేక్ వేశాడు, ఆల్‌రౌండర్లు శివమ్ ధూబే (53) మరియు హార్దిక్ పాండ్య (53) అద్భుతమైన అర్ధశతకాలు సాధించి జట్టును గట్టెక్కించారు. ఈ విజయంతో టీమ్ ఇండియా మరో సిరీస్‌ను గెలుచుకొని తమ ఫామ్‌ను కొనసాగించింది.

ఇంగ్లండ్‌పై టీ20 క్రికెట్‌లో భారత్ హవా కొనసాగుతూనే ఉంది. చివరి మ్యాచ్ ఫలితం సంబంధం లేకపోయినా, భారత్ అది కూడా గెలిచి 4-1 తేడాతో సిరీస్ ముగించాలని చూస్తోంది. ఇక ఆ మ్యాచ్ లో బెంచ్ పైన ఉన్న ఆటగాళ్లకు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది.

This post was last modified on January 31, 2025 11:06 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

2 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

3 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

4 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

5 hours ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

6 hours ago

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

7 hours ago